ఏపీలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఒక స్ఫూర్తిదాయకమైన తీర్పును ఇచ్చారని కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం చంద్రబాబును.. ఎన్డీయే కూటమి పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలనను కోరుకున్నారని, కానీ ఎలాంటి పాలన అందించారో. గత పాలకుడి గురించి తెలిసిందేనని అన్నారు.
అలాంటి దుర్మార్గపు పాలన తమకు అవసరం లేదని.. ప్రజలు తీర్పు చెప్పారని చంద్రబాబు తెలిపారు. ఒకరకంగా ఈ ఎన్నికల విజయం ఓ కేస్ స్టడీ అని భావిస్తున్నట్టు తెలిపారు. కక్షపూరిత రాజకీయాలు.. దాడులు చేసినందున ప్రజలు ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టారని వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో సొంత పార్టీ నాయకులకు కొన్ని కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు టీడీపీ కూటమి నేతలు కూడా కక్ష తీర్చుకోవాలని చూస్తే.. మనకు కూడా ఇబ్బంది తప్పదని హెచ్చరించారు.
అయితే.. తప్పు చేసిన వారి విషయంలో మాత్రం క్షమించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలి పెడితే.. అదే అలవాటుగా మారుతుందని, కాబట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, విధ్వంసకర రాజకీయాలు, కక్ష పూరిత రాజకీయాలను ప్రక్షాళన చేయనున్నట్టు చెప్పారు. ఎవరూ కూడా తొందర పాటు చర్యలకు దిగకూడదని.. ఏదైనా ఉంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
This post was last modified on June 11, 2024 3:10 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…