Political News

బాబుది ఎడ్యుకేటెడ్ కేబినెట్

24 మంది మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించగా, మంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముహూర్తాలను వెతుక్కునే పనిలో పడ్డారు. అయితే చంద్రబాబు క్యాబినెట్ లో అందరూ ఉన్నత విద్యావంతులు ఉండడం విశేషం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎ ఎకనామిక్స్ చదివారు. జనసేన నుండి మంత్రి అయిన కందుల దుర్గేష్ కూడా ఎంఎ ఎకనామిక్స్ చదివారు. బీజేపీ నుండి మంత్రి అయిన సత్యకుమార్ యాదవ్ ఎంఎ పొలిటికల్ సైన్స్ చదివారు. ఆయనకు హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ భాషలు అనర్గళంగా వస్తాయి.

నారా లోకేష్ అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, టీజీ భరత్ బ్రిటన్ లో ఎంబీఎ చదివారు. నాదెండ్ల మనోహర్ ఎంబీఎతో పాటు మార్కెటింగ్ స్పెషలైజేషన్ చదివారు. పయ్యావుల కేశవ్ కూడా మార్కెటింగ్ స్పెషలైజేషన్ చదివారు. మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇంజనీరింగ్ చదవగా, డోలా బాల వీరాంజనేయ స్వామి వైద్య విద్యను అభ్యసించారు.

నిమ్మల రామానాయుడు ఎంఎ, ఎంఫిల్ చదివి పీహెచ్డీ డాక్టరేట్ అందుకున్నారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బీడీఎస్ ను మద్యలో ఆపేశారు. కొండపల్లి శ్రీనివాస్ యూఎస్ లో ఎంఎస్ చదవగా, ఆనం రామనారాయణ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్రలు న్యాయవిద్యను అభ్యసించారు. పొంగూరు నారాయణ, వంగలపూడి అనితలు పీజీ పూర్తి చేశారు. సవిత, సంద్యారాణి, బీసీ జనార్ధన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధసారధిలు డిగ్రీ చదివారు. అచ్చెన్నాయుడు బీఎస్సీ మధ్యలో ఆపేయగా, ఎన్ఎండీ ఫరూక్ ఇంటర్ పూర్తిచేశారు.

This post was last modified on June 14, 2024 5:52 pm

Share
Show comments
Published by
satya
Tags: Chandrababu

Recent Posts

లోకేష్ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఎవరివి ?!

ఐదేండ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఐపీసీ చట్టాలను గాలికి వదిలేసి ప్రభుత్వ అధికారులు వైసీపీ చట్టాలను అమలు చేశారు…

47 mins ago

చేసిన పాపం.. పొన్న‌వోలుకు శాపం..

వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ అడుగుల‌కు మ‌డుగులొత్తిన అధికారులు.. ఇప్పుడు తెర‌చాటున రోదిస్తున్నారు. ఉన్న‌తాధికారులుగా చ‌క్రం తిప్పిన వారంతా ఇప్పుడు అలో…

10 hours ago

ఫ్యాన్ మర్డర్ – సరికొత్త మలుపులు

ఒక మంచి క్రైమ్ వెబ్ సిరీస్ కు సరిపడా కంటెంట్ కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసులో దొరుకుతోంది. స్వయానా…

11 hours ago

సుధీర్ బాబు కష్టానికి మహారాజ బ్రేకులు

చాలా గ్యాప్ తరువాత సుధీర్ బాబు సినిమా డిజాస్టర్ కాదు పర్వాలేదనిపించుకున్న సినిమా హరోంహర. మరీ యునానిమస్ గా పాజిటివ్…

12 hours ago

మొత్తానికి జగన్ ప్యాలస్ లో అడుగుపెట్టిన సామాన్యుడు

విశాఖ‌ప‌ట్నం సాగ‌ర తీరంలో ఉండే ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం రుషి కొండ‌ను తొలిచి.. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం భారీ ఎత్తున…

12 hours ago

నితిన్ చైతులకు డిసెంబర్ గండం

ఎప్పుడో ఆరేడు నెలల తర్వాత రిలీజ్ డేట్లు లాక్ చేసుకున్నా ఎలాంటి పోటీ, సమస్య రాదనే గ్యారెంటీ లేని పరిస్థితులు…

12 hours ago