24 మంది మంత్రులతో కలిసి ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 24 మందిలో 17 మంది తొలిసారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, మొత్తం మంత్రి వర్గంలో ముగ్గురు మహిళా మంత్రులకు అవకాశం దక్కించుకున్నారు. ఈ ముగ్గురూ తెలుగుదేశం పార్టీకే చెందిన వారు కావడంతో పాటు, ఈ ముగ్గురూ తొలిసారి మంత్రులు కానుండడం విశేషం.
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత 2014లో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప వైఎస్సార్సీపీ అభ్యర్థి చెంగల వెంకటరావు పై 2,828 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచింది.
2018లో టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియమితురాలైంది. 2019 ఎన్నికల్లో కొవ్వూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి వైసీపీ నేత తానేటి వనిత చేతిలో ఓటమి పాలయ్యింది. 2021 జనవరి 30న తెలుగు మహిళ అధ్యక్షురాలిగా నియమితురాలైంది. ఈ ఎన్నికల్లో తిరిగి పాయకరావుపేట ఎమ్మెల్యేగా కంబాల జోగుళుపై 43727 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
మాజీ శాసనమండలి సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి 1999లో కాంగ్రెస్ పార్టీ నుండి సాలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాజేంద్ర ప్రతాప్ భంజ్ దేవ్ చేతిలో 14,970 ఓట్ల మెజారితో ఓడిపోయింది. ఆ తర్వాత టీడీపీలో చేరింది. 2009 ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గం నుండి పీడిక రాజన్నదొర చేతిలో 1656 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది. 2015లో శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికై 2021 వరకు పనిచేసింది. 2020 నుండి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా కొనసాగుతున్నది. ఈ ఎన్నికల్లో గతంలో తనను ఓడించిన వైసీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరను 13733 ఓట్ల మెజారిటీతో ఓడించింది.
కురుబ సామాజిక వర్గానికి చెందిన ఎస్.సవిత పెనుకొండ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి, వైసీపీ అభ్యర్థి ఉష శ్రీ చరణ్ మీద 33388 ఓట్ల మెజారిటీతో తొలిసారి విజయం సాధించింది. సామాజిక న్యాయం పాటిస్తూ చంద్రబాబు నాయుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణికి, బీసీ కోటాలో సవితకు మంత్రులుగా అవకాశం కల్పించడం విశేషం.
This post was last modified on June 12, 2024 4:33 pm
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…