జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక నుంచి పూర్తిస్థాయి రాజకీయాలే చేయనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. తాజాగా ఆయనను జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా ఆ పార్టీ తరఫున ఎన్నికైన 20 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించారు. సభ్యులు అందరూ ఏకగ్రీవంగా బలపరిచారు
అయితే.. ఒక పార్టీకి శాసన సభా పక్షనాయకుడిగా ఉన్న నేత పూర్తిస్థాయిలో సమయం వెచ్చించాల్సి ఉం టుంది. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ ప్రాధాన్యం ఉంటుంది. అదేవిధంగా పార్టీ నేతలను కూడా సమన్వయ పరచాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తీసుకునే ఈ బాధ్యతలను బట్టి చూస్తే.. ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగే అవకాశం ఉన్నట్టుతెలుస్తోంది. నిజానికి ఇప్పటికే ఆయన కొన్ని సినిమాల్లో ఒప్పుకొని ఉన్నారు. మరి వాటిని ఎలా పూర్తి చేయనున్నారో చూడాలి.
చంద్రబాబుకు మద్దతు
కూటమి పార్టీల తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఎన్డీయే పార్టీలపక్షాన తరఫున తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. అనంతరం.. చంద్రబాబు.. పవన్ను ఆలింగనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పురందేశ్వరి కూడా.. బీజేపీ తరఫున తాము కూడా చంద్రబాబుకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…