ఏ పథకం తీసుకున్నప్పటికీ.. ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ.. తన పేరు ఉండాల్సిందే.. కుదిరినా కుదరకపోయినా.. తన ఫొటో వేయాల్సిందే. ఇదీ.. గతంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ చేసిన తీర్మానం.. ఆదేశించిన తీరు. దీంతో చేసేదేముంది.. అధికారులు కూడాఅయ్యగారి బాటనే పట్టారు. దీంతో అన్నింటి పైనా జగన్ ఫొటోలు.. పేర్లు ముద్రించేశారు. అయితే.. ఈ సమయంలో జగన్ ఏమనుకున్నారో తెలియదు కానీ.. ప్రజలు దీనిని ఏవగించుకున్నారనే టాక్ ఎన్నికల అనంతరం వినిపించింది.
ఒకటి కాదు.. రెండు కాదు అన్ని కీలక పథకాలపైనా జగన్ తన పేరును ముద్రించుకున్నారు. సర్వేలకు వినియోగించే హద్దు రాళ్లపై ఏకంగా తన ఫొటోలనే కార్వింగ్(చెక్కించుకోవడం) చేయించుకున్నారు. ఇక, ప్రజలకు ఇచ్చే ప్రతి పథకంపైనా తన పేరు వేసుకున్నారు. చివరకు చిన్నారులకు ఇచ్చే స్కూలు బ్యాగులు.. పుస్తకాలు..వారు తినే ఆహారంపైనా పేరు , ఫొటో వేసుకున్నారు. ఇవన్నీ శాశ్వత మని జగన్ అనుకుని ఉండొచ్చు.
కానీ.. ప్రజాస్వామ్యంలో అధికారం నీటి బుడగ. దీనిని గుర్తించే సరికి.. జగన్ పేరు పోయింది. అన్ని పథకాల నుంచి జగన్ పేరును తొలగించేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా ప్రభుత్వ స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఇచ్చే చిక్కీల కవర్ల రంగు మార్చారు. అంతేకాదు.. జగన్ ఫొటోలను కూడా తీసేశారు. ఇప్పటి వరకు వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను ముద్రించగా ప్రస్తుతం ప్రభుత్వ రాజముద్రతో చిక్కీల కవర్లను రూపొందించారు.
అలాగే వాటిపై ‘జగనన్న గోరుముద్ద’ అని ఉండగా దాన్ని తొలగించారు. రేపటి నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కావాల్సి ఉండటంతో విద్యార్థులకు చిక్కీలతో పాటు కోడిగుడ్లు, రాగిపిండి సరఫరా చేయనున్నారు. నిజానికి చిక్కీ ప్యాకెట్లు రెండు అంగుళాల వెడల్పు మాత్రమే ఉంటాయి. వాటిపైనా జగన్ తన ఫొటోలు వేయించుకున్నారు. ఇప్పుడు సర్కారు పోయే సరికి.. రంగుతో పాటు ఆయన ఫొటో కూడా పోయింది.
This post was last modified on June 12, 2024 1:05 pm
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…