టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు కొలువులో కీలక పదవులు పంచేశారు. లెక్కను పక్కాగానే తేల్చేశారు. మొత్తం 175 మంత్రి ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక్కరు చొప్పున మంత్రులను కేటాయించారు. దీని ప్రకారం 134 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి 21 మంత్రి పదవులు దక్కాయి. ఇక, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు మూడు పదవులు చిక్కాయి. అదేసమయంలో పది స్థానాల్లో పోటీ చేసిన ఎనిమిది మందిని గెలిపించుకున్న బీజేపీకి ఒక పదవి దక్కింది.
మొత్తంగా చంద్రబాబుతో కలిపి 21+3+1 ఫార్ములాలో చంద్రబాబు కేబినెట్ కొలుదీరుతోంది. దీనిలోనూ కులా లు సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే.. దాదాపు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగింది. కాపులు, వైశ్య, రెడ్డి సామాజిక వర్గాలకు ప్రాధాన్యం దక్కింది. అలానే గతానికి భిన్నంగా ఎస్టీ సామాజిక వర్గానికి కూడా ఈ దఫా ప్రాధాన్యం దక్కడం గమనార్హం. అయితే.. మొత్తంగా బీసీలకు ఈసారి కూడా పెద్ద పీట వేశారు. బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి 8 మందికి పదవులు దక్కాయి.
అలానే తొలిసారి కురబ సామాజిక వర్గానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీల్లో రెండు సామాజిక వర్గాలకు కూడా అవకాశం ఇచ్చారు. మాల, మాదిగ వర్గాలకు రెండింటికీ కూడా చంద్రబాబు పెద్దపీట వేశారు. రెడ్డి సామాజిక వర్గంలో ముగ్గురికి అవకాశం కల్పించారు. ముగ్గురూ కూడా టీడీపీకి చెందిన వారే కావడం గమనార్హం. కాపు కోటాలో మాత్రం రెండు జనసేనకు, ఒకటి మాత్రమే టీడీపీకి కేటాయించారు. అందునా కీలక నాయకుడికే అవకాశం ఇచ్చారు. మొత్తంగా చంద్రబాబు కేబినెట్ లెక్క పక్కాగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 12, 2024 1:10 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…