టీడీపీ నేతృత్వంలోని బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే.. తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనే ఉంటుందని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు హామీ నెరవేరనుంది. ఈ మేరకు సంబంధిత ఫైలును అధికారులు రెడీ చేశారు. ఎన్నికల సమయంలో మెగా డీఎస్సీ వ్యవహారం రాజకీయంగా కీలక చర్చకు దారి తీసింది. జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లు ఒక్క డీఎస్సీ కూడా వేయకపోవడంతో విసుగెత్తిన నిరుద్యోగు లు కూటమి పార్టీలపై ఆశలు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో వారి నాడిని పసిగట్టిన చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం.. మెగా డీఎస్సీకి సంబంధించిన ఫైలుపైనే ఉంటుందని చెప్పారు. ఇచ్చిన హామీని నెరవేర్చుకునే క్రమంలో ఆయన తొలి సంతకానికి సంబంధించిన ఫైలును అధికారులు సిద్ధం చేశారు. బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం.. తొలి సంతకం ఈ ఫైలుపైనే చేయనున్నారు. అదేవిధంగా చంద్రబాబు రెండో సంతకానికి సంబంధించిన ఫైలుకూడా రెడీ అయింది.
ఈ ఫైలుపై కూడా.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం చేయనున్నారు. ఇది.. అత్యత కీలకమైన.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైలు కావడం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ చట్టంపై ఎన్నిక లసమయంలో తీవ్ర దుమారం రేగింది. ప్రజల ఆస్తులను హరించేలా ఉన్న ఈ చట్టంపై అనేక చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే.. ఈ చట్టాన్నిరద్దు చేస్తామని చెప్పారు.
ఆయన చెప్పినట్టుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే ఉండనుంది. దీనికి సంబంధించి కూడా.. అధికారులు చర్యలు తీసుకున్నారు. అటు డీఎస్సీ, ఇటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైళ్లను అధికారులు సిద్ధం చేశారు. వీటిని ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చూపించనున్నారు. అనంతరం.. బుధవారం జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వీటిపై సంతకం చేయనున్నారు.
This post was last modified on June 11, 2024 12:56 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…