Political News

తొలి సంతకాలపై వీడిన సస్పెన్స్ !

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రేపు సాయంత్రం 4.41 గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు

అయితే బాధ్యతల స్వీకరణ సంఘర్షణగా మొదట ఏ ఫైళ్లపై సంతకాలు చేస్తారన్న దానిపై ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ వీడింది. మొదట మూడు ఫైళ్ల మీద సంతకం అని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది.
అయితే మొత్తం ఐదు ఫైల్స్‌పై చంద్రబాబు సంతకాలు చేయనున్నారని, అందుకు సంబంధించిన దస్త్రాలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

మెగా డీఎస్సీపై మొదటి సంతకం,
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం,
అన్న క్యాంటీన్‌ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సెస్‌పై ఐదో సంతకం చేయనున్నారు.

ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమలకు వెళ్తున్నారు చంద్రబాబు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో తిరుమలకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకుంటారు.

This post was last modified on June 13, 2024 11:18 am

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

10 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago