రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బండ్లు ఓడలు .. ఓడలు బండ్లు అవుతాయి. అయిదేళ్ల క్రితం 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెలుచుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయింది. గత ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితం అయిన టీడీపీ ఈ ఎన్నికల్లో సొంతంగా 135, భాగస్వామ్య పక్షాలతో కలిపి ఏకంగా 164 స్థానాలు గెలుచుకుంది. అదేవిధంగా కూటమి 21 లోక్ సభ స్థానాలు గెలుచుకోగా, వైసీపీ 4 స్థానాలకు పరిమితం అయింది.
ఆంధ్రాలో జరిగిన రాజకీయ అధికార మార్పిడి నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
టెక్కలి శాసనసభ్యుడుగా వరసగా మూడోసారి విజయం సాధించిన కింజారపు అచ్చెన్నాయుడు చంద్రబాబు మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా, శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన అచ్చెన్నాయుడు సోదరుడు, దివంగత ఎర్రంనాయుడు కుమారుడు కింజారపు రామ్మోహన్ నాయుడు నరేంద్రమోడీ ప్రభుత్వంలో కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.
టెక్కలి శాసనసభ స్థానం నుండి అచ్చెంన్నాయుడు వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పై 34435 ఓట్ల మెజారిటీతో, శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుండి రామ్మోహన్ నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పై 327901 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాదించారు. ఈ విషయం ఇలా ఉంటే ఎర్రంనాయుడు అల్లుడు, రామ్మోహన్ నాయుడు బావ ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ శాసనసభ స్థానం నుండి వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ పై ఏకంగా 71404 ఓట్లతో విజయం సాధించడం విశేషం.
This post was last modified on June 14, 2024 3:35 pm
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మీద యూత్ వర్గాల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇవాళ…
తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం…
ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మనం ఫాలో కాని అకౌంట్ల నుంచి కూడా వరుసగా రీల్స్ వచ్చేస్తుంటాయి. ఒక వీడియో కాస్త…
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న కూటమి పార్టీల్లో కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకుల మధ్య సోషల్ వార్ జరుగుతుంది.…
వాయిదాల ప్రచారాలకు చెక్ పెడుతూ నిన్న ప్యారడైజ్ బృందం మరోసారి సెప్టెంబర్ 24 విడుదలని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.…
ప్యాన్ ఇండియా పేరుతో ప్రతి హీరో వరల్డ్ బిల్డింగ్, ఎలివేషన్ల వెనుక పడటంతో సినిమాల వేగం తగ్గిపోయింది. టయర్ 2,…