Political News

ర‌ద్ద‌న్న‌దే ముద్ద‌యింది కదా జ‌గ‌న్!

జ‌గ‌న్‌.. అంటే ఏంటి? అని ఇటీవ‌ల జాతీయ రాజ‌కీయ నాయ‌కుడిని ప్ర‌శ్నిస్తే.. ‘అర్ధంకాని పేజీ’ అని బ‌దులిచ్చారు. నిజ‌మేన‌ని అనిపిస్తుంది. ఎందుకంటే.. తాను తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆయ‌న ఒక్క‌సారి అద్దం ముందు నిల‌బ‌డి ‘ఇవి స‌రైన‌వేనా?’ అని ఆలోచించుకుంటే.. ఆయ‌న‌కే త‌త్వం బోధ‌ప‌డుతుంది. ఒక్క‌సారి ఇచ్చిన ఛాన్స్‌ను ఒబ్బిడిగా వినియోగించుకుని ..ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందాల్సిన ముఖ్యమంత్రి .. ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్‌తోనే ప‌రిమితం కానున్నార‌నే కామెంట్లు మొద‌ల‌య్యారు.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. తాను ఒక‌ప్పుడు ర‌ద్దు చేసేస్తా.. రంగు తీసేస్తా.. అంటూ.. అసెంబ్లీలోనే పెద్ద ఎత్తున జ‌గ‌న్ వ్యాఖ్యానించిన శాస‌న మండ‌లి.. ఇప్పుడు ఆయ‌న‌కు ఆద‌ర‌వుగా నిలిచింది. మూడు రాజ ధాని బిల్లు విష‌యంలో త‌లెత్తిన వివాదం కార‌ణంగా.. జ‌గ‌న్ అప్ప‌ట్లో మండ‌లిని ర‌ద్దు చేస్తూ.. నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసింది. దీనిని కేంద్రానికి కూడా హుటాహుటిన పంపేశారు. కానీ, కేంద్రంలోని పెద్ద‌లు ఢ‌క్కాముక్కీలు తిన్న వారు కావ‌డంతో జ‌గ‌న్ పిల్ల చేష్ఠ‌ల‌ను ప‌క్క‌న పెట్టారు.

దీంతో మండ‌లి ర‌ద్దు కాలేదు. పైగా.. రెండేళ్లు తిరిగే స‌రికి.. అదే మండ‌లిలో ఇప్పుడు వైసీపీ నాయ‌కులు క‌ళ‌క‌ళలాడుతున్నారు. మొత్తం 35 మంది ఎమ్మెల్సీలు.. మండ‌లిలో వైసీపీ నాయ‌కులే ఉన్నారు. ఇప్పుడు .. అధికారం కోల్పోయి,. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోలేక నిలువునా విల‌పిస్తున్న వైసీపీకి.. ప్రాణం పోసింది ఏదైనా ఉందంటే.. అది ఒక్క మండ‌లి మాత్ర‌మే. ఎందుకంటే.. వైసీపీకి ఇప్పుడు వాయిస్ వినిపించే స‌త్తా.. వంటివి కేవ‌లం మండ‌లిలోనే ఉన్నాయి.

పైగా మండ‌లి ఇప్పుడు వైసీపీ స్వాధీనంలోనే ఉంది. ఆ పార్టీకి చెందిన మోషేన్ రాజు మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్నారు. దీంతో టీడీపీ ప్ర‌భుత్వం ఎంత బ‌లంగా ఉన్నా.. మండ‌లికి వ‌చ్చే స‌రికి మాత్రం వైసీపీ దే పైచేయి.. మ‌రో రెండున్న ర సంవ‌త్స‌రాల వ‌ర‌కు వైసీపీనే హ‌వా చ‌లాయిస్తుంది. ఇక్క‌డ విష‌యం ఏంటంటే.. అప్ప‌ట్లో రాజ‌ధాని అమ‌రావతిని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే.. మండ‌లిని కూడా ప‌క్క‌న పెట్టేసి ఉంటే.. జ‌గ‌న్‌కు ఇప్పుడు చెప్పుకొనేందుకు వేదిక కూడా దొరికేది కాదు. బ‌హుశ అందుకేనేమో.. జాతీయ నాయ‌కులు అర్ధం కాని పేజీ అంటూ.. జ‌గ‌న్ పై స‌టైర్లు వేసింది!!

This post was last modified on June 14, 2024 4:02 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

ఇండియా విడిచిపోండి.. వాట్సాప్‌కు సుప్రీం గట్టి హెచ్చరిక

మెటా (Meta) ప్రస్తుతం అందరికీ పరిచయం ఉన్న పేరు. వాట్సాప్ ఈ సంస్థకు చెందినదనే విషయం తెలిసిందే. అయితే భారత్‌లో…

28 minutes ago

‘పోలీసులను పక్కనబెట్టి టీడీపీ, వైసీపీ తేల్చుకుందామా?’

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

మైకేల్ జాక్సన్ బయోపిక్ ట్రైలర్… రికార్డులు సాధ్యమా?

​వరల్డ్ మ్యూజిక్ ఐకాన్ మైకేల్ జాక్సన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'మైకేల్' ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఆంటోనీ ఫుక్వా…

3 hours ago

గోల్డెన్ ఫిష్ మాట తప్పడం మంచిదే

ఆ మధ్య డెకాయిట్ టీజర్ లాంచ్ జరిగినప్పుడు పోటీ గురించి ప్రస్తావిస్తూ అడివి శేష్ ఒక మాట అనడం అభిమానులకు…

4 hours ago

వేసవి సినిమాల పాటల జోరు… ఆగకుండా సాగాలి

సమ్మర్ లక్ష్యంగా పెట్టుకున్న పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేక అభిమానులు తెగ వర్రీ అవుతున్నారు. పెద్ది,…

5 hours ago

నిజాయితీకి సూపర్ స్టార్ సలాం.. పద్మకు రజినీ స్పెషల్ గిఫ్ట్!

నేటి రోజుల్లో రూపాయి చేయిజారి కింద పడితేనే వెనక్కి ఇచ్చేవాళ్లు అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటిది ఏకంగా రూ.45 లక్షల విలువైన…

5 hours ago