36 ఏళ్ల అత్యంత చిన్న వయసులో నేడు మోడీ క్యాబినెట్ లో యువ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పై పోటీ చేసి 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచాడు. రామ్ మోహన్ నాయుడు మాజీ కేంద్రమంత్రి ఎర్రనాయుడు కుమారుడు.
తన కెరీర్ కోసం సింగపూర్ వెళ్లిన రామ్మోహన్ నాయుడు రాజకీయ జీవితం హఠాత్తుగా ప్రారంభమైంది. తండ్రి ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2014 లో శ్రీకాకుళం నుండి రామ్మెహన్ నాయుడు లోక్సభ ఎంపీగా మొదటి సారి గెలిచాడు. అప్పటికి రామ్మోహన్ వయస్సు కేవలం 26 సంవత్సరాలు. ఈ విజయంతో 16వ లోక్సభలో రెండో అతి పిన్న వయస్కుడైన ఎంపీగా తనదైన ముద్ర వేశారు. రామ్ మోహన్ చంద్రబాబు నాయుడుకు అత్యంత విధేయుడిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అరెస్టయ్యాక ఢిల్లీలో నారా లోకేష్తో పాటు రామ్మోహన్ కీలక పాత్ర పోషించారు. రామ్ మోహన్ను 2020 సంవత్సరంలో సంసద్ రత్న అవార్డుతో సత్కరించారు.
మొదటి నుంచి చదువులో నైపుణ్యం
రామ్ మోహన్ 1987 డిసెంబర్ 18న శ్రీకాకుళంలోని నిమ్మాడలో జన్మించారు. తండ్రి రాజకీయ నైపుణ్యాలను వారసత్వంగా పొందారని చెప్పవచ్చు. అతని ప్రారంభ విద్యాభ్యాసం ఆర్కే పురంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి, తరువాత అతను పర్డ్యూ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పట్టాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అతను లాంగ్ ఐలాండ్ నుండి ఎంబీఏ పట్టా తీసుకున్నాడు.
అతను 2017 సంవత్సరంలో శ్రీ శ్రావ్యను వివాహం చేసుకున్నాడు. 2021 సంవత్సరంలో అతను ఒక కుమార్తెకు తండ్రి అయ్యాడు. రామ్ మోహన్ ఈసారి అత్యంత పిన్న వయస్సుగల క్యాబినెట్ మంత్రి.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…