Political News

జ‌గ‌న్.. ‘ప్ర‌జాయాత్ర‌’ ఎప్ప‌టి నుంచంటే!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ప్ర‌జాబాట ప‌ట్ట‌నున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ నెల 4న వ‌చ్చిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో వైసీపీచిత్తుగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే.

కేవ‌లం 11 స్థానాల‌కే ప‌రిమితం అయింది. నిజానికి ఇది 2019 ఎన్నిక‌ల ఫ‌లితంతో పోల్చుకుం టే ఘోర ప‌రాభ‌వం. అప్ప‌ట్లో 151 సీట్లు రాగా.. ఇప్పుడు 11కు ప‌రిమితం అయిపోయింది. దీంతో పార్టీని గాడిలో పెట్టుకోవాల్సిన అవ‌స‌రం జ‌గ‌న‌కు వ‌చ్చింది.

తాజాగా ఆయ‌న గ‌త నాలుగు రోజుల నుంచి ప్రాంతాల వారీగా ఓడిపోయిన నాయ‌కుల‌ను పిలిపించుకుని త‌న క్యాంపు కార్యాల‌యాన్నే పార్టీకార్యాల‌యంగా మార్చుకుని చ‌ర్చిస్తున్నారు. అంద‌రికీ ధైర్యం చెబుతున్నారు.

ఇదేస‌మ‌యంలో ప్ర‌లోభాల‌కు లొంగ‌వ‌ద్ద‌ని కూడా.. సూచిస్తున్నారు. గురువారం పార్టీ ఎమ్మెల్సీ ల‌తో జ‌గ‌న్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇత‌ర పార్టీల నుంచి ఆఫ‌ర్లు వ‌స్తాయ‌ని.. వాటిని న‌మ్మొద్ద‌ని తెలిపారు. పార్టీ మారొద్ద‌ని కూడా.. వేడుకున్నారు.

ఇక‌, ఈ ప‌రాజ‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న జ‌గ‌న్‌.,. ఎక్క‌డో ఏదో జ‌రిగింద‌ని భావి స్తున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఆధారాలు లేకుండా ఎవ‌రిపైనా తాను విమ‌ర్శ‌లు చేయ‌ద‌లుచుకోలేద‌ని తెలిపారు.

ఏదేమైనా ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును శిరసా వ‌హించాల్సిన బాధ్య‌త వైసీపీపై ఉంద‌ని చెప్పారు. ఇక‌, పార్టీపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మకంపోయింద‌న్న విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న కొట్టి పారేశారు. ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు 40 శాతం మేర‌కు వైసీపీతోనే ఉన్నార‌ని గుర్తు పెట్టుకోవాల‌న్నారు.

ఎందుకంటే.. తాజా ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా.. ఓటు బ్యాంకు మాత్రం 39.98 శాతం వైసీపీకి ద‌క్కింది. దీనిని దృష్టిలో పెట్టుకునే జ‌గ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌, తాను త్వ‌ర‌లోనే ప్ర‌జాయాత్ర‌కు సిద్ధం అవు తున్న‌ట్టు చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా త‌న ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని.. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తాన‌ని.. ప‌రిస్థితుల‌పై త‌న పోరాటం ఆగ‌ద‌ని వెల్ల‌డించారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఖ‌చ్చితంగా ఇబ్బందులు ఉంటాయ‌ని తెలిపారు. వీటిని అంద‌రూ త‌ట్టుకుని ముందుకు సాగేందుకు పార్టీప‌రంగా అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని జ‌గ‌న్ చెప్పారు.

This post was last modified on June 14, 2024 3:31 pm

Share

Recent Posts

విజయ్ జయలలిత పేరు ఎందుకు చెప్పలేదు?

తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "1967లో అన్నాదురై,…

9 hours ago

మనుషులను గోకుతూ.. నెలకు రూ.14 లక్షలు సంపాదిస్తున్నాడు!

ఎక్కడైనా దురద పెడితే చేతితో గోక్కుంటాం. లేదంటే పక్కన ఉన్నవాళ్లను కాస్త గోకమని అడుగుతాం. కానీ చైనాలో మాత్రం ఇదే…

9 hours ago

తెలంగాణా అసెంబ్లీలో బ్లాక్ డే

తెలంగాణా అసెంబ్లీ ప్రారంభం కావడమే యుద్ధ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో…

9 hours ago

కూలిపోయిన హాస్టల్… అగ్రిమెంట్‌లో మాత్రం ‘మాకు బాధ్యత లేదు’!

ఢిల్లీలో హాస్టల్ భవనం కూలిపోయిన ఘటనలో ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే.…

12 hours ago

అప్పుడు బన్నీతో… ఇప్పుడు బాలయ్యతో?

తెలుగు సినిమాల్లోకి పరభాషా నటులను క్యారెక్టర్, విలన్ పాత్రల్లోకి తీసుకోవడం కొత్తేమీ కాదు. ఇది దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయమే. సొంత…

13 hours ago

ది ప్యారడైజ్.. నాన్ స్టాప్ మోడ్

చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేస్తాడని నేచురల్ స్టార్ నానికి ఉన్న పేరును ‘ది ప్యారడైజ్’ బాగా దెబ్బ తీసింది.…

14 hours ago