కొడుకు, కూతురు మధ్య రాజకీయంలో నలిగిపోవడం కంటే దూరంగా ఉండటమే నయమనుకున్న వైఎస్ విజయమ్మ అమెరికా వెళ్లిపోయారు.
ఎన్నికలు అయేంతవరకూ ఇక్కడికి రాని విజయమ్మ తాజాగా జగన్ ఇంటికి వచ్చారని వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల్లో దారుణ పరాభవంతో ఢీలా పడ్డ జగన్ను ఓదర్చడంతో పాటు చెల్లి షర్మిలతో రాజీ చేసుకోమని చెప్పేందుకు విజయమ్మ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లతో పాతాళానికి పడిపోయిన వైసీపీ పుంజుకోవాలంటే చాలా కష్టం. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్ గురించి జగన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని తెలిసింది. తాడేపల్లిలోని జగన్ నివాసం కేంద్రంగా ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే టాక్ వినిపిస్తోంది. పార్టీ ఓటమికి కారణాలను జగన్ విశ్లేషిస్తున్నారని తెలిసింది.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో పాటు చెల్లి షర్మిల, సునీత కూడా జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వైసీపీ ఓటమి కోసం గట్టిగా పనిచేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేశారు.
ఎన్నికల ప్రచారానికి ముందు జగన్ను ఆశీర్వదించిన విజయమ్మ.. జగన్, షర్మిల మధ్య నలగలేక అమెరికా వెళ్లిపోయారనే అభిప్రాయాలు వినిపించాయి. అక్కడి నుంచి షర్మిలకు మద్దతుగా ఆమె ఓ వీడియో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ కడప ఎంపీగా షర్మిల ఓడిపోయారు. మరోవైపు జగన్ పార్టీ దారుణంగా పరాజయం పాలైంది.
ఈ నేపథ్యంలో జగన్ నివాసానికి వచ్చిన విజయమ్మ.. తన ఇద్దరు బిడ్డల మధ్య దూరం పెరగడంపై ఆవేదనతో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఈ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. కానీ జగన్ తిరిగి చెల్లిని ఆహ్వానిస్తారా? అన్నతో కలిసి షర్మిల పని చేస్తారా? అన్నవి ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నలే.
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…