టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన ఎత్తుగడల ఫలితంగా తెలంగాణలో ప్రతిపక్షం జాడ వెతుక్కునే పరిస్థితి ఉందనే సంగతి తెలిసిందే. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేల్లో మెజార్టీ గులాబీ గూటికి చేరిపోగా కొందరు మాత్రమే పార్టీకి కట్టుబడి ఉన్నారు.
ఇలాంటి వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఒకరు. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే సీతక్క తీరు గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన నియోజకవర్గ ప్రజలకు చేసిన వివిధ సేవ కార్యక్రమాల కారణంగా ఆమె పాపులారిటీ సంపాదించారు. అయితే, ఇప్పుడు మరో ముందడుగు వేశారు.
లాక్ డౌన్ వల్ల చాలామందికి ఒక పూట తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అలాంటి వాళ్ల ఆకలిని తీర్చేలా పేద ప్రజల కోసం మంచి ఆలోచన చేసిన సీతక్క పేదలకు సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పటికే లాక్ డౌన్ క్రమంలో ఇంట్లో కాళీగా ఉన్న కొందరు రకరకాల ఛాలెంజ్ లతో టైమ్ పాస్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే, దీనికంటే భిన్నంగా సీతక్క కొత్త ఛాలెంజ్ విసిరారు. గోహంగర్ గో పేరుతో ప్రారంభించిన ఈ ఛాలెంజ్లో ఒకరు కొంత మంది పేదలకు ఆహారం పంపిణీ చేయాలి. వారు మరొకరికి ఇలాగే ఛాలెంజ్ చేయాలి. ఎవరికీ ఉపయోగపడని ఛాలెంజుల కన్నా ఆకలితో అలమటించేవారి ఆకలిని తీర్చే ఈ ఛాలెంజ్ మంచిదని నెటిజన్లు అంటున్నారు.
ఈ చాలెంజ్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు కొరకరాని కొయ్యగా మారిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిలకు చాలెంజ్ విసిరిన సీతక్క తన సోదరులు ఈ చాలెంజ్ పూర్తి చేసి అన్నార్తుల కడుపు నింపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
This post was last modified on April 27, 2020 5:25 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…