Political News

ఈ విజ‌యం ఓ కేస్ స్ట‌డీ: చంద్ర‌బాబు

ఏపీలో జ‌రిగిన ఎన్నికల్లో ప్ర‌జ‌లు ఒక స్ఫూర్తిదాయ‌క‌మైన తీర్పును ఇచ్చార‌ని కాబోయే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. మంగ‌ళ‌వారం చంద్ర‌బాబును.. ఎన్డీయే కూటమి పార్టీల ముఖ్యమంత్రి అభ్య‌ర్థిగా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్ర‌జ‌లు అభివృద్ధితో కూడిన సంక్షేమ పాల‌న‌ను కోరుకున్నార‌ని, కానీ ఎలాంటి పాల‌న అందించారో. గ‌త పాల‌కుడి గురించి తెలిసిందేన‌ని అన్నారు.

అలాంటి దుర్మార్గ‌పు పాల‌న త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని.. ప్ర‌జ‌లు తీర్పు చెప్పారని చంద్ర‌బాబు తెలిపారు. ఒక‌ర‌కంగా ఈ ఎన్నిక‌ల విజ‌యం ఓ కేస్ స్ట‌డీ అని భావిస్తున్న‌ట్టు తెలిపారు. కక్ష‌పూరిత రాజ‌కీయాలు.. దాడులు చేసినందున ప్ర‌జ‌లు ఆ ప్ర‌భుత్వాన్ని ప‌క్క‌న పెట్టార‌ని వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో సొంత పార్టీ నాయ‌కుల‌కు కొన్ని కీల‌క సూచ‌న‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వం మాదిరిగానే ఇప్పుడు టీడీపీ కూట‌మి నేత‌లు కూడా క‌క్ష తీర్చుకోవాల‌ని చూస్తే.. మ‌న‌కు కూడా ఇబ్బంది త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

అయితే.. త‌ప్పు చేసిన వారి విష‌యంలో మాత్రం క్ష‌మించేది లేద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. త‌ప్పు చేసిన వారిని వ‌దిలి పెడితే.. అదే అల‌వాటుగా మారుతుంద‌ని, కాబ‌ట్టి చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అయితే, విధ్వంసక‌ర రాజ‌కీయాలు, క‌క్ష పూరిత రాజ‌కీయాల‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌నున్న‌ట్టు చెప్పారు. ఎవ‌రూ కూడా తొంద‌ర పాటు చ‌ర్య‌ల‌కు దిగ‌కూడ‌ద‌ని.. ఏదైనా ఉంటే ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత చ‌ట్ట‌ప‌రంగానే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

This post was last modified on June 11, 2024 3:10 pm

Share
Show comments
Published by
Satya
Tags: TDP janasena

Recent Posts

ఎటెటో వెళ్తున్న జన నాయకుడు గొడవ

సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…

56 minutes ago

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

1 hour ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

2 hours ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

5 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

5 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

6 hours ago