Political News

జగన్‌కు వ్యతిరేకంగా ప్లేటు తిప్పేసిన స్వామీజీ

2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం కేంద్రంగా ఆశ్రమం నడిపే స్వరూపానంద స్వామితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత సన్నిహితంగా మెలిగారో.. ఆయనకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కొన్నిసార్లు స్వరూపానంద దగ్గరికెళ్లి వెళ్లి పాదాల దగ్గర కూర్చుని సేవ చేసుున్నారు. మరో వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి సైతం స్వరూపానందకు పాదాభివందనం చేశారు. కొన్నేళ్ల పాటు స్వరూపానందకు జగన్ ప్రభుత్వం ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చింది. స్వరూపానంద కూడా జగన్, ఆయన ప్రభుత్వాన్ని కొనియాడేవారు.

కానీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలై.. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందో లేదో స్వరూపానంద స్వరం మార్చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించంతో పాటు చంద్రబాబు మీద ప్రశంసలు కురిపించేశారు.

“నేను ఎవరికీ భయపడి కాదు. ఎప్పుడూ స్వరూపానంద ఒకలాగే ఉంటారు. చంద్రబాబు అంటే నాకు ఎంతో గౌరవం. ఆయన పెద్దవాడు. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా పరిపాలన కొనసాగాలి. ఆయన కుటుంబం బాగుండాలి. పరిపూర్ణమైన ఆయుష్షుతో ఉంటూ రాష్ట్రాన్ని బాగా పరిపాలించాలి. నేను చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నాను అనుకోవద్దు. గతంలో మురళీ మోహన్ ఎంపీగా ఉన్నపుడు చంద్రబాబు గెలవాలని రాజమండ్రిలో పెద్ద సభలు పెట్టి, సాధువులన్నీ పిలిచి యాగం చేశాను. అదే విధంగా జగన్ ప్రభుత్వం తప్పులు చేస్తే చెప్పాను. శ్రీశైలం కుంభాభిషేకం ఆపాలని చెబితే.. జగన్ కోర్టులను మేనేజ్ చేసి ఆ అభిషేకం చేశాడు. ఇంకా సింహాచలంలో, తిరుమలలో తప్పులు జరిగితే నేను బయటికి వచ్చి గళం విప్పాను. నేను ఎవరికీ అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా.. ఎవరు మా దగ్గరికి వచ్చినా ఉన్నదున్నట్లు మాట్లాడతాం” అని స్వరూపానంద ప్రెస్ మీట్లో చెప్పారు.

This post was last modified on June 10, 2024 4:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

7 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

11 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago