Political News

ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించిన జ‌న‌సేనాని.. ఏం చేశారంటే!

ఈ నెల 12న రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు కానుంది. ఈ లోగా ఢిల్లీలో కేంద్ర ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన నాటి నుంచి బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. అన్ని ప‌ర్య‌ట‌న‌లు ముగించుకుని ఏపీలో ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంపై దృష్టి పెట్టారు. ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌వుల కూర్పు.. స‌హా ఇత‌ర విష‌యాల‌పై ఆయ‌న దృష్టి పెట్టారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఉత్త‌రాంధ్ర‌లో ప‌వ‌న్ ప‌ర్య‌టించారు. అయితే.. ఇది రాజ‌కీయ ప‌ర్య‌ట‌న‌లా కాకుండా.. ఆద్యాత్మిక ప‌ర్య‌ట‌న కావ‌డం విశేషం. ఉత్తరాంధ్రులు ఇల‌వేల్పు నూకాంబిక అమ్మ‌వారిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ద‌ర్శించుకున్నారు. అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అమ్మ‌వారి ఆశీస్సులు తీసుకున్నారు. సార్వ‌త్రిక ఎన్నికల ముందు అనకాపల్లి ప్రచారంలో భాగంగా గెలుపు తర్వాత అనకాపల్లి నూకాంబిక దర్శించుకుంటానని చెప్పారు.

ఎన్నికల ప్రచారంలోనే ఈ మేర‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్ర‌క‌టించుకున్నారు. ఆ మాట ప్రకారం సోమ‌వారం అన‌కాప‌ల్లిలోని ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. త‌ల‌కు పాగాక‌ట్టుకుని సంప్ర‌దాయ వ‌స్త్రాల్లో అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంతరం అభిమానులు నూకాంబిక చిత్రపటం ఇచ్చి పవన్ కళ్యాణ్ ను సత్కరించారు. ఈ కార్య‌క్ర‌మం లో కూట‌మి పార్టీల నేత‌లు.. అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కూట‌మి పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆల‌య ప్రాంగ‌ణంలో జై ప‌వ‌న్, జై బాబు అని నినాదాలు చేశారు. అయితే.. ఆల‌యాల‌ను రాజ‌కీయం చేయొద్దంటూ.. ప‌వ‌న్ సూచించడంతో వారంతా మౌనం పాటించారు. అనంత‌రం.. విజ‌య‌వాడ‌కు బ‌య‌లు దేరి వ‌చ్చారు. కాగా, మంగ‌ళ‌వారం.. కూట‌మి ప్ర‌భుత్వ ఏర్పాటుపై చంద్ర‌బాబు, బీజేపీ నేత‌ల‌తో ప‌వ‌న్ భేటీ అయి చ‌ర్చించ‌నున్నారు.

This post was last modified on June 10, 2024 6:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

46 minutes ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

2 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

2 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

4 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

4 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

5 hours ago