Political News

అంద‌రి చూపూ ఆ…1 పైనే…!

అవును. ఇప్పుడు అంద‌రి చూపూ జూలై 1వ తేదీపైనే ఉంది. నిజానికి.. ఈ నెల 4వ తేదీపై ఎంత ఉత్కంఠ నెల‌కొందో.. ఇప్పుడు అంద‌రూ అదే ఉత్కంఠ‌తో జూలై 1వ తేదీ కోసం వేచి చూస్తున్నారు. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోంది? అనే చ‌ర్చ ఆసక్తిగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

జూన్ 4న ఎన్నిక‌ల ఫ‌లితా కోసం.. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదురు చూశారు. ఇక‌,ఏపీలో అయితే.. మ‌రింత ఉత్కంఠ‌గా ఎదురు చూశారు. మొత్తంగా ఫ‌లితాలు వ‌చ్చాయి. ఎక్క‌డా శ‌ష‌భిష‌లు లేకుండా.. ప్ర‌జ‌లు ఏక‌ప‌క్షంగానే తీర్పు చెప్పారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రోసారి జూలై 1వ తేదీ పై అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం చంద్ర‌బాబు.. ఇచ్చిన కీల‌క హామీ. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జూలై 1వ తేదీనే సామాజిక పింఛన్లు పెంచుతామ‌ని హామీ ఇచ్చారు.

ఊరూ వాడా కూడా ఇదే ప్ర‌చారం చేశారు. తాజాగా వ‌చ్చిన ఓట్ల సునామీ వెనుక కీల‌క‌మైన కార‌ణం ఇదే ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు ఇచ్చిన హామీ బాగా ప‌నిచేసి ఉంటుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌ధానంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచే పెంచిన పింఛ‌నును ఇస్తామ‌ని.. ఏప్రిల్‌, మే, జూన్ మాసాల‌కు క‌లిపి మూడు వేలు(వెయ్యి చొప్పున‌) జూలైలో 4000 పింఛ‌ను క‌లిపి.. మొత్తం రూ.7000ల‌ను ల‌బ్ధిదారుల‌కు ఇంటికే పంపిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.

దీంతో వృద్ధులు, ఒంట‌రి మ‌హిళ‌లు.. ఎక్కువ‌గా సైకిల్‌ పై ఆశ‌లు పెట్టుకుని ఉండి ఉంటార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు చేయాల్సిన తొలి ప‌ని ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. అంటే.. పింఛ‌ను దారుల్లో దాదాపు 40 ల‌క్ష‌ల మంది వీరే ఉన్నారు.

వీరికి ఒక్కొక్క‌రికీ రూ.7000 చొప్పున పింఛ‌నును జూలై 1వ తేదీనే పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ, నిధులు చూస్తే.. అందుకు స‌హ‌క‌రించేలా క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో రెండో త్రైమాసికం గడువు వ‌ర‌కు (అంటే..సెప్టెంబ‌రు వ‌ర‌కు) కూడా..జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉన్న లిమిట్ అప్పులు వాడేసింది. ఇప్పుడు ఖజానాలో అంత మేర‌కు సొమ్ములు ఉండే అవ‌కాశం లేదు. దీంతో చంద్ర‌బాబు ఈ కీల‌క హామీని ఎలా నెర‌వేరుస్తార‌నే ఉత్కంఠ నెల‌కొంది. మ‌రి చూడాలి.. ఏం చేస్తారో!!

This post was last modified on June 10, 2024 9:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

27 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago