కేంద్రంలో కొలువు దీరిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది. ఒంటరిగానే 16 మంది ఎంపీలను దక్కించుకున్న టీడీపీ కేంద్రంలో చక్రం తిప్పుతోంది. ముఖ్యంగా బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడంతో చంద్రబాబుకు అనూహ్యమైన గౌరవం, మద్దతు కూడా లభిస్తోంది. ఇక, బిహార్ అధికార పార్టీ నితీష్ కుమార్ సర్కారు నుంచి 12 మంది ఎంపీలు ఉన్నారు. ఇటు చంద్రబాబు, అటు నితీష్ ఇద్దరూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టారనేది వాస్తవం.
అయితే.. చంద్రబాబు, నితీష్లలో మోడీకి అత్యంత నమ్మకస్తుడు మాత్రం చంద్రబాబు మాత్రమే. నితీష్ అవకాశవాది అనే విషయం అందరికీ తెలిసిందే. గతంలోనూ బీజేపీతో కలిసి ఉండి.. తర్వాత వదిలేశారు. మళ్లీ కలిశారు. ఇలా.. గడిచిన నాలుగు సంవత్సరాల్లో రెండు సార్లు బీజేపీతో కాపురం చేయడం.. రెండుసార్లు వదిలేయడం తెలిసిందే. అయితే.. ఇప్పుడు కూడా ఆయనపై మోడీకి పెద్దగా నమ్మకాలు లేవనే చెప్పా లి. ఏమైనా జరగొచ్చనే వాదన జాతీయ రాజకీయాల్లో వినిపిస్తోంది.
ఇప్పటికే నితీష్ కూటమి నుంచి మైండ్ గేమ్ మొదలైంది. తమ నాయకుడు నితీష్కు ప్రదాన మంత్రి పదవిని ఇచ్చేందుకు.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రయత్నించిందని.. కానీ..తామే వద్దన్నామని కూడా చెప్పుకొచ్చారు. అయితే, దీనిని కాంగ్రెస్ ఖండించినా.. ఏమో తెరవెనుక ఏం జరిగిందో అనే చర్చ అయితే కొనసాగుతోంది. ఓ ఏడాది తర్వాతైనా నితీష్ తన బుద్ధి చూపించే ప్రయత్నం చేస్తే.. అది మోడీ సర్కారుకు ఇబ్బందిగానే మారనుంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబుపైనే మోడీ ఎక్కువగా ఆధారపడుతున్నారని జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. నితీష్ను నమ్ముకుంటే.. నిండా మునుగుతామని.. లేదా.. ఆయన గొంతెమ్మ కోరికలను నెరవేర్చాల్సి ఉంటుందని భావిస్తున్న కూటమి పార్టీల అగ్రనేతలు కూడా చంద్రబాబు వైపే చూస్తున్నా రు. ఇక్కడ విషయం ఏంటంటే.. నితీష్కు.. చంద్రబాబు కు నలుగురు ఎంపీలు తేడా ఉండడం. రేపు నితీష్ కాదన్నా.. ఆయన వెడలిపోయినా.. అవసరమైతే.. వేరే పార్టీని చేర్చుకున్నా బాబు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని బీజేపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే చంద్రబాబుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…