Political News

అంద‌రి చూపూ ఆ…1 పైనే…!

అవును. ఇప్పుడు అంద‌రి చూపూ జూలై 1వ తేదీపైనే ఉంది. నిజానికి.. ఈ నెల 4వ తేదీపై ఎంత ఉత్కంఠ నెల‌కొందో.. ఇప్పుడు అంద‌రూ అదే ఉత్కంఠ‌తో జూలై 1వ తేదీ కోసం వేచి చూస్తున్నారు. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోంది? అనే చ‌ర్చ ఆసక్తిగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

జూన్ 4న ఎన్నిక‌ల ఫ‌లితా కోసం.. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదురు చూశారు. ఇక‌,ఏపీలో అయితే.. మ‌రింత ఉత్కంఠ‌గా ఎదురు చూశారు. మొత్తంగా ఫ‌లితాలు వ‌చ్చాయి. ఎక్క‌డా శ‌ష‌భిష‌లు లేకుండా.. ప్ర‌జ‌లు ఏక‌ప‌క్షంగానే తీర్పు చెప్పారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రోసారి జూలై 1వ తేదీ పై అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం చంద్ర‌బాబు.. ఇచ్చిన కీల‌క హామీ. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జూలై 1వ తేదీనే సామాజిక పింఛన్లు పెంచుతామ‌ని హామీ ఇచ్చారు.

ఊరూ వాడా కూడా ఇదే ప్ర‌చారం చేశారు. తాజాగా వ‌చ్చిన ఓట్ల సునామీ వెనుక కీల‌క‌మైన కార‌ణం ఇదే ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు ఇచ్చిన హామీ బాగా ప‌నిచేసి ఉంటుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌ధానంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచే పెంచిన పింఛ‌నును ఇస్తామ‌ని.. ఏప్రిల్‌, మే, జూన్ మాసాల‌కు క‌లిపి మూడు వేలు(వెయ్యి చొప్పున‌) జూలైలో 4000 పింఛ‌ను క‌లిపి.. మొత్తం రూ.7000ల‌ను ల‌బ్ధిదారుల‌కు ఇంటికే పంపిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.

దీంతో వృద్ధులు, ఒంట‌రి మ‌హిళ‌లు.. ఎక్కువ‌గా సైకిల్‌ పై ఆశ‌లు పెట్టుకుని ఉండి ఉంటార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు చేయాల్సిన తొలి ప‌ని ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. అంటే.. పింఛ‌ను దారుల్లో దాదాపు 40 ల‌క్ష‌ల మంది వీరే ఉన్నారు.

వీరికి ఒక్కొక్క‌రికీ రూ.7000 చొప్పున పింఛ‌నును జూలై 1వ తేదీనే పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ, నిధులు చూస్తే.. అందుకు స‌హ‌క‌రించేలా క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో రెండో త్రైమాసికం గడువు వ‌ర‌కు (అంటే..సెప్టెంబ‌రు వ‌ర‌కు) కూడా..జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉన్న లిమిట్ అప్పులు వాడేసింది. ఇప్పుడు ఖజానాలో అంత మేర‌కు సొమ్ములు ఉండే అవ‌కాశం లేదు. దీంతో చంద్ర‌బాబు ఈ కీల‌క హామీని ఎలా నెర‌వేరుస్తార‌నే ఉత్కంఠ నెల‌కొంది. మ‌రి చూడాలి.. ఏం చేస్తారో!!

Satya

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

27 minutes ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

1 hour ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

1 hour ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

1 hour ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago