Political News

జ‌గ‌న్.. ‘ప్ర‌జాయాత్ర‌’ ఎప్ప‌టి నుంచంటే!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ప్ర‌జాబాట ప‌ట్ట‌నున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ నెల 4న వ‌చ్చిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో వైసీపీచిత్తుగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే.

కేవ‌లం 11 స్థానాల‌కే ప‌రిమితం అయింది. నిజానికి ఇది 2019 ఎన్నిక‌ల ఫ‌లితంతో పోల్చుకుం టే ఘోర ప‌రాభ‌వం. అప్ప‌ట్లో 151 సీట్లు రాగా.. ఇప్పుడు 11కు ప‌రిమితం అయిపోయింది. దీంతో పార్టీని గాడిలో పెట్టుకోవాల్సిన అవ‌స‌రం జ‌గ‌న‌కు వ‌చ్చింది.

తాజాగా ఆయ‌న గ‌త నాలుగు రోజుల నుంచి ప్రాంతాల వారీగా ఓడిపోయిన నాయ‌కుల‌ను పిలిపించుకుని త‌న క్యాంపు కార్యాల‌యాన్నే పార్టీకార్యాల‌యంగా మార్చుకుని చ‌ర్చిస్తున్నారు. అంద‌రికీ ధైర్యం చెబుతున్నారు.

ఇదేస‌మ‌యంలో ప్ర‌లోభాల‌కు లొంగ‌వ‌ద్ద‌ని కూడా.. సూచిస్తున్నారు. గురువారం పార్టీ ఎమ్మెల్సీ ల‌తో జ‌గ‌న్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇత‌ర పార్టీల నుంచి ఆఫ‌ర్లు వ‌స్తాయ‌ని.. వాటిని న‌మ్మొద్ద‌ని తెలిపారు. పార్టీ మారొద్ద‌ని కూడా.. వేడుకున్నారు.

ఇక‌, ఈ ప‌రాజ‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న జ‌గ‌న్‌.,. ఎక్క‌డో ఏదో జ‌రిగింద‌ని భావి స్తున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఆధారాలు లేకుండా ఎవ‌రిపైనా తాను విమ‌ర్శ‌లు చేయ‌ద‌లుచుకోలేద‌ని తెలిపారు.

ఏదేమైనా ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును శిరసా వ‌హించాల్సిన బాధ్య‌త వైసీపీపై ఉంద‌ని చెప్పారు. ఇక‌, పార్టీపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మకంపోయింద‌న్న విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న కొట్టి పారేశారు. ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు 40 శాతం మేర‌కు వైసీపీతోనే ఉన్నార‌ని గుర్తు పెట్టుకోవాల‌న్నారు.

ఎందుకంటే.. తాజా ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా.. ఓటు బ్యాంకు మాత్రం 39.98 శాతం వైసీపీకి ద‌క్కింది. దీనిని దృష్టిలో పెట్టుకునే జ‌గ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌, తాను త్వ‌ర‌లోనే ప్ర‌జాయాత్ర‌కు సిద్ధం అవు తున్న‌ట్టు చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా త‌న ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని.. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తాన‌ని.. ప‌రిస్థితుల‌పై త‌న పోరాటం ఆగ‌ద‌ని వెల్ల‌డించారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఖ‌చ్చితంగా ఇబ్బందులు ఉంటాయ‌ని తెలిపారు. వీటిని అంద‌రూ త‌ట్టుకుని ముందుకు సాగేందుకు పార్టీప‌రంగా అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని జ‌గ‌న్ చెప్పారు.

This post was last modified on June 14, 2024 3:31 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

8 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

16 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago