ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో కలిసి వైసీపీని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చావుదెబ్బ కొట్టారు. జగన్కు దారుణమైన పరాభవాన్ని అందించారు. ఇప్పుడు జగన్ సొంత జిల్లా కడపలోనూ ఆయన్ని కట్టడి చేసేందుకు బాబు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది.
కడపలో టీడీపీ బలాన్ని పెంచేలా.. వైసీపీని మరింత దెబ్బకొట్టేలా బాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్. ఇందులో భాగంగానే కడప అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన రెడ్డెప్పగారి మాధవీరెడ్డికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరోసారి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో బాబు మంత్రివర్గం కూర్పుపై ఆసక్తి నెలకొంది.
బాబు మంత్రివర్గంలో మాధవీరెడ్డికి కచ్చితంగా పదవి లభిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. బలమైన రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి రావడం, అలాగే ఆమె భర్త శ్రీనివాస్రెడ్డి చాలా కాలం నుంచి టీడీపీకి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు.
బలమైన నేపథ్యం కారణంగా మాధవీరెడ్డి వైపు బాబు మొగ్గుచూపుతున్నారని తెలిసింది. కడపలో జగన్ను కట్టడి చేసేందుకు ఆమెకు మంత్రి పదవి ఇవ్వడమే సరైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కడపలో వైసీపీని చిత్తుచేసిన మాధవీరెడ్డికి టీడీపీలో ప్రత్యేక గౌరవం కలుగుతోంది.
దూకుడు స్వభావం కలిగిన ఆమెకు మంత్రి పదవి ఇస్తే కడపలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
This post was last modified on June 9, 2024 3:30 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…