ఏ పథకం తీసుకున్నప్పటికీ.. ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ.. తన పేరు ఉండాల్సిందే.. కుదిరినా కుదరకపోయినా.. తన ఫొటో వేయాల్సిందే. ఇదీ.. గతంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ చేసిన తీర్మానం.. ఆదేశించిన తీరు. దీంతో చేసేదేముంది.. అధికారులు కూడాఅయ్యగారి బాటనే పట్టారు. దీంతో అన్నింటి పైనా జగన్ ఫొటోలు.. పేర్లు ముద్రించేశారు. అయితే.. ఈ సమయంలో జగన్ ఏమనుకున్నారో తెలియదు కానీ.. ప్రజలు దీనిని ఏవగించుకున్నారనే టాక్ ఎన్నికల అనంతరం వినిపించింది.
ఒకటి కాదు.. రెండు కాదు అన్ని కీలక పథకాలపైనా జగన్ తన పేరును ముద్రించుకున్నారు. సర్వేలకు వినియోగించే హద్దు రాళ్లపై ఏకంగా తన ఫొటోలనే కార్వింగ్(చెక్కించుకోవడం) చేయించుకున్నారు. ఇక, ప్రజలకు ఇచ్చే ప్రతి పథకంపైనా తన పేరు వేసుకున్నారు. చివరకు చిన్నారులకు ఇచ్చే స్కూలు బ్యాగులు.. పుస్తకాలు..వారు తినే ఆహారంపైనా పేరు , ఫొటో వేసుకున్నారు. ఇవన్నీ శాశ్వత మని జగన్ అనుకుని ఉండొచ్చు.
కానీ.. ప్రజాస్వామ్యంలో అధికారం నీటి బుడగ. దీనిని గుర్తించే సరికి.. జగన్ పేరు
పోయింది. అన్ని పథకాల నుంచి జగన్ పేరును తొలగించేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా ప్రభుత్వ స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఇచ్చే చిక్కీల కవర్ల రంగు మార్చారు. అంతేకాదు.. జగన్ ఫొటోలను కూడా తీసేశారు. ఇప్పటి వరకు వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను ముద్రించగా ప్రస్తుతం ప్రభుత్వ రాజముద్రతో చిక్కీల కవర్లను రూపొందించారు.
అలాగే వాటిపై ‘జగనన్న గోరుముద్ద’ అని ఉండగా దాన్ని తొలగించారు. రేపటి నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కావాల్సి ఉండటంతో విద్యార్థులకు చిక్కీలతో పాటు కోడిగుడ్లు, రాగిపిండి సరఫరా చేయనున్నారు. నిజానికి చిక్కీ ప్యాకెట్లు రెండు అంగుళాల వెడల్పు మాత్రమే ఉంటాయి. వాటిపైనా జగన్ తన ఫొటోలు వేయించుకున్నారు. ఇప్పుడు సర్కారు పోయే సరికి.. రంగుతో పాటు ఆయన ఫొటో కూడా పోయింది.
This post was last modified on June 12, 2024 1:05 pm
ప్రపంచవ్యాప్తంగా మూవీ మేకర్స్ కలగా, జీవిత లక్ష్యంగా భావించే ఆస్కార్ అవార్డులు 2028తో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ…
క్రాక్, వీరసింహారెడ్డి, డాన్ శీను లాంటి బ్లాక్ బస్టర్లతో కమర్షియల్ దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉన్న గోపిచంద్ మలినేని…
నిన్న విడుదలైన సిద్దు జొన్నలగడ్డ 'జాక్'కు ఆశించిన స్థాయిలో స్పందన లేదు. రివ్యూలు పెదవి విరిచేయగా పబ్లిక్ టాక్ సైతం…
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక మండలి (ఎస్ఐపీబీ) అనే సంస్థ ఒకటి ఉంటుందని.. అది క్రమం తప్పకుండా సమావేశం అవుతుందని, రాష్ట్రానికి…
నిన్న విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీకి తమిళనాడులో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అజిత్ ని ఇంత ఊర మాస్…
అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ అయిన అట్లీ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు…