Political News

బాబు కేబినెట్ 21+3+1 లెక్క ప‌క్కా!!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నేతృత్వంలోని కూటమి స‌ర్కారు కొలువులో కీల‌క ప‌ద‌వులు పంచేశారు. లెక్క‌ను ప‌క్కాగానే తేల్చేశారు. మొత్తం 175 మంత్రి ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో ఏడుగురు ఎమ్మెల్యేల‌కు ఒక్క‌రు చొప్పున మంత్రుల‌ను కేటాయించారు. దీని ప్ర‌కారం 134 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి 21 మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. ఇక‌, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జ‌న‌సేన‌కు మూడు ప‌ద‌వులు చిక్కాయి. అదేస‌మ‌యంలో ప‌ది స్థానాల్లో పోటీ చేసిన ఎనిమిది మందిని గెలిపించుకున్న బీజేపీకి ఒక ప‌ద‌వి ద‌క్కింది.

మొత్తంగా చంద్ర‌బాబుతో క‌లిపి 21+3+1 ఫార్ములాలో చంద్ర‌బాబు కేబినెట్ కొలుదీరుతోంది. దీనిలోనూ కులా లు సామాజిక వ‌ర్గాల వారిగా చూసుకుంటే.. దాదాపు అన్ని సామాజిక వ‌ర్గాల‌కు న్యాయం జ‌రిగింది. కాపులు, వైశ్య‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ద‌క్కింది. అలానే గ‌తానికి భిన్నంగా ఎస్టీ సామాజిక వ‌ర్గానికి కూడా ఈ ద‌ఫా ప్రాధాన్యం ద‌క్క‌డం గ‌మ‌నార్హం. అయితే.. మొత్తంగా బీసీల‌కు ఈసారి కూడా పెద్ద పీట వేశారు. బీసీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారికి 8 మందికి ప‌ద‌వులు ద‌క్కాయి.

అలానే తొలిసారి కుర‌బ సామాజిక వ‌ర్గానికి చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీల్లో రెండు సామాజిక వ‌ర్గాల‌కు కూడా అవ‌కాశం ఇచ్చారు. మాల‌, మాదిగ వ‌ర్గాల‌కు రెండింటికీ కూడా చంద్ర‌బాబు పెద్ద‌పీట వేశారు. రెడ్డి సామాజిక వ‌ర్గంలో ముగ్గురికి అవ‌కాశం క‌ల్పించారు. ముగ్గురూ కూడా టీడీపీకి చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. కాపు కోటాలో మాత్రం రెండు జ‌న‌సేన‌కు, ఒక‌టి మాత్ర‌మే టీడీపీకి కేటాయించారు. అందునా కీల‌క నాయ‌కుడికే అవకాశం ఇచ్చారు. మొత్తంగా చంద్ర‌బాబు కేబినెట్ లెక్క ప‌క్కాగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on June 12, 2024 1:10 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

26 minutes ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

1 hour ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

1 hour ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

3 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

4 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

5 hours ago