ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో కలిసి వైసీపీని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చావుదెబ్బ కొట్టారు. జగన్కు దారుణమైన పరాభవాన్ని అందించారు. ఇప్పుడు జగన్ సొంత జిల్లా కడపలోనూ ఆయన్ని కట్టడి చేసేందుకు బాబు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది.
కడపలో టీడీపీ బలాన్ని పెంచేలా.. వైసీపీని మరింత దెబ్బకొట్టేలా బాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్. ఇందులో భాగంగానే కడప అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన రెడ్డెప్పగారి మాధవీరెడ్డికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరోసారి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో బాబు మంత్రివర్గం కూర్పుపై ఆసక్తి నెలకొంది.
బాబు మంత్రివర్గంలో మాధవీరెడ్డికి కచ్చితంగా పదవి లభిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. బలమైన రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి రావడం, అలాగే ఆమె భర్త శ్రీనివాస్రెడ్డి చాలా కాలం నుంచి టీడీపీకి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు.
బలమైన నేపథ్యం కారణంగా మాధవీరెడ్డి వైపు బాబు మొగ్గుచూపుతున్నారని తెలిసింది. కడపలో జగన్ను కట్టడి చేసేందుకు ఆమెకు మంత్రి పదవి ఇవ్వడమే సరైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కడపలో వైసీపీని చిత్తుచేసిన మాధవీరెడ్డికి టీడీపీలో ప్రత్యేక గౌరవం కలుగుతోంది.
దూకుడు స్వభావం కలిగిన ఆమెకు మంత్రి పదవి ఇస్తే కడపలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
This post was last modified on June 9, 2024 3:30 pm
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…