Political News

సీత‌క్క కొత్త ఛాలెంజ్..

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డ‌ల ఫ‌లితంగా తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం జాడ వెతుక్కునే ప‌రిస్థితి ఉంద‌నే సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిపక్ష కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేల్లో మెజార్టీ గులాబీ గూటికి చేరిపోగా కొంద‌రు మాత్ర‌మే పార్టీకి క‌ట్టుబ‌డి ఉన్నారు.

ఇలాంటి వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క ఒక‌రు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండే ఎమ్మెల్యే సీత‌క్క తీరు గ‌త కొద్దికాలంగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు చేసిన వివిధ సేవ కార్య‌క్ర‌మాల కార‌ణం‌గా ఆమె పాపులారిటీ సంపాదించారు. అయితే, ఇప్పుడు మ‌రో ముంద‌డుగు వేశారు.

లాక్ డౌన్ వ‌ల్ల చాలామందికి ఒక పూట తిండి కూడా దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అలాంటి వాళ్ల ఆక‌లిని తీర్చేలా పేద ప్ర‌జ‌ల కోసం మంచి ఆలోచ‌న చేసిన సీత‌క్క పేద‌ల‌కు సాయం చేయాలంటూ సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇప్ప‌టికే లాక్ డౌన్ క్ర‌మంలో ఇంట్లో కాళీగా ఉన్న కొంద‌రు ర‌క‌ర‌కాల ఛాలెంజ్ ల‌తో టైమ్ పాస్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే, దీనికంటే భిన్నంగా సీత‌క్క కొత్త ఛాలెంజ్ విసిరారు. గోహంగర్ గో పేరుతో ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌లో ఒక‌రు కొంత మంది పేద‌ల‌కు ఆహారం పంపిణీ చేయాలి. వారు మ‌రొక‌రికి ఇలాగే ఛాలెంజ్ చేయాలి. ఎవ‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌ని ఛాలెంజుల క‌న్నా ఆక‌లితో అల‌మ‌టించేవారి ఆక‌లిని తీర్చే ఈ ఛాలెంజ్ మంచిదని నెటిజ‌న్లు అంటున్నారు.

ఈ చాలెంజ్‌లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారిన కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ, మాజీ ఎంపీ విశ్వేశ్వ‌ర్ రెడ్డిల‌కు చాలెంజ్ ‌విసిరిన సీత‌క్క త‌న సోద‌రులు ఈ చాలెంజ్ పూర్తి చేసి అన్నార్తుల క‌డుపు నింపుతార‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు.

This post was last modified on April 27, 2020 5:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

21 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

40 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago