టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు కొలువులో కీలక పదవులు పంచేశారు. లెక్కను పక్కాగానే తేల్చేశారు. మొత్తం 175 మంత్రి ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక్కరు చొప్పున మంత్రులను కేటాయించారు. దీని ప్రకారం 134 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి 21 మంత్రి పదవులు దక్కాయి. ఇక, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు మూడు పదవులు చిక్కాయి. అదేసమయంలో పది స్థానాల్లో పోటీ చేసిన ఎనిమిది మందిని గెలిపించుకున్న బీజేపీకి ఒక పదవి దక్కింది.
మొత్తంగా చంద్రబాబుతో కలిపి 21+3+1 ఫార్ములాలో చంద్రబాబు కేబినెట్ కొలుదీరుతోంది. దీనిలోనూ కులా లు సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే.. దాదాపు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగింది. కాపులు, వైశ్య, రెడ్డి సామాజిక వర్గాలకు ప్రాధాన్యం దక్కింది. అలానే గతానికి భిన్నంగా ఎస్టీ సామాజిక వర్గానికి కూడా ఈ దఫా ప్రాధాన్యం దక్కడం గమనార్హం. అయితే.. మొత్తంగా బీసీలకు ఈసారి కూడా పెద్ద పీట వేశారు. బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి 8 మందికి పదవులు దక్కాయి.
అలానే తొలిసారి కురబ సామాజిక వర్గానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీల్లో రెండు సామాజిక వర్గాలకు కూడా అవకాశం ఇచ్చారు. మాల, మాదిగ వర్గాలకు రెండింటికీ కూడా చంద్రబాబు పెద్దపీట వేశారు. రెడ్డి సామాజిక వర్గంలో ముగ్గురికి అవకాశం కల్పించారు. ముగ్గురూ కూడా టీడీపీకి చెందిన వారే కావడం గమనార్హం. కాపు కోటాలో మాత్రం రెండు జనసేనకు, ఒకటి మాత్రమే టీడీపీకి కేటాయించారు. అందునా కీలక నాయకుడికే అవకాశం ఇచ్చారు. మొత్తంగా చంద్రబాబు కేబినెట్ లెక్క పక్కాగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 12, 2024 1:10 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…