Political News

అంద‌రి చూపూ ఆ…1 పైనే…!

అవును. ఇప్పుడు అంద‌రి చూపూ జూలై 1వ తేదీపైనే ఉంది. నిజానికి.. ఈ నెల 4వ తేదీపై ఎంత ఉత్కంఠ నెల‌కొందో.. ఇప్పుడు అంద‌రూ అదే ఉత్కంఠ‌తో జూలై 1వ తేదీ కోసం వేచి చూస్తున్నారు. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోంది? అనే చ‌ర్చ ఆసక్తిగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

జూన్ 4న ఎన్నిక‌ల ఫ‌లితా కోసం.. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదురు చూశారు. ఇక‌,ఏపీలో అయితే.. మ‌రింత ఉత్కంఠ‌గా ఎదురు చూశారు. మొత్తంగా ఫ‌లితాలు వ‌చ్చాయి. ఎక్క‌డా శ‌ష‌భిష‌లు లేకుండా.. ప్ర‌జ‌లు ఏక‌ప‌క్షంగానే తీర్పు చెప్పారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రోసారి జూలై 1వ తేదీ పై అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం చంద్ర‌బాబు.. ఇచ్చిన కీల‌క హామీ. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జూలై 1వ తేదీనే సామాజిక పింఛన్లు పెంచుతామ‌ని హామీ ఇచ్చారు.

ఊరూ వాడా కూడా ఇదే ప్ర‌చారం చేశారు. తాజాగా వ‌చ్చిన ఓట్ల సునామీ వెనుక కీల‌క‌మైన కార‌ణం ఇదే ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు ఇచ్చిన హామీ బాగా ప‌నిచేసి ఉంటుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌ధానంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచే పెంచిన పింఛ‌నును ఇస్తామ‌ని.. ఏప్రిల్‌, మే, జూన్ మాసాల‌కు క‌లిపి మూడు వేలు(వెయ్యి చొప్పున‌) జూలైలో 4000 పింఛ‌ను క‌లిపి.. మొత్తం రూ.7000ల‌ను ల‌బ్ధిదారుల‌కు ఇంటికే పంపిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.

దీంతో వృద్ధులు, ఒంట‌రి మ‌హిళ‌లు.. ఎక్కువ‌గా సైకిల్‌ పై ఆశ‌లు పెట్టుకుని ఉండి ఉంటార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు చేయాల్సిన తొలి ప‌ని ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. అంటే.. పింఛ‌ను దారుల్లో దాదాపు 40 ల‌క్ష‌ల మంది వీరే ఉన్నారు.

వీరికి ఒక్కొక్క‌రికీ రూ.7000 చొప్పున పింఛ‌నును జూలై 1వ తేదీనే పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ, నిధులు చూస్తే.. అందుకు స‌హ‌క‌రించేలా క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో రెండో త్రైమాసికం గడువు వ‌ర‌కు (అంటే..సెప్టెంబ‌రు వ‌ర‌కు) కూడా..జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉన్న లిమిట్ అప్పులు వాడేసింది. ఇప్పుడు ఖజానాలో అంత మేర‌కు సొమ్ములు ఉండే అవ‌కాశం లేదు. దీంతో చంద్ర‌బాబు ఈ కీల‌క హామీని ఎలా నెర‌వేరుస్తార‌నే ఉత్కంఠ నెల‌కొంది. మ‌రి చూడాలి.. ఏం చేస్తారో!!

This post was last modified on June 10, 2024 9:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago