రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బండ్లు ఓడలు .. ఓడలు బండ్లు అవుతాయి. అయిదేళ్ల క్రితం 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెలుచుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయింది. గత ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితం అయిన టీడీపీ ఈ ఎన్నికల్లో సొంతంగా 135, భాగస్వామ్య పక్షాలతో కలిపి ఏకంగా 164 స్థానాలు గెలుచుకుంది. అదేవిధంగా కూటమి 21 లోక్ సభ స్థానాలు గెలుచుకోగా, వైసీపీ 4 స్థానాలకు పరిమితం అయింది.
ఆంధ్రాలో జరిగిన రాజకీయ అధికార మార్పిడి నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
టెక్కలి శాసనసభ్యుడుగా వరసగా మూడోసారి విజయం సాధించిన కింజారపు అచ్చెన్నాయుడు చంద్రబాబు మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా, శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన అచ్చెన్నాయుడు సోదరుడు, దివంగత ఎర్రంనాయుడు కుమారుడు కింజారపు రామ్మోహన్ నాయుడు నరేంద్రమోడీ ప్రభుత్వంలో కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.
టెక్కలి శాసనసభ స్థానం నుండి అచ్చెంన్నాయుడు వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పై 34435 ఓట్ల మెజారిటీతో, శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుండి రామ్మోహన్ నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పై 327901 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాదించారు. ఈ విషయం ఇలా ఉంటే ఎర్రంనాయుడు అల్లుడు, రామ్మోహన్ నాయుడు బావ ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ శాసనసభ స్థానం నుండి వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ పై ఏకంగా 71404 ఓట్లతో విజయం సాధించడం విశేషం.
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…