టీడీపీ నేతృత్వంలోని బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే.. తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనే ఉంటుందని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు హామీ నెరవేరనుంది. ఈ మేరకు సంబంధిత ఫైలును అధికారులు రెడీ చేశారు. ఎన్నికల సమయంలో మెగా డీఎస్సీ వ్యవహారం రాజకీయంగా కీలక చర్చకు దారి తీసింది. జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లు ఒక్క డీఎస్సీ కూడా వేయకపోవడంతో విసుగెత్తిన నిరుద్యోగు లు కూటమి పార్టీలపై ఆశలు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో వారి నాడిని పసిగట్టిన చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం.. మెగా డీఎస్సీకి సంబంధించిన ఫైలుపైనే ఉంటుందని చెప్పారు. ఇచ్చిన హామీని నెరవేర్చుకునే క్రమంలో ఆయన తొలి సంతకానికి సంబంధించిన ఫైలును అధికారులు సిద్ధం చేశారు. బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం.. తొలి సంతకం ఈ ఫైలుపైనే చేయనున్నారు. అదేవిధంగా చంద్రబాబు రెండో సంతకానికి సంబంధించిన ఫైలుకూడా రెడీ అయింది.
ఈ ఫైలుపై కూడా.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం చేయనున్నారు. ఇది.. అత్యత కీలకమైన.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైలు కావడం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ చట్టంపై ఎన్నిక లసమయంలో తీవ్ర దుమారం రేగింది. ప్రజల ఆస్తులను హరించేలా ఉన్న ఈ చట్టంపై అనేక చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే.. ఈ చట్టాన్నిరద్దు చేస్తామని చెప్పారు.
ఆయన చెప్పినట్టుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే ఉండనుంది. దీనికి సంబంధించి కూడా.. అధికారులు చర్యలు తీసుకున్నారు. అటు డీఎస్సీ, ఇటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైళ్లను అధికారులు సిద్ధం చేశారు. వీటిని ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చూపించనున్నారు. అనంతరం.. బుధవారం జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వీటిపై సంతకం చేయనున్నారు.
This post was last modified on June 11, 2024 12:56 pm
మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…
"ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల…
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…