అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలన్నది తమ పార్టీ వైఖరి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ విషయంలో అమరావతి రైతులకు అండగా ఉంటామని, పోరాడతామని పవన్ గతంలోనే ప్రకటించారు. అమరావతికి వెళ్లి ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావం కూడా ప్రకటించారు. కానీ ఈ మధ్య ఈ విషయంలో పవన్ వైఖరి మారిందనే ప్రచారం జరుగుతోంది. అమరావతి రైతులను ఆయన పట్టించుకోవడం లేదని, మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదని అంటున్నారు. ఐతే ఓ ప్రధాన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రచారాన్ని ఖండించాడు. మూడు రాజధానుల తీర్మానాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పిన పవన్.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని స్పష్టం చేశాడు. ఈ విషయంలో పవన్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక సూటి ప్రశ్న వేశాడు.
‘‘కాపులకు మేం రిజర్వేషన్లు ఇవ్వం, వర్గీకరణ మా చేతుల్లో లేదు అని జగన్ ఎన్నికలకు ముందు ఆ రెండు అంశాల విషయంలో తమ విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. ఇలా మరికొన్ని విషయాలపై స్పష్టంగా చెప్పిన జగన్.. రాజధాని విషయంలో కూడా తన మనసులో మాట ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే అప్పుడే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేవారు. ప్రతిపక్ష నేత హోదాలో అమరావతిని రాధానిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామని చెప్పిన జగన్.. ఇప్పుడు ప్రజల మనోభావాలు, వారి ఆస్తిపాస్తులతో చెలగాటం ఆడతానంటే ఎలా? ఏదైనా కష్టం వస్తే ప్రజలు ప్రభుత్వం దగ్గరికెళ్తారు. కాపాడాల్సిన ప్రభుత్వమే మోసం చేస్తే ఎవరికి చెప్పాలి? రాజధాని కోసం అన్నేసి ఎకరాలు అవసరం లేదని, చిన్న రాజధాని చాలని మా పార్టీ అంటే.. వైకాపా నాయకత్వం మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన రాజధానిపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. జగన్ విపక్ష నేతగా ఉంటూనే అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు. ఆయన కదిలినపుడు మీరెందుకు కదలరని నన్ను ప్రశ్నిస్తే.. నేను కూడా అమరావతిలో ఇల్లు తీసుకున్నా. చాలామంది ఇలాగే అమరావతిపై నమ్మకం పెరిగి పెట్టుబడులు పెట్టారు. ఎక్కడెక్కడో ఉన్న ఆస్తులను అమ్మి ఇక్కడ భూమి కొనుక్కున్నారు. అమరావతి రాష్ట్ర రాజధాని అనే సమష్టి నిర్ణయంలో వైకాపా కూడా భాగస్వామే. ఇప్పుడు మాట మారిస్తే ఎలా’’ అని పవన్ ప్రశ్నించాడు.
This post was last modified on September 21, 2020 8:29 am
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఒక ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. ఇప్పటి…
ట్రెడిషనల్ హీరోయిన్గా ముద్ర పడ్డ ఐశ్వర్యా రాజేష్ లాంటి హీరోయిన్ల గురించి ఎఫైర్ రూమర్లు రావడం అరుదు. ఐశ్వర్య ఫలానా…
ఈ వేసవిలో టాలీవుడ్ నుంచి రాబోతున్న ఏకైక భారీ చిత్రం.. కన్నప్ప. రాజా సాబ్, విశ్వంభర లాంటి పెద్ద సినిమాలు…
గత ఏడాది అమరన్ రూపంలో ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి త్వరలో ప్రభాస్ తో…
ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత, సేఫ్ డ్రైవింగ్.. తదితరాలపై జనాన్ని ఎడ్యుకేట్ చేయడంలో తెలంగాణ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు గురువారం సాయంత్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జాతుల వైరంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రంలో రాష్ట్రపతి…