Political News

అంద‌రి చూపూ ఆ…1 పైనే…!

అవును. ఇప్పుడు అంద‌రి చూపూ జూలై 1వ తేదీపైనే ఉంది. నిజానికి.. ఈ నెల 4వ తేదీపై ఎంత ఉత్కంఠ నెల‌కొందో.. ఇప్పుడు అంద‌రూ అదే ఉత్కంఠ‌తో జూలై 1వ తేదీ కోసం వేచి చూస్తున్నారు. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోంది? అనే చ‌ర్చ ఆసక్తిగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

జూన్ 4న ఎన్నిక‌ల ఫ‌లితా కోసం.. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదురు చూశారు. ఇక‌,ఏపీలో అయితే.. మ‌రింత ఉత్కంఠ‌గా ఎదురు చూశారు. మొత్తంగా ఫ‌లితాలు వ‌చ్చాయి. ఎక్క‌డా శ‌ష‌భిష‌లు లేకుండా.. ప్ర‌జ‌లు ఏక‌ప‌క్షంగానే తీర్పు చెప్పారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రోసారి జూలై 1వ తేదీ పై అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం చంద్ర‌బాబు.. ఇచ్చిన కీల‌క హామీ. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జూలై 1వ తేదీనే సామాజిక పింఛన్లు పెంచుతామ‌ని హామీ ఇచ్చారు.

ఊరూ వాడా కూడా ఇదే ప్ర‌చారం చేశారు. తాజాగా వ‌చ్చిన ఓట్ల సునామీ వెనుక కీల‌క‌మైన కార‌ణం ఇదే ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు ఇచ్చిన హామీ బాగా ప‌నిచేసి ఉంటుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌ధానంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచే పెంచిన పింఛ‌నును ఇస్తామ‌ని.. ఏప్రిల్‌, మే, జూన్ మాసాల‌కు క‌లిపి మూడు వేలు(వెయ్యి చొప్పున‌) జూలైలో 4000 పింఛ‌ను క‌లిపి.. మొత్తం రూ.7000ల‌ను ల‌బ్ధిదారుల‌కు ఇంటికే పంపిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.

దీంతో వృద్ధులు, ఒంట‌రి మ‌హిళ‌లు.. ఎక్కువ‌గా సైకిల్‌ పై ఆశ‌లు పెట్టుకుని ఉండి ఉంటార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు చేయాల్సిన తొలి ప‌ని ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. అంటే.. పింఛ‌ను దారుల్లో దాదాపు 40 ల‌క్ష‌ల మంది వీరే ఉన్నారు.

వీరికి ఒక్కొక్క‌రికీ రూ.7000 చొప్పున పింఛ‌నును జూలై 1వ తేదీనే పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ, నిధులు చూస్తే.. అందుకు స‌హ‌క‌రించేలా క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో రెండో త్రైమాసికం గడువు వ‌ర‌కు (అంటే..సెప్టెంబ‌రు వ‌ర‌కు) కూడా..జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉన్న లిమిట్ అప్పులు వాడేసింది. ఇప్పుడు ఖజానాలో అంత మేర‌కు సొమ్ములు ఉండే అవ‌కాశం లేదు. దీంతో చంద్ర‌బాబు ఈ కీల‌క హామీని ఎలా నెర‌వేరుస్తార‌నే ఉత్కంఠ నెల‌కొంది. మ‌రి చూడాలి.. ఏం చేస్తారో!!

This post was last modified on June 10, 2024 9:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విశ్వ‌ఖ్యాతికి చేరిన విశాఖ కీర్తి

విశాఖ‌ప‌ట్నం కీర్తి .. విశ్వ‌ఖ్యాతికి చేరింది. ఇక్క‌డ ఏర్పాటు చేయ‌నున్న ప్ర‌తిష్టాత్మ‌క గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి ఈ రోజు(మంగ‌ళ‌వారం)…

2 hours ago

ఊరించడమేనా… నిజంగా సీక్వెల్ చేస్తారా?

ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అనగానే ప్రేక్షకుల్లో అమితాసక్తి కనిపిస్తుంది. మళ్లీ అలాంటి మ్యాజిక్‌ను రిపీట్ చేయడం కష్టమే…

2 hours ago

మహేష్ గోల్డెన్ ఛాన్స్.. అందుకునేదెవరు?

దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే.. ఆ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ అన్నీ ఒక్కసారిగా మారిపోవడం మామూలే. ముఖ్యంగా…

2 hours ago

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్ళిన అన్న..

ఒడిశాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సోదరి ఖాతా నుంచి డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి,…

3 hours ago

సాయిపల్లవి మీద ట్రోలింగ్ అర్ధరహితం

ఇటీవలే జరిగిన ఏక్ దిన్ ఈవెంట్ లో సాయిపల్లవి హిందీలో ధారాళంగా మాట్లాడలేకపోవడాన్ని సోషల్ మీడియాలో కొందరు ట్రోలింగ్ కంటెంట్…

5 hours ago

అన్ని క‌మిటీలూ ర‌ద్దు .. కేటీఆర్‌కు పూర్తి ప‌గ్గాలు?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ అధినేత‌.. కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. బీఆర్ ఎస్ రాష్ట్ర‌స్థాయి క‌మిటీ…

7 hours ago