Political News

బాబుకు ఆమె బొకే ఇవ్వబోతే..

శ్రీ లక్ష్మి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వివాదాస్పదంగా మారిన ఐఏఎస్ అధికారిణి. వైఎస్ హయాంలో ఆమె అడ్డగోలుగా వ్యవహరించి ముఖ్యమంత్రి తనయుడైన జగన్‌కు మేళ్లు చేసిందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న తెలిసిందే.

అవినీతి కేసుల్లో చిక్కుకుని జైలు జీవితం కూడా అనుభవించారామె. ఐతే అంత జరిగాక కూడా శ్రీలక్ష్మిలో ఏ మార్పూ రాలేదనే చర్చ జరిగింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆమెకు ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చారు.

గత ఐదేళ్లలో ఆమె వ్యవహార శైలి, తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఒక పెద్ద పతనం తర్వాత మళ్లీ ఆమె గత ఐదేళ్లలో వైభవం చూశారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగింది.

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మామూలుగా చంద్రబాబుకు అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టరనే అభిప్రాయం ఉంది.

తాను మెచ్చిన అధికారులకు ప్రయారిటీ ఇస్తారే తప్ప.. ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులను పనిగట్టుకుని టార్గెట్ చేయరని చంద్రబాబుకు ఒక పేరుంది. కానీ బాబు ఈసారి భిన్నంగా వ్యవహరించబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

తప్పు చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఇప్పటికే ప్రకటన చేసిన ఆయన.. జగన్ హయాంలో హద్దులు దాటి ప్రవర్తించిన అధికారులకు చుక్కలు చూపించబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తనను అభినందించడానికి అధికారులు క్యూ కట్టగా.. అందులో శ్రీలక్ష్మి కూడా ఉన్నారు. ఆమె బాబుకు బొకే ఇవ్వబోతే ఆయన తిరస్కరించడం, శ్రీలక్ష్మి నవ్వుతూ వెళ్లిపోవడం.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది చూసి బాబు మారిపోయారని.. జగన్ హయాంలో తమ పరిధి దాటి వ్యవహరించిన అధికారులకు తిప్పలు తప్పవని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on June 14, 2024 4:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

20 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

40 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago