24 మంది మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించగా, మంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముహూర్తాలను వెతుక్కునే పనిలో పడ్డారు. అయితే చంద్రబాబు క్యాబినెట్ లో అందరూ ఉన్నత విద్యావంతులు ఉండడం విశేషం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎ ఎకనామిక్స్ చదివారు. జనసేన నుండి మంత్రి అయిన కందుల దుర్గేష్ కూడా ఎంఎ ఎకనామిక్స్ చదివారు. బీజేపీ నుండి మంత్రి అయిన సత్యకుమార్ యాదవ్ ఎంఎ పొలిటికల్ సైన్స్ చదివారు. ఆయనకు హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ భాషలు అనర్గళంగా వస్తాయి.
నారా లోకేష్ అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, టీజీ భరత్ బ్రిటన్ లో ఎంబీఎ చదివారు. నాదెండ్ల మనోహర్ ఎంబీఎతో పాటు మార్కెటింగ్ స్పెషలైజేషన్ చదివారు. పయ్యావుల కేశవ్ కూడా మార్కెటింగ్ స్పెషలైజేషన్ చదివారు. మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇంజనీరింగ్ చదవగా, డోలా బాల వీరాంజనేయ స్వామి వైద్య విద్యను అభ్యసించారు.
నిమ్మల రామానాయుడు ఎంఎ, ఎంఫిల్ చదివి పీహెచ్డీ డాక్టరేట్ అందుకున్నారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బీడీఎస్ ను మద్యలో ఆపేశారు. కొండపల్లి శ్రీనివాస్ యూఎస్ లో ఎంఎస్ చదవగా, ఆనం రామనారాయణ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్రలు న్యాయవిద్యను అభ్యసించారు. పొంగూరు నారాయణ, వంగలపూడి అనితలు పీజీ పూర్తి చేశారు. సవిత, సంద్యారాణి, బీసీ జనార్ధన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధసారధిలు డిగ్రీ చదివారు. అచ్చెన్నాయుడు బీఎస్సీ మధ్యలో ఆపేయగా, ఎన్ఎండీ ఫరూక్ ఇంటర్ పూర్తిచేశారు.
This post was last modified on June 14, 2024 5:52 pm
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…