Political News

జ‌గ‌న్‌కు త‌ల‌కొట్టేసినంత ప‌ని!

మ‌రో నాలుగు రోజుల్లో ఏపీ అసెంబ్లీ కొలువు దీర‌నుంది. భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న టీడీపీ కూట‌మి ఈ స‌భ‌ల‌ను అత్యంత గౌర‌వంగా నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించుకుంది. ఈ నేప‌థ్యంలో కీల‌క నేత‌కు స్పీక‌ర్ బాధ్య‌త‌లు ఇచ్చేందుకు కూడా రెడీ అయింది. పేరు బ‌య‌ట‌కు రాక‌పోయినా.. రెండు రోజుల్లో దీనిపైనా క్లారిటీ రానుంది. ఆ వెంట‌నే .. స్పీక‌ర్ ప్ర‌మాణ స్వీకారం ఉంటుంది. త‌ర్వాత‌.. ఎమ్మెల్యేల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయిస్తారు.

ఆ వెంట‌నే ఈ నెల 18 నుంచి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. అయితే.. ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ అంతా వైసీపీ గురించే జ‌రుగుతోంది. వైసీపీ గ‌త ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేల‌ను ద‌క్కిం చుకుంది. కానీ, ఇప్పుడు ఈ సంఖ్య 11కు ప‌డిపోయింది. ఇది ఒక‌ర‌కంగా తీవ్ర అవ‌మాన‌క‌ర విష‌య‌మ‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం జ‌గ‌న్‌కు త‌ల‌కొట్టేసినంత ప‌ని!ఈ నేప‌థ్యంలో అస‌లు ఈ 10 మందితో ఆయ‌న క‌లిసి అసెంబ్లీకి హాజ‌రవుతారా? అన్న‌ది స‌మ‌స్య‌.

ఎందుకంటే.. అదే అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్ర‌బాబును ఘోరంగా అవ‌మానించిన విష‌యం తెలిసిందే. ఏకంగా చంద్ర‌బాబు శ‌ప‌థం చేసి బ‌య‌ట‌కు వ‌చ్చి.. క‌న్నీరు పెట్టుకునే ప‌రిస్థితిని క‌ల్పించార‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు వైసీపీకి ఈ 23లో స‌గం కూడా రాలేదు. దీంతో టీడీపీ నేత‌ల నుంచి ఎంత క‌ట్ట‌డి చేసినా.. క‌వ్వింపులు, ప్ర‌తివిమ‌ర్శ‌లు కామ‌న్‌గానే ఉంటాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. పూలు అమ్మిన చోటే క‌ట్టెలు అమ్మె ప‌రిస్థితి వైసీపీకి వ‌చ్చింది.

దీనికి తోడు.. వైసీపీని తెగ విమ‌ర్శించి.. జ‌గ‌న్ కేసులపై న్యాయ పోరాటం చేసిన‌.. ర‌ఘురామ‌రాజుకే.. స్పీక‌ర్ ప‌ద‌విని కూడా ఇస్తున్న‌ట్టు ప్ర‌చారంలో ఉంది. ఇదే జ‌రిగితే స‌భ‌లో వైసీపీనేత‌ల ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిగానే ఉంటుంద‌ని అంటున్నారు. పైగా.. మైకు ఇచ్చే విష‌యంలోనూ.. ప్రాధాన్యం ఏమీ ఉండ‌దు. అంతేకాదు.. ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అస‌లు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టే ప‌రిస్థితి ఉండ‌ద‌ని తెలుస్తోంది. అయితే.. ఎమ్మెల్యేలుగా మాత్రం వారు ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on June 14, 2024 11:05 am

Share
Show comments
Published by
Satya
Tags: AP Assembly

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

34 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago