రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బండ్లు ఓడలు .. ఓడలు బండ్లు అవుతాయి. అయిదేళ్ల క్రితం 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెలుచుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయింది. గత ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితం అయిన టీడీపీ ఈ ఎన్నికల్లో సొంతంగా 135, భాగస్వామ్య పక్షాలతో కలిపి ఏకంగా 164 స్థానాలు గెలుచుకుంది. అదేవిధంగా కూటమి 21 లోక్ సభ స్థానాలు గెలుచుకోగా, వైసీపీ 4 స్థానాలకు పరిమితం అయింది.
ఆంధ్రాలో జరిగిన రాజకీయ అధికార మార్పిడి నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
టెక్కలి శాసనసభ్యుడుగా వరసగా మూడోసారి విజయం సాధించిన కింజారపు అచ్చెన్నాయుడు చంద్రబాబు మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా, శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన అచ్చెన్నాయుడు సోదరుడు, దివంగత ఎర్రంనాయుడు కుమారుడు కింజారపు రామ్మోహన్ నాయుడు నరేంద్రమోడీ ప్రభుత్వంలో కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.
టెక్కలి శాసనసభ స్థానం నుండి అచ్చెంన్నాయుడు వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పై 34435 ఓట్ల మెజారిటీతో, శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుండి రామ్మోహన్ నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పై 327901 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాదించారు. ఈ విషయం ఇలా ఉంటే ఎర్రంనాయుడు అల్లుడు, రామ్మోహన్ నాయుడు బావ ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ శాసనసభ స్థానం నుండి వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ పై ఏకంగా 71404 ఓట్లతో విజయం సాధించడం విశేషం.
This post was last modified on June 14, 2024 3:35 pm
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…