ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పాలు పంచుకున్న జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు దక్కాయి. వీటిలోనూ కేవలం ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి పదవి కూడా.. ఆ పార్టీకే దక్కింది. వాస్తవానికి ఎన్నికలకు ముందు గెలిస్తే చాలని అనుకున్న జనసేన పార్టీ.. ఆదిశగా తన ప్రచారం చేసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు.. ‘సీఎం-సీఎం’ అంటూ అరుపులు, కేకలు పెట్టినా.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రం సంయమనంతో వ్యవహరించారు. ముందు పార్టీని గెలిపించండి.. తర్వాత పదవు లు చూద్దామని చాలా విజ్ఞత, ఓర్పును ప్రదర్శించారు. అనుకున్నట్టుగా కాకుండా.. అమితంగానే ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
పోటీ చేసిన 21 స్థానాల్లోనూ జనసేన విజయ దుందుభి మొగించింది. ఈ పరిణామాలతో టీడీపీ అధినేత, కూటమి పార్టీల నాయకుడు చంద్రబాబు.. జనసేనకు ప్రాధాన్యం పెంచారు. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల కోరికను ఆయన ఎలాంటి ప్రకటనలు చేయ కుండా తీర్చే ప్రయత్నం చేశారు. ఎవరూ ఊహించని విధంగా పవన్ కల్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. వాస్తవానికి టీడీపీ అధికారంలోకి వస్తే.. నారా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ, చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి.. పవన్కు ఈ అవకాశం ఇచ్చారు.
తద్వారా.. జనసేన.. కష్టకాలంలో టీడీపీకి అండగా ఉన్న నేపథ్యంలో ఆ రకంగా ఆయన తన ఉదారతను, విశ్వసనీయతను చాటుకున్నారు. ఈ పరిణామాలు.. జనసేనలోనూ టీడీపీపై ఆసక్తి నెలకొంది. తమకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారన్న టాక్ మరింత పెరిగింది. ఇదేసమయంలో పవన్ను నెంబర్ 2గా చూస్తున్నారని కూడా జనసేన నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఫలితాలు వచ్చిన తర్వాత.. ఇప్పటి వరకు జనసేన వర్గాలు హ్యాపీగానే ఉన్నాయి. ఇదిలావుంటే.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కల్యాణ్కు ఎలాంటి అధికారాలు దక్కుతాయనేది చర్చ.
ఇవీ.. పవన్కు దక్కే అధికారాలు
This post was last modified on June 15, 2024 7:55 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…