Bandi Sanjay
తెలంగాణలో బీజేపీ కీలక నేత బండి సంజయ్కు బంపర్ ఆఫర్ తగిలింది. కొత్తగా ఏర్పడే కేంద్ర మంత్రివర్గంలో బండి సంజయ్కు చోటు దక్కింది. కొన్నేళ్లుగా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషికి ఇప్పుడు తగిన గుర్తింపు దక్కిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బండి సంజయ్ అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడే మోడీ కేబినేట్లో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్కు అవకాశం దక్కింది. కిషన్ రెడ్డి గత బీజేపీ ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.
ఈ సారి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఉత్తమ ఫలితాలు సాధించింది. గత ఎన్నికల కంటే 4 స్థానాలు ఎక్కువగా గెలుచుకుంది. దీంతో తెలంగాణలో ఆ పార్టీ బలం 8కి పెరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు రెండు మంత్రి పదవులు దక్కాయి. తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం బండి సంజయ్ శ్రమిస్తూనే ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్.. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. అనంతరం తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ బీజేపీని పరుగులు పెట్టించారు.
బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ దూకుడు ప్రదర్శించింది. క్షేత్రస్థాయికి పార్టీని తీసుకెళ్లారు. నిరుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడిగా తప్పించినా తెలంగాణలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కష్టపడ్డారు. పాదయాత్ర కూడా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు దక్కడంలో సంజయ్ పాత్ర కూడా ఉంది. అనంతరం లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కష్టపడ్డారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ పదవితో బండి సంజయ్ తెలంగాణలో పార్టీ పటిష్ఠం కోసం మరింత జోష్తో పనిచేసే అవకాశముంది.
This post was last modified on June 10, 2024 7:08 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…