టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గ బృందానికి శాఖలు అప్పగించారు. వీటిలో కీలకమైన శాఖలను కొన్నింటిని మాత్రం తనవద్దే పెట్టుకున్నారు. వీటిలో సాధారణ పరిపాలన శాఖ అత్యంత కీలకం. గతంలో దీనిని ఆయన వద్దే పెట్టుకున్న విషయం తెలిసిందే. సాధారణంగా ముఖ్యమంత్రులు దీనిని వేరే వారికి ఇస్తుంటారు. కానీ.. సాధారణ పరిపాలనను కట్టడి చేసేందుకు.. మంత్రులు, నేతలు, అదికారుల దూకుడును నియంత్రించేందుకు ఈ శాఖను ముఖ్యమంత్రి వద్దే పెట్టుకోవడం మంచిదనే అభిప్రాయం ఉంది.
ఇక, హోం శాఖలోని కీలకమైన విభాగం శాంతి భద్రతలు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందు కు.. పోలీసు యంత్రాంగాన్ని నియంత్రించేందుకు ఈ విభాగమే కీలకం. దీనిని కూడా చంద్రబాబు తన వద్దే పెట్టుకున్నారు. అయితే.. హోం శాఖలోని కొన్ని విభాగాలను మాత్రం మహిళా మంత్రి వంగలపూడి అనితకు కేటాయించారు. గతంలో వైఎస్ కూడా.. సబితా ఇంద్రా రెడ్డికి హోం శాఖ ఇచ్చారు. కానీ .. శాంతి భద్రతలను మాత్రం తనవద్దే ఉంచుకున్నారు.
ఇక, జగన్ పాలనలోనూ.. ఇద్దరు ఎస్సీ మహిళా మంత్రులకు హోం శాఖలు ఇచ్చినా.. కీలకమైన శాంతి భద్రతలను మాత్రం తన వద్దే ఉంచుకున్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఏం జరుగుతోందనే విషయంపై ముఖ్యమంత్రికి పట్టు ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పనిచేశారు. అదేవిధంగా మంత్రులకు కేటాయించిన పలు శాఖలను కూడా.. చంద్రబాబు తన వద్దే పెట్టుకున్నారు. దీనిలో శాసన సభ వ్యవహారాలను కూడా చంద్రబాబు తనవద్దే ఉంచుకున్నారు. మొత్తంగా .. చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
This post was last modified on June 14, 2024 3:00 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…