Political News

ర‌ద్ద‌న్న‌దే ముద్ద‌యింది కదా జ‌గ‌న్!

జ‌గ‌న్‌.. అంటే ఏంటి? అని ఇటీవ‌ల జాతీయ రాజ‌కీయ నాయ‌కుడిని ప్ర‌శ్నిస్తే.. ‘అర్ధంకాని పేజీ’ అని బ‌దులిచ్చారు. నిజ‌మేన‌ని అనిపిస్తుంది. ఎందుకంటే.. తాను తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆయ‌న ఒక్క‌సారి అద్దం ముందు నిల‌బ‌డి ‘ఇవి స‌రైన‌వేనా?’ అని ఆలోచించుకుంటే.. ఆయ‌న‌కే త‌త్వం బోధ‌ప‌డుతుంది. ఒక్క‌సారి ఇచ్చిన ఛాన్స్‌ను ఒబ్బిడిగా వినియోగించుకుని ..ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందాల్సిన ముఖ్యమంత్రి .. ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్‌తోనే ప‌రిమితం కానున్నార‌నే కామెంట్లు మొద‌ల‌య్యారు.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. తాను ఒక‌ప్పుడు ర‌ద్దు చేసేస్తా.. రంగు తీసేస్తా.. అంటూ.. అసెంబ్లీలోనే పెద్ద ఎత్తున జ‌గ‌న్ వ్యాఖ్యానించిన శాస‌న మండ‌లి.. ఇప్పుడు ఆయ‌న‌కు ఆద‌ర‌వుగా నిలిచింది. మూడు రాజ ధాని బిల్లు విష‌యంలో త‌లెత్తిన వివాదం కార‌ణంగా.. జ‌గ‌న్ అప్ప‌ట్లో మండ‌లిని ర‌ద్దు చేస్తూ.. నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసింది. దీనిని కేంద్రానికి కూడా హుటాహుటిన పంపేశారు. కానీ, కేంద్రంలోని పెద్ద‌లు ఢ‌క్కాముక్కీలు తిన్న వారు కావ‌డంతో జ‌గ‌న్ పిల్ల చేష్ఠ‌ల‌ను ప‌క్క‌న పెట్టారు.

దీంతో మండ‌లి ర‌ద్దు కాలేదు. పైగా.. రెండేళ్లు తిరిగే స‌రికి.. అదే మండ‌లిలో ఇప్పుడు వైసీపీ నాయ‌కులు క‌ళ‌క‌ళలాడుతున్నారు. మొత్తం 35 మంది ఎమ్మెల్సీలు.. మండ‌లిలో వైసీపీ నాయ‌కులే ఉన్నారు. ఇప్పుడు .. అధికారం కోల్పోయి,. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోలేక నిలువునా విల‌పిస్తున్న వైసీపీకి.. ప్రాణం పోసింది ఏదైనా ఉందంటే.. అది ఒక్క మండ‌లి మాత్ర‌మే. ఎందుకంటే.. వైసీపీకి ఇప్పుడు వాయిస్ వినిపించే స‌త్తా.. వంటివి కేవ‌లం మండ‌లిలోనే ఉన్నాయి.

పైగా మండ‌లి ఇప్పుడు వైసీపీ స్వాధీనంలోనే ఉంది. ఆ పార్టీకి చెందిన మోషేన్ రాజు మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్నారు. దీంతో టీడీపీ ప్ర‌భుత్వం ఎంత బ‌లంగా ఉన్నా.. మండ‌లికి వ‌చ్చే స‌రికి మాత్రం వైసీపీ దే పైచేయి.. మ‌రో రెండున్న ర సంవ‌త్స‌రాల వ‌ర‌కు వైసీపీనే హ‌వా చ‌లాయిస్తుంది. ఇక్క‌డ విష‌యం ఏంటంటే.. అప్ప‌ట్లో రాజ‌ధాని అమ‌రావతిని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే.. మండ‌లిని కూడా ప‌క్క‌న పెట్టేసి ఉంటే.. జ‌గ‌న్‌కు ఇప్పుడు చెప్పుకొనేందుకు వేదిక కూడా దొరికేది కాదు. బ‌హుశ అందుకేనేమో.. జాతీయ నాయ‌కులు అర్ధం కాని పేజీ అంటూ.. జ‌గ‌న్ పై స‌టైర్లు వేసింది!!

This post was last modified on June 14, 2024 4:02 pm

Share

Recent Posts

మూడేళ్ల ముందు 100 కోట్లు… ఇప్పుడు 3 కోట్లు

తమిళంలో చాలా ఏళ్ల నుంచి మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఉంటున్నాడు తెలుగువాడైన విశాల్. ‘సెండై కోళి’తో తమిళనాట స్టార్ ఇమేజ్…

4 hours ago

ఏపీలో ఉద్యోగాల పండగ

ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపిక‌బురు చెప్పింది. ఈ ఏడాదిలో 10 వేల‌కుపైగా స‌ర్కారీ…

9 hours ago

తెలంగాణ సర్… కాంగ్రెస్ లేట్ చేసిందా?

తెలంగాణ‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన స్పెష‌ల్ ఇంటెన్సివ్ రిజ‌విజ‌న్(స‌ర్‌) ప్ర‌క్రియ దాదాపు రెండు మాసాల పాటు సాగింది. రెండు…

9 hours ago

అసలు గుడ్ న్యూస్ ఎప్పుడు నిఖిల్

టాలీవుడ్ లో కొన్ని ప్యాన్ ఇండియా సినిమాల సంకట స్థితి అంతా ఇంతా కాదు. విడుదల తేదీ తేల్చకుండా, అభిమానుల…

13 hours ago

రామ్ పోతినేని 23… ఊహించని ఆర్టిస్ట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ఇటీవలే పుదుచెరి షెడ్యూల్…

14 hours ago

వంశీని జగన్ దూరం పెడుతున్నారా?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత జగన్ దూరం పెడుతున్నారా? తన పార్టీలోని మిగతా నేతలతో ఉన్నంత…

14 hours ago