ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రేపు సాయంత్రం 4.41 గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు
అయితే బాధ్యతల స్వీకరణ సంఘర్షణగా మొదట ఏ ఫైళ్లపై సంతకాలు చేస్తారన్న దానిపై ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ వీడింది. మొదట మూడు ఫైళ్ల మీద సంతకం అని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది.
అయితే మొత్తం ఐదు ఫైల్స్పై చంద్రబాబు సంతకాలు చేయనున్నారని, అందుకు సంబంధించిన దస్త్రాలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
మెగా డీఎస్సీపై మొదటి సంతకం,
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం,
అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సెస్పై ఐదో సంతకం చేయనున్నారు.
ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమలకు వెళ్తున్నారు చంద్రబాబు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో తిరుమలకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకుంటారు.
This post was last modified on June 13, 2024 11:18 am
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…