తెలుగు నాట సూర్యోదయానికి ముందే ప్రతి ఇంటికీ పలకరించే ఈనాడు.. ప్రజల చేతిలో కరదీపికగా.. వారి సమస్యల పరిష్కారానికి.. పట్టుగొమ్మగా మారిన విషయం తెలిసిందే. ఏ చిన్న సమస్య అయినా.. ఈనాడు లో వస్తే.. పరిష్కారం ఖాయం అనే మాట అందరికీ తెలిసిందే. విరిగిపోయిన విద్యుత్ స్తంభం నుంచి పాడు బడిన మురుగు కాల్వ వరకు.. ఎవరూ పట్టించుకోరు.. అనే స్థాయి నుంచి ఈనాడులో ఈ సమస్యను ప్రస్తావిస్తే.. తక్షణం పరిష్కారం అవుతుందనే వరకు ఆ పత్రిక స్థాయిని పెంచారు రామోజీ.
అనారోగ్య కారణాలతో రామోజీ.. తన అవిశ్రాంత కష్టానికి విరామం ఇస్తూ.. శాస్వత నిద్రలోకి జారుకున్నారు. అయితే.. రామోజీ కన్న కలల్లో రెండు కీలక అంశాలు ఉన్నాయి. అవి నెరవేర్చుకునే సమయం కూడా ఆసన్నమైంది. కొద్ది నెలల కాలంలోనే ఆయన వాటిని పరిపూర్ణం చేసుకోవాలని అనుకున్నారు. కానీ, ఇంతలోనే ఆయన విశ్రమించారు. నిజానికి రామోజీనే చెప్పుకొన్నట్టు.. సవాళ్లులేని జీవితం ఉప్పులేని కూర వంటిది. అలానే ఆయన జీవితంలో ఏనాడూ సాధించిన దానికి సంతృప్తి చెందినా.. విశ్రమించలేదు.
ఈ క్రమంలోనే రామోజీ ఫిల్మ్సిటీ వంటి.. బృహత్తర నగరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది టాటాలు, బిర్లలు, అంబానీలు, అదానీలకే సాధ్యం కాలేదు. వారు ప్రయత్నించి ఉంటే సాకారం అయ్యేదేమో.. తెలియదు. కానీ, ఈ దేశంలో ఎంతో మందిపారిశ్రామిక వేత్తలకు ఇళ్లు ఉన్నాయి. అంబరాన్నంటే.. విల్లాలు ఉన్నాయి.. కానీ, ఎక్కడా వారికి నగరాలు లేవు. దీనిని రామోజీ ఒక్కరే సాధించారు. అయితే.. దీంతో పాటు మరో రెండు కోరికలు కూడా.. ఉన్నాయి.
వాటిలో కీలకమైంది.. గత ఏడు సంవత్సరాలుగా అదే పనిలో ఉన్నది ఓం సిటీ. దీనిని రామోజీ పిలిం సిటీలోనే 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని సుప్రశిద్ధ ఆలయాల నమూనాలను ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కాశీ, రామేశ్వరం, తిరుమల, పూరిజగన్నాధుడు, అరలవిల్లి సూర్యనారాయణ దేవాలయం, శ్రీశైలం, అయోధ్య ఇలా.. అనేక ఆలయాలను ఒకే చోట నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణానికి ప్రత్యేక అనుమతులు కూడా తెచ్చుకున్నారు. ఇవి.. పూర్తి కావొస్తున్నాయి. కానీ.. ప్రారంభించే సమయంలో రామోజీ వెళ్లిపోయారు.
అదేవిధంగా ఈనాడు ప్రారంభించి మరో రెండు మాసాలకు 50 ఏళ్లు పూర్తవుతాయి. దీనిని పెద్ద పండుగలా నిర్ణయించుకున్నట్టు సమాచారం. కానీ, ఇంతలోనే ఆయన వెళ్లిపోయారు. ఈ రెండు కోరికలు కూడా.. రామోజీ తీర్చుకుని కనుల పండువగా వాటిని చూసి… చేసి.. మైమరిచి పోవాలని భావించారు. కానీ, సాకారం అయ్యేక్రమంలోనే ఆయన విశ్రమించారు.
This post was last modified on June 9, 2024 4:03 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…