Political News

క‌డ‌ప‌లో చెక్ పెట్టేందుకు ఆమెకు మంత్రి ప‌ద‌వి!

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూట‌మితో క‌లిసి వైసీపీని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చావుదెబ్బ కొట్టారు. జ‌గ‌న్‌కు దారుణ‌మైన ప‌రాభవాన్ని అందించారు. ఇప్పుడు జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోనూ ఆయ‌న్ని క‌ట్ట‌డి చేసేందుకు బాబు మ‌రిన్ని వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్లు తెలిసింది.

క‌డ‌ప‌లో టీడీపీ బ‌లాన్ని పెంచేలా.. వైసీపీని మ‌రింత దెబ్బ‌కొట్టేలా బాబు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నార‌ని టాక్‌. ఇందులో భాగంగానే క‌డ‌ప అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన రెడ్డెప్ప‌గారి మాధ‌వీరెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌బోతున్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో బాబు మంత్రివ‌ర్గం కూర్పుపై ఆస‌క్తి నెల‌కొంది.

బాబు మంత్రివ‌ర్గంలో మాధ‌వీరెడ్డికి క‌చ్చితంగా ప‌ద‌వి ల‌భిస్తుంద‌నే అంచ‌నాలు నెల‌కొన్నాయి. బ‌ల‌మైన రాజ‌కీయ నేప‌థ్యమున్న కుటుంబం నుంచి రావ‌డం, అలాగే ఆమె భ‌ర్త శ్రీనివాస్‌రెడ్డి చాలా కాలం నుంచి టీడీపీకి ఆర్థికంగా అండ‌గా నిలుస్తున్నారు.

బ‌ల‌మైన నేప‌థ్యం కార‌ణంగా మాధ‌వీరెడ్డి వైపు బాబు మొగ్గుచూపుతున్నార‌ని తెలిసింది. క‌డ‌ప‌లో జ‌గ‌న్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఆమెకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డ‌మే స‌రైంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. క‌డ‌ప‌లో వైసీపీని చిత్తుచేసిన మాధ‌వీరెడ్డికి టీడీపీలో ప్ర‌త్యేక గౌర‌వం క‌లుగుతోంది.

దూకుడు స్వ‌భావం క‌లిగిన ఆమెకు మంత్రి ప‌ద‌వి ఇస్తే క‌డ‌ప‌లో టీడీపీ బ‌లోపేతానికి కృషి చేస్తార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కూడా ఇదే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది.

This post was last modified on June 9, 2024 3:30 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

1 hour ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

2 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

2 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

5 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago