అవును. ఇప్పుడు అందరి చూపూ జూలై 1వ తేదీపైనే ఉంది. నిజానికి.. ఈ నెల 4వ తేదీపై ఎంత ఉత్కంఠ నెలకొందో.. ఇప్పుడు అందరూ అదే ఉత్కంఠతో జూలై 1వ తేదీ కోసం వేచి చూస్తున్నారు. దీంతో అసలు ఏం జరుగుతోంది? అనే చర్చ ఆసక్తిగా సాగుతుండడం గమనార్హం.
జూన్ 4న ఎన్నికల ఫలితా కోసం.. దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూశారు. ఇక,ఏపీలో అయితే.. మరింత ఉత్కంఠగా ఎదురు చూశారు. మొత్తంగా ఫలితాలు వచ్చాయి. ఎక్కడా శషభిషలు లేకుండా.. ప్రజలు ఏకపక్షంగానే తీర్పు చెప్పారు.
కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి జూలై 1వ తేదీ పై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం చంద్రబాబు.. ఇచ్చిన కీలక హామీ. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై 1వ తేదీనే సామాజిక పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారు.
ఊరూ వాడా కూడా ఇదే ప్రచారం చేశారు. తాజాగా వచ్చిన ఓట్ల సునామీ వెనుక కీలకమైన కారణం ఇదే ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఇచ్చిన హామీ బాగా పనిచేసి ఉంటుందని చెబుతున్నారు.
ప్రధానంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచే పెంచిన పింఛనును ఇస్తామని.. ఏప్రిల్, మే, జూన్ మాసాలకు కలిపి మూడు వేలు(వెయ్యి చొప్పున) జూలైలో 4000 పింఛను కలిపి.. మొత్తం రూ.7000లను లబ్ధిదారులకు ఇంటికే పంపిస్తామని చంద్రబాబు చెప్పారు.
దీంతో వృద్ధులు, ఒంటరి మహిళలు.. ఎక్కువగా సైకిల్ పై ఆశలు పెట్టుకుని ఉండి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు చేయాల్సిన తొలి పని ఇదే కావడం గమనార్హం. అంటే.. పింఛను దారుల్లో దాదాపు 40 లక్షల మంది వీరే ఉన్నారు.
వీరికి ఒక్కొక్కరికీ రూ.7000 చొప్పున పింఛనును జూలై 1వ తేదీనే పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ, నిధులు చూస్తే.. అందుకు సహకరించేలా కనిపించడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికం గడువు వరకు (అంటే..సెప్టెంబరు వరకు) కూడా..జగన్ ప్రభుత్వం ఉన్న లిమిట్ అప్పులు వాడేసింది. ఇప్పుడు ఖజానాలో అంత మేరకు సొమ్ములు ఉండే అవకాశం లేదు. దీంతో చంద్రబాబు ఈ కీలక హామీని ఎలా నెరవేరుస్తారనే ఉత్కంఠ నెలకొంది. మరి చూడాలి.. ఏం చేస్తారో!!
This post was last modified on June 10, 2024 9:03 am
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…