ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పాలు పంచుకున్న జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు దక్కాయి. వీటిలోనూ కేవలం ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి పదవి కూడా.. ఆ పార్టీకే దక్కింది. వాస్తవానికి ఎన్నికలకు ముందు గెలిస్తే చాలని అనుకున్న జనసేన పార్టీ.. ఆదిశగా తన ప్రచారం చేసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు.. ‘సీఎం-సీఎం’ అంటూ అరుపులు, కేకలు పెట్టినా.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రం సంయమనంతో వ్యవహరించారు. ముందు పార్టీని గెలిపించండి.. తర్వాత పదవు లు చూద్దామని చాలా విజ్ఞత, ఓర్పును ప్రదర్శించారు. అనుకున్నట్టుగా కాకుండా.. అమితంగానే ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
పోటీ చేసిన 21 స్థానాల్లోనూ జనసేన విజయ దుందుభి మొగించింది. ఈ పరిణామాలతో టీడీపీ అధినేత, కూటమి పార్టీల నాయకుడు చంద్రబాబు.. జనసేనకు ప్రాధాన్యం పెంచారు. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల కోరికను ఆయన ఎలాంటి ప్రకటనలు చేయ కుండా తీర్చే ప్రయత్నం చేశారు. ఎవరూ ఊహించని విధంగా పవన్ కల్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. వాస్తవానికి టీడీపీ అధికారంలోకి వస్తే.. నారా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ, చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి.. పవన్కు ఈ అవకాశం ఇచ్చారు.
తద్వారా.. జనసేన.. కష్టకాలంలో టీడీపీకి అండగా ఉన్న నేపథ్యంలో ఆ రకంగా ఆయన తన ఉదారతను, విశ్వసనీయతను చాటుకున్నారు. ఈ పరిణామాలు.. జనసేనలోనూ టీడీపీపై ఆసక్తి నెలకొంది. తమకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారన్న టాక్ మరింత పెరిగింది. ఇదేసమయంలో పవన్ను నెంబర్ 2గా చూస్తున్నారని కూడా జనసేన నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఫలితాలు వచ్చిన తర్వాత.. ఇప్పటి వరకు జనసేన వర్గాలు హ్యాపీగానే ఉన్నాయి. ఇదిలావుంటే.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కల్యాణ్కు ఎలాంటి అధికారాలు దక్కుతాయనేది చర్చ.
ఇవీ.. పవన్కు దక్కే అధికారాలు
This post was last modified on June 15, 2024 7:55 am
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…