Political News

ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించిన జ‌న‌సేనాని.. ఏం చేశారంటే!

ఈ నెల 12న రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు కానుంది. ఈ లోగా ఢిల్లీలో కేంద్ర ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన నాటి నుంచి బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. అన్ని ప‌ర్య‌ట‌న‌లు ముగించుకుని ఏపీలో ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంపై దృష్టి పెట్టారు. ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌వుల కూర్పు.. స‌హా ఇత‌ర విష‌యాల‌పై ఆయ‌న దృష్టి పెట్టారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఉత్త‌రాంధ్ర‌లో ప‌వ‌న్ ప‌ర్య‌టించారు. అయితే.. ఇది రాజ‌కీయ ప‌ర్య‌ట‌న‌లా కాకుండా.. ఆద్యాత్మిక ప‌ర్య‌ట‌న కావ‌డం విశేషం. ఉత్తరాంధ్రులు ఇల‌వేల్పు నూకాంబిక అమ్మ‌వారిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ద‌ర్శించుకున్నారు. అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అమ్మ‌వారి ఆశీస్సులు తీసుకున్నారు. సార్వ‌త్రిక ఎన్నికల ముందు అనకాపల్లి ప్రచారంలో భాగంగా గెలుపు తర్వాత అనకాపల్లి నూకాంబిక దర్శించుకుంటానని చెప్పారు.

ఎన్నికల ప్రచారంలోనే ఈ మేర‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్ర‌క‌టించుకున్నారు. ఆ మాట ప్రకారం సోమ‌వారం అన‌కాప‌ల్లిలోని ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. త‌ల‌కు పాగాక‌ట్టుకుని సంప్ర‌దాయ వ‌స్త్రాల్లో అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంతరం అభిమానులు నూకాంబిక చిత్రపటం ఇచ్చి పవన్ కళ్యాణ్ ను సత్కరించారు. ఈ కార్య‌క్ర‌మం లో కూట‌మి పార్టీల నేత‌లు.. అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కూట‌మి పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆల‌య ప్రాంగ‌ణంలో జై ప‌వ‌న్, జై బాబు అని నినాదాలు చేశారు. అయితే.. ఆల‌యాల‌ను రాజ‌కీయం చేయొద్దంటూ.. ప‌వ‌న్ సూచించడంతో వారంతా మౌనం పాటించారు. అనంత‌రం.. విజ‌య‌వాడ‌కు బ‌య‌లు దేరి వ‌చ్చారు. కాగా, మంగ‌ళ‌వారం.. కూట‌మి ప్ర‌భుత్వ ఏర్పాటుపై చంద్ర‌బాబు, బీజేపీ నేత‌ల‌తో ప‌వ‌న్ భేటీ అయి చ‌ర్చించ‌నున్నారు.

This post was last modified on June 10, 2024 6:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేగం పెంచాలోయ్ ‘బైకర్’ సాబ్

జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…

35 minutes ago

క్యాసినో కింగ్‌కు బీజేపీ కీల‌క ప‌ద‌వి?

`క్యాసినో కింగ్‌`గా గుర్తింపు తెచ్చుకుని వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను అక్ర‌మంగా ఆర్జించార‌న్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్ర‌వీణ్‌కు బీజేపీ కీల‌క…

6 hours ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

6 hours ago

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన…

8 hours ago

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

10 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

13 hours ago