ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ కూర్పుపై అసంతృప్తి సెగలు మొదలయ్యాయి.
మంత్రి పదవులు కేటాయింపుపై శివసేన(షిండే వర్గం) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ కంటే తక్కువ ఎంపీ సీట్లు గెలుచుకొన్న ఇతర ఎన్డీయే పక్ష పార్టీలకు క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి పదవులు కేటాయించి.. మహారాష్ట్రలో ఏడు లోక్సభ స్థానాలు గెలుచుకొన్న తమకు మాత్రం సహాయ మంత్రి పదవి ఇవ్వడంపై పెదవి విరిచింది.
పదవుల కేటాయింపులో బీజేపీ పక్షపాతం చూపిందని శివసేన(షిండే) ఎంపీ శ్రీరంగ్ బర్నే అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం క్యాబినెట్ హోదా మంత్రి పదవి దక్కుతుందని ఆశించామని అన్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలుచుకొన్న అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా మంత్రి పదవి కేటాయింపుపై వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తున్నది.
ఐదు సీట్లు గెలిచిన చిరాగ్ పాశ్వాన్ పార్టీకి, రెండు సీట్లు గెలుచుకొన్న జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి, ఒక్క సీటు మాత్రమే గెలిచిన జితిన్ రాం మాంఝీకి క్యాబినెట్ పదవులు ఇచ్చారని ఎన్డీయే కూటమిలో జేడీయూ, టీడీపీ తర్వాత తమ పార్టీనే పెద్ద భాగస్వామి అని శ్రీరంగ్ బర్నే అన్నారు. మహారాష్ట్రలో 15 సీట్లలో పోటీచేసిన తాము ఏడు సీట్లలో విజయం సాధించామని, 28 స్థానాల్లో నిలిచిన బీజేపీ కేవలం తొమ్మిదింటిలో మాత్రమే గెలిచిందని గుర్తు చేశారు.
బీజేపీ పాత మిత్రులుగా ఉన్న తన్న తమ పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో ఒక క్యాబినెట్ హోదా మంత్రి, ఒక సహాయ మంత్రి పదవిని ఆశిస్తున్నామని, మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను కలిసి ఎదుర్కోనున్న నేపథ్యంలో శివసేనకు తగిన గౌరవం దక్కుతుందని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…