ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో పలువురు సీనియర్లకు క్యాబినెట్ లో స్థానం దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. క్యాబినెట్ లో బెర్తు ఖాయం అని ఇప్పటికే వారికి ఫలానా శాఖ దక్కుతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీనియర్లను పక్కన పెట్టడం విశేషం.
బాబు క్యాబినెట్ లో ఈ సారి ఖచ్చితంగా చోటు లభిస్తుందనుకున్న వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాయల అయ్యన్న పాత్రుడు, ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాస రావు, యరపతినేని శ్రీనివాసరావు, బొండా ఉమా మహేశ్వర్ రావు, గద్దె రామ్మోహన్, నందమూరు బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, GV ఆంజనేయులు, కూన రవి తదితరులు ఉన్నారు.
అలాగే వీరితో పాటు JC అస్మిత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి కొండ్రు మురళీతో పాటు రాష్ట్రం లోనే భారీ మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాస రావులకు అవకాశం దక్కలేదు. బాబు క్యాబినెట్ లో గోరంట్లకు వ్యవసాయ శాఖ, బోండా ఉమకు భారీ నీటిపారుదల శాఖ అని ప్రచారం జరిగింది. అనంతపురం జిల్లాలో జనసేన నుండి ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్ యాదవ్, టీడీపీ నుండి గెలిచిన ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మొదటిసారి పెనుగొండ నుండి గెలిచిన సవితకు క్యాబినెట్ లో చోటు దక్కింది. కానీ మాజీ మంత్రి పరిటాల రవి సతీమణి పరిటాల సునీతకు దక్కకపోవడం విశేషం.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి వరసగా ఆరు సార్లు విజయం సాధించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ ఎన్నికల్లో వరసగా ఏడోసారి 64,090 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించినా క్యాబినెట్ లో చోటు దక్కలేదు. విజయవాడ సెంట్రల్ నుండి బోండా ఉమ 68886 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. భీమిలి నుండి ఈ సారి 92 వేల ఓట్ల మెజారిటీతో గెలిచినా గంటా శ్రీనివాసరావుకు స్థానం దక్కలేదు. ఇక ఈసారి హ్యాట్రిక్ విజయం సాధించిన నందమూరి బాలక్రిష్ణకు క్యాబినెట్ లో చోటు ఖాయం అనుకున్నారు. కానీ ఆయనకు కూడా స్థానం దక్కకపోవడం విశేషం.
సీనియర్లకు చోటు దక్కకపోవడం వెనక చంద్రబాబు వ్యూహం ఏంటి అన్నది తెలుగుదేశం పార్టీతో పాటు, ఏపీ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే కొత్తవారికి అవకాశం ఇవ్వడం మూలంగా ఉత్సాహంతో పనిచేస్తారన్న ఉద్దేశంతోనే 17 మందికి చోటు కల్పించారు అన్న ప్రచారం నడుస్తుంది.
This post was last modified on June 12, 2024 1:21 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…