టీడీపీ అధినేత చంద్రబాబు తన కేబినెట్ కూర్పు, చేర్పు విషయంలో సోషల్ ఇంజనీరింగ్కు ప్రాధాన్యం ఇచ్చారు. ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన బీసీల విషయంలో ఈ సారి పెద్ద అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. బీసీలలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు కూడా చంద్రబాబు ఛాన్స్ ఇవ్వడం గమనార్హం. ఫలితంగా ఆయా సామాజిక వర్గాల డిమాండ్లను చంద్రబాబు నెరవేర్చినట్టు అయింది. ఎప్పటి నుంచో తమకు అవకాశం ఇవ్వాలన్న వారి డిమాండ్లను పరిష్కరించినట్టు కూడా అయింది.
కొల్లు రవీంద్ర: చంద్రబాబు కేబినెట్లో గతంలోనూ కొల్లు రవీంద్ర చేశారు. బీసీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొల్లు.. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. గత వైసీపీ పాలనలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. కొన్ని రోజులు జైలుకు కూడా వెళ్లారు. అయితే.. తర్వాత పోరాటాలతో వ్యతిరేకతను అధిగమించిన పార్టీ తరఫున విజయం దక్కించుకున్నారు.
అచ్చెన్నాయుడు: ఉత్తరాంధ్రకు చెందిన కొప్పుల వెలమ సామాజిక వర్గం. బీసీలుగా పరిగణించే ఈ వర్గం నుంచి గతంలోనూ ఆయన మంత్రి అయ్యారు. బలమైన గళం, పార్టీని ఏపీలో నడిపిస్తున్న తీరు వంటివి అందరికీ తెలసింది. మరో సారి అవకాశం దక్కించుకున్నారు.
కొండపల్లి శ్రీనివాస్: ఉత్తరాంధ్రకు చెందిన కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం నుంచి విజయం దక్కించుకున్నారు. ఈయన బీసీ తూర్పుకాపు సామాజిక వర్గం. ఈయనకు కూడా చంద్రబాబు అవకాశం ఇచ్చారు.
సత్యకుమార్(బీజేపీ): బీజేపీకి ఇచ్చిన ఒక్క సీటు విషయంలోనూ.. చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి విజయం దక్కించుకున్న సత్య కుమార్కు అవకాశం ఇచ్చారు. ఈయన కూడా బీసీ వర్గానికి చెందిన నాయకుడు. యాదవ వర్గంలో మంచి పేరు కూడా దక్కించుకున్నారు.
సత్యప్రసాద్: గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వరుస విజయాలు దక్కించుకున్న నాయకుడు. గౌడ సామాజిక వర్గం నేత. ఈయనకు చంద్రబాబు తొలిసారి అవకాశం ఇచ్చారు. వీర విధేయత, స్వయంకృషికి ఈ పదవి తార్కాణమనే చెప్పాలి.
సవిత: అనంతపురం సహా.. సీమలో బీసీలుగా పరిగణించే కురబ సామాజిక వర్గానికి చెందిన సవిత తొలిసారి విజయం అందుకున్నారు. పెనుకొండ నుంచి గెలిచారు. ఈమెకు చంద్రబాబు బీసీ కోటాలోనే మంత్రి పదవి ఇచ్చారు.
సుభాష్: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి విజయం దక్కించుకున్న వాసం శెట్టి సుభాష్కు చంద్రబాబు మంత్రి పదవి కేటాయించారు. ఈయన బీసీ సామాజిక వర్గం శెట్టి బలిజ వర్గానికి చెందిన నాయకుడు. తొలిసారి మంత్రి పదవిని దక్కించుకున్నారు.
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న ప్రచారం అల్లు అర్జున్ 23 క్యాన్సిల్ కావొచ్చని. దానికి తగ్గట్టే…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా తీయాలని ఏడాది కిందట్నుంచి ప్రయత్నాలు…
భారత్ తో వాణిజ్య సంబంధాలు మరింతగా మెరుగుపరుచుకుంటామని చెబుతూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చేందుకు…