Political News

ర‌ద్ద‌న్న‌దే ముద్ద‌యింది కదా జ‌గ‌న్!

జ‌గ‌న్‌.. అంటే ఏంటి? అని ఇటీవ‌ల జాతీయ రాజ‌కీయ నాయ‌కుడిని ప్ర‌శ్నిస్తే.. ‘అర్ధంకాని పేజీ’ అని బ‌దులిచ్చారు. నిజ‌మేన‌ని అనిపిస్తుంది. ఎందుకంటే.. తాను తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆయ‌న ఒక్క‌సారి అద్దం ముందు నిల‌బ‌డి ‘ఇవి స‌రైన‌వేనా?’ అని ఆలోచించుకుంటే.. ఆయ‌న‌కే త‌త్వం బోధ‌ప‌డుతుంది. ఒక్క‌సారి ఇచ్చిన ఛాన్స్‌ను ఒబ్బిడిగా వినియోగించుకుని ..ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందాల్సిన ముఖ్యమంత్రి .. ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్‌తోనే ప‌రిమితం కానున్నార‌నే కామెంట్లు మొద‌ల‌య్యారు.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. తాను ఒక‌ప్పుడు ర‌ద్దు చేసేస్తా.. రంగు తీసేస్తా.. అంటూ.. అసెంబ్లీలోనే పెద్ద ఎత్తున జ‌గ‌న్ వ్యాఖ్యానించిన శాస‌న మండ‌లి.. ఇప్పుడు ఆయ‌న‌కు ఆద‌ర‌వుగా నిలిచింది. మూడు రాజ ధాని బిల్లు విష‌యంలో త‌లెత్తిన వివాదం కార‌ణంగా.. జ‌గ‌న్ అప్ప‌ట్లో మండ‌లిని ర‌ద్దు చేస్తూ.. నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసింది. దీనిని కేంద్రానికి కూడా హుటాహుటిన పంపేశారు. కానీ, కేంద్రంలోని పెద్ద‌లు ఢ‌క్కాముక్కీలు తిన్న వారు కావ‌డంతో జ‌గ‌న్ పిల్ల చేష్ఠ‌ల‌ను ప‌క్క‌న పెట్టారు.

దీంతో మండ‌లి ర‌ద్దు కాలేదు. పైగా.. రెండేళ్లు తిరిగే స‌రికి.. అదే మండ‌లిలో ఇప్పుడు వైసీపీ నాయ‌కులు క‌ళ‌క‌ళలాడుతున్నారు. మొత్తం 35 మంది ఎమ్మెల్సీలు.. మండ‌లిలో వైసీపీ నాయ‌కులే ఉన్నారు. ఇప్పుడు .. అధికారం కోల్పోయి,. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోలేక నిలువునా విల‌పిస్తున్న వైసీపీకి.. ప్రాణం పోసింది ఏదైనా ఉందంటే.. అది ఒక్క మండ‌లి మాత్ర‌మే. ఎందుకంటే.. వైసీపీకి ఇప్పుడు వాయిస్ వినిపించే స‌త్తా.. వంటివి కేవ‌లం మండ‌లిలోనే ఉన్నాయి.

పైగా మండ‌లి ఇప్పుడు వైసీపీ స్వాధీనంలోనే ఉంది. ఆ పార్టీకి చెందిన మోషేన్ రాజు మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్నారు. దీంతో టీడీపీ ప్ర‌భుత్వం ఎంత బ‌లంగా ఉన్నా.. మండ‌లికి వ‌చ్చే స‌రికి మాత్రం వైసీపీ దే పైచేయి.. మ‌రో రెండున్న ర సంవ‌త్స‌రాల వ‌ర‌కు వైసీపీనే హ‌వా చ‌లాయిస్తుంది. ఇక్క‌డ విష‌యం ఏంటంటే.. అప్ప‌ట్లో రాజ‌ధాని అమ‌రావతిని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే.. మండ‌లిని కూడా ప‌క్క‌న పెట్టేసి ఉంటే.. జ‌గ‌న్‌కు ఇప్పుడు చెప్పుకొనేందుకు వేదిక కూడా దొరికేది కాదు. బ‌హుశ అందుకేనేమో.. జాతీయ నాయ‌కులు అర్ధం కాని పేజీ అంటూ.. జ‌గ‌న్ పై స‌టైర్లు వేసింది!!

This post was last modified on June 14, 2024 4:02 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

14 minutes ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

3 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

4 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

4 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

6 hours ago