Political News

జ‌గ‌న్ ఫొటోలు తొల‌గించండి: ఒక్క ఓట‌మి.. ఎంత చేసింది!

ఏపీలో కూట‌మి పార్టీలు అధికారంలోకి వ‌చ్చాయి. అయితే.. ప్ర‌మాణ స్వీకారానికి ఇంకా నాలుగు రోజుల స‌మ‌యం ఉంది. కానీ ఇంత‌లోనే సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ.. రాజకీయాల‌ను వేడెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే.. ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారుల విష‌యంలో బ‌దిలీలు.. ప‌క్క‌న పెట్ట‌డం వంటివి తెలిసిందే.

అదేవిధంగా మ‌ద్యం విధానంపై బేవ‌రేజెస్ ఎండీగా ఉన్న వాసుదేవ రెడ్డిపైనా కేసులు న‌మోదు చేశారు. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో అమ‌లైన ప్ర‌తి ప‌థ‌కంలోనూ.. నాటి సీఎం జ‌గ‌న్ ఫొటోలు ముద్రించారు. అదేవిదంగా ఆయా శాఖ‌ల మంత్రుల ఫొటోల‌ను కూడా ముద్రించారు.

ఇక‌, ఇప్పుడు ఆయా శాఖ‌ల ప‌రిధిలోని అన్ని ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలలో… మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు సహా రాజకీయ ప్రముఖుల ఫోటోలు తొలగించాల్సిందిగా అన్ని డిపార్ట్‌మెంట్లకు ఉత్తర్వులు జారీ చేశారు.

వీటిని 24 గంట‌ల‌లోగా తొల‌గించాల‌ని.. పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోనూ.. గ్రామ, వార్డు స‌చివాల‌యాల్లోనూ.. జ‌గ‌న్ ఫొటోల‌ను త‌క్ష‌ణ‌మే తీసేయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శినీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేశారు. అంతే కాదు.. గోడ‌ల‌పై జ‌గ‌న‌న్న‌ పేరుతో ముద్రించిన స్టిక్క‌ర్లు.. ఆ పార్టీ జెండా రంగుల‌ను కూడా తొల‌గించాల‌ని ఆదేశించారు.

ఇక‌, సామాజిక వ‌ర్గాలకు చెందిన 56 కార్పొరేష‌న్ల‌లో ఉన్న చైర్మ‌న్ల‌ను రాజీనామా చేయించే బాధ్య‌త‌ను క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించారు. వారితో త‌క్ష‌ణమే రాజీనామా చేయించాల‌ని కూడా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ ఆదేశాలు జారీ చేశారు.

ఇక‌, ఇప్ప‌టికే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు చైర్మ‌న్‌గా ఉన్న భూమ‌న క‌రుణా క‌ర్ రెడ్డి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న కుమారుడు.. తిరుప‌తి న‌గ‌ర పాల‌క‌సంస్థ‌.. కార్పొరేష‌న్ బోర్డులో ఉన్న ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు. అలాగే.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి కూడా.. టీటీడీ బోర్డు స‌భ్య‌త్వ ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఇక‌, శ్రీశైలం బోర్డు చైర్మ‌న్‌గా ఉన్న రెడ్డివారి చ‌క్ర‌పాణి రెడ్డి కూడా రాజీనామాకు రెడీ అయ్యారు. మొత్తంగా ఒక్క ఓట‌మితో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు ఇంటి ముఖం ప‌డుతున్నారు. చిత్రం ఏంటంటే.. ఆయా నామినేటెడ్ ప‌ద‌వుల కోసం.. నాయ‌కులు రూ.కోట్ల‌లో ఖ‌ర్చు పెట్టార‌ని పెద్ద ఎత్తున గుస‌గుస వినిపిస్తోంది.

అయితే.. ఎవ‌రూ బ‌య‌ట ప‌డ‌డం లేదు. అంత‌ర్గ‌తంగా కొంద‌రు టీడీపీని మ‌చ్చిక చేసుకుని.. ఆ పార్టీలోకి చేరైనా.. ఆయా ప‌ద‌వులు ద‌క్కించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని తెలుస్తోంది.

This post was last modified on June 9, 2024 4:35 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago