రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బండ్లు ఓడలు .. ఓడలు బండ్లు అవుతాయి. అయిదేళ్ల క్రితం 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెలుచుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయింది. గత ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితం అయిన టీడీపీ ఈ ఎన్నికల్లో సొంతంగా 135, భాగస్వామ్య పక్షాలతో కలిపి ఏకంగా 164 స్థానాలు గెలుచుకుంది. అదేవిధంగా కూటమి 21 లోక్ సభ స్థానాలు గెలుచుకోగా, వైసీపీ 4 స్థానాలకు పరిమితం అయింది.
ఆంధ్రాలో జరిగిన రాజకీయ అధికార మార్పిడి నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
టెక్కలి శాసనసభ్యుడుగా వరసగా మూడోసారి విజయం సాధించిన కింజారపు అచ్చెన్నాయుడు చంద్రబాబు మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా, శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన అచ్చెన్నాయుడు సోదరుడు, దివంగత ఎర్రంనాయుడు కుమారుడు కింజారపు రామ్మోహన్ నాయుడు నరేంద్రమోడీ ప్రభుత్వంలో కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.
టెక్కలి శాసనసభ స్థానం నుండి అచ్చెంన్నాయుడు వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పై 34435 ఓట్ల మెజారిటీతో, శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుండి రామ్మోహన్ నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పై 327901 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాదించారు. ఈ విషయం ఇలా ఉంటే ఎర్రంనాయుడు అల్లుడు, రామ్మోహన్ నాయుడు బావ ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ శాసనసభ స్థానం నుండి వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ పై ఏకంగా 71404 ఓట్లతో విజయం సాధించడం విశేషం.
This post was last modified on June 14, 2024 3:35 pm
గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…
అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…