Political News

ర‌ద్ద‌న్న‌దే ముద్ద‌యింది కదా జ‌గ‌న్!

జ‌గ‌న్‌.. అంటే ఏంటి? అని ఇటీవ‌ల జాతీయ రాజ‌కీయ నాయ‌కుడిని ప్ర‌శ్నిస్తే.. ‘అర్ధంకాని పేజీ’ అని బ‌దులిచ్చారు. నిజ‌మేన‌ని అనిపిస్తుంది. ఎందుకంటే.. తాను తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆయ‌న ఒక్క‌సారి అద్దం ముందు నిల‌బ‌డి ‘ఇవి స‌రైన‌వేనా?’ అని ఆలోచించుకుంటే.. ఆయ‌న‌కే త‌త్వం బోధ‌ప‌డుతుంది. ఒక్క‌సారి ఇచ్చిన ఛాన్స్‌ను ఒబ్బిడిగా వినియోగించుకుని ..ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందాల్సిన ముఖ్యమంత్రి .. ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్‌తోనే ప‌రిమితం కానున్నార‌నే కామెంట్లు మొద‌ల‌య్యారు.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. తాను ఒక‌ప్పుడు ర‌ద్దు చేసేస్తా.. రంగు తీసేస్తా.. అంటూ.. అసెంబ్లీలోనే పెద్ద ఎత్తున జ‌గ‌న్ వ్యాఖ్యానించిన శాస‌న మండ‌లి.. ఇప్పుడు ఆయ‌న‌కు ఆద‌ర‌వుగా నిలిచింది. మూడు రాజ ధాని బిల్లు విష‌యంలో త‌లెత్తిన వివాదం కార‌ణంగా.. జ‌గ‌న్ అప్ప‌ట్లో మండ‌లిని ర‌ద్దు చేస్తూ.. నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసింది. దీనిని కేంద్రానికి కూడా హుటాహుటిన పంపేశారు. కానీ, కేంద్రంలోని పెద్ద‌లు ఢ‌క్కాముక్కీలు తిన్న వారు కావ‌డంతో జ‌గ‌న్ పిల్ల చేష్ఠ‌ల‌ను ప‌క్క‌న పెట్టారు.

దీంతో మండ‌లి ర‌ద్దు కాలేదు. పైగా.. రెండేళ్లు తిరిగే స‌రికి.. అదే మండ‌లిలో ఇప్పుడు వైసీపీ నాయ‌కులు క‌ళ‌క‌ళలాడుతున్నారు. మొత్తం 35 మంది ఎమ్మెల్సీలు.. మండ‌లిలో వైసీపీ నాయ‌కులే ఉన్నారు. ఇప్పుడు .. అధికారం కోల్పోయి,. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోలేక నిలువునా విల‌పిస్తున్న వైసీపీకి.. ప్రాణం పోసింది ఏదైనా ఉందంటే.. అది ఒక్క మండ‌లి మాత్ర‌మే. ఎందుకంటే.. వైసీపీకి ఇప్పుడు వాయిస్ వినిపించే స‌త్తా.. వంటివి కేవ‌లం మండ‌లిలోనే ఉన్నాయి.

పైగా మండ‌లి ఇప్పుడు వైసీపీ స్వాధీనంలోనే ఉంది. ఆ పార్టీకి చెందిన మోషేన్ రాజు మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్నారు. దీంతో టీడీపీ ప్ర‌భుత్వం ఎంత బ‌లంగా ఉన్నా.. మండ‌లికి వ‌చ్చే స‌రికి మాత్రం వైసీపీ దే పైచేయి.. మ‌రో రెండున్న ర సంవ‌త్స‌రాల వ‌ర‌కు వైసీపీనే హ‌వా చ‌లాయిస్తుంది. ఇక్క‌డ విష‌యం ఏంటంటే.. అప్ప‌ట్లో రాజ‌ధాని అమ‌రావతిని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే.. మండ‌లిని కూడా ప‌క్క‌న పెట్టేసి ఉంటే.. జ‌గ‌న్‌కు ఇప్పుడు చెప్పుకొనేందుకు వేదిక కూడా దొరికేది కాదు. బ‌హుశ అందుకేనేమో.. జాతీయ నాయ‌కులు అర్ధం కాని పేజీ అంటూ.. జ‌గ‌న్ పై స‌టైర్లు వేసింది!!

This post was last modified on June 14, 2024 4:02 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago