Political News

బాబుకు ఆమె బొకే ఇవ్వబోతే..

శ్రీ లక్ష్మి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వివాదాస్పదంగా మారిన ఐఏఎస్ అధికారిణి. వైఎస్ హయాంలో ఆమె అడ్డగోలుగా వ్యవహరించి ముఖ్యమంత్రి తనయుడైన జగన్‌కు మేళ్లు చేసిందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న తెలిసిందే.

అవినీతి కేసుల్లో చిక్కుకుని జైలు జీవితం కూడా అనుభవించారామె. ఐతే అంత జరిగాక కూడా శ్రీలక్ష్మిలో ఏ మార్పూ రాలేదనే చర్చ జరిగింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆమెకు ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చారు.

గత ఐదేళ్లలో ఆమె వ్యవహార శైలి, తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఒక పెద్ద పతనం తర్వాత మళ్లీ ఆమె గత ఐదేళ్లలో వైభవం చూశారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగింది.

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మామూలుగా చంద్రబాబుకు అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టరనే అభిప్రాయం ఉంది.

తాను మెచ్చిన అధికారులకు ప్రయారిటీ ఇస్తారే తప్ప.. ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులను పనిగట్టుకుని టార్గెట్ చేయరని చంద్రబాబుకు ఒక పేరుంది. కానీ బాబు ఈసారి భిన్నంగా వ్యవహరించబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

తప్పు చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఇప్పటికే ప్రకటన చేసిన ఆయన.. జగన్ హయాంలో హద్దులు దాటి ప్రవర్తించిన అధికారులకు చుక్కలు చూపించబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తనను అభినందించడానికి అధికారులు క్యూ కట్టగా.. అందులో శ్రీలక్ష్మి కూడా ఉన్నారు. ఆమె బాబుకు బొకే ఇవ్వబోతే ఆయన తిరస్కరించడం, శ్రీలక్ష్మి నవ్వుతూ వెళ్లిపోవడం.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది చూసి బాబు మారిపోయారని.. జగన్ హయాంలో తమ పరిధి దాటి వ్యవహరించిన అధికారులకు తిప్పలు తప్పవని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on June 14, 2024 4:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago