36 ఏళ్ల అత్యంత చిన్న వయసులో నేడు మోడీ క్యాబినెట్ లో యువ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పై పోటీ చేసి 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచాడు. రామ్ మోహన్ నాయుడు మాజీ కేంద్రమంత్రి ఎర్రనాయుడు కుమారుడు.
తన కెరీర్ కోసం సింగపూర్ వెళ్లిన రామ్మోహన్ నాయుడు రాజకీయ జీవితం హఠాత్తుగా ప్రారంభమైంది. తండ్రి ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2014 లో శ్రీకాకుళం నుండి రామ్మెహన్ నాయుడు లోక్సభ ఎంపీగా మొదటి సారి గెలిచాడు. అప్పటికి రామ్మోహన్ వయస్సు కేవలం 26 సంవత్సరాలు. ఈ విజయంతో 16వ లోక్సభలో రెండో అతి పిన్న వయస్కుడైన ఎంపీగా తనదైన ముద్ర వేశారు. రామ్ మోహన్ చంద్రబాబు నాయుడుకు అత్యంత విధేయుడిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అరెస్టయ్యాక ఢిల్లీలో నారా లోకేష్తో పాటు రామ్మోహన్ కీలక పాత్ర పోషించారు. రామ్ మోహన్ను 2020 సంవత్సరంలో సంసద్ రత్న అవార్డుతో సత్కరించారు.
మొదటి నుంచి చదువులో నైపుణ్యం
రామ్ మోహన్ 1987 డిసెంబర్ 18న శ్రీకాకుళంలోని నిమ్మాడలో జన్మించారు. తండ్రి రాజకీయ నైపుణ్యాలను వారసత్వంగా పొందారని చెప్పవచ్చు. అతని ప్రారంభ విద్యాభ్యాసం ఆర్కే పురంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి, తరువాత అతను పర్డ్యూ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పట్టాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అతను లాంగ్ ఐలాండ్ నుండి ఎంబీఏ పట్టా తీసుకున్నాడు.
అతను 2017 సంవత్సరంలో శ్రీ శ్రావ్యను వివాహం చేసుకున్నాడు. 2021 సంవత్సరంలో అతను ఒక కుమార్తెకు తండ్రి అయ్యాడు. రామ్ మోహన్ ఈసారి అత్యంత పిన్న వయస్సుగల క్యాబినెట్ మంత్రి.
This post was last modified on June 9, 2024 2:53 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…