ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో పలువురు సీనియర్లకు క్యాబినెట్ లో స్థానం దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. క్యాబినెట్ లో బెర్తు ఖాయం అని ఇప్పటికే వారికి ఫలానా శాఖ దక్కుతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీనియర్లను పక్కన పెట్టడం విశేషం.
బాబు క్యాబినెట్ లో ఈ సారి ఖచ్చితంగా చోటు లభిస్తుందనుకున్న వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాయల అయ్యన్న పాత్రుడు, ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాస రావు, యరపతినేని శ్రీనివాసరావు, బొండా ఉమా మహేశ్వర్ రావు, గద్దె రామ్మోహన్, నందమూరు బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, GV ఆంజనేయులు, కూన రవి తదితరులు ఉన్నారు.
అలాగే వీరితో పాటు JC అస్మిత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి కొండ్రు మురళీతో పాటు రాష్ట్రం లోనే భారీ మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాస రావులకు అవకాశం దక్కలేదు. బాబు క్యాబినెట్ లో గోరంట్లకు వ్యవసాయ శాఖ, బోండా ఉమకు భారీ నీటిపారుదల శాఖ అని ప్రచారం జరిగింది. అనంతపురం జిల్లాలో జనసేన నుండి ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్ యాదవ్, టీడీపీ నుండి గెలిచిన ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మొదటిసారి పెనుగొండ నుండి గెలిచిన సవితకు క్యాబినెట్ లో చోటు దక్కింది. కానీ మాజీ మంత్రి పరిటాల రవి సతీమణి పరిటాల సునీతకు దక్కకపోవడం విశేషం.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి వరసగా ఆరు సార్లు విజయం సాధించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ ఎన్నికల్లో వరసగా ఏడోసారి 64,090 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించినా క్యాబినెట్ లో చోటు దక్కలేదు. విజయవాడ సెంట్రల్ నుండి బోండా ఉమ 68886 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. భీమిలి నుండి ఈ సారి 92 వేల ఓట్ల మెజారిటీతో గెలిచినా గంటా శ్రీనివాసరావుకు స్థానం దక్కలేదు. ఇక ఈసారి హ్యాట్రిక్ విజయం సాధించిన నందమూరి బాలక్రిష్ణకు క్యాబినెట్ లో చోటు ఖాయం అనుకున్నారు. కానీ ఆయనకు కూడా స్థానం దక్కకపోవడం విశేషం.
సీనియర్లకు చోటు దక్కకపోవడం వెనక చంద్రబాబు వ్యూహం ఏంటి అన్నది తెలుగుదేశం పార్టీతో పాటు, ఏపీ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే కొత్తవారికి అవకాశం ఇవ్వడం మూలంగా ఉత్సాహంతో పనిచేస్తారన్న ఉద్దేశంతోనే 17 మందికి చోటు కల్పించారు అన్న ప్రచారం నడుస్తుంది.
This post was last modified on June 12, 2024 1:21 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…