Political News

@36 : నాడు ఎంపీ .. నేడు కేంద్ర మంత్రి !

36 ఏళ్ల అత్యంత చిన్న వయసులో నేడు మోడీ క్యాబినెట్ లో యువ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ పై పోటీ చేసి 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచాడు. రామ్ మోహన్ నాయుడు మాజీ కేంద్రమంత్రి ఎర్రనాయుడు కుమారుడు.

తన కెరీర్ కోసం సింగపూర్ వెళ్లిన రామ్మోహన్ నాయుడు రాజకీయ జీవితం హఠాత్తుగా ప్రారంభమైంది. తండ్రి ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2014 లో శ్రీకాకుళం నుండి రామ్మెహన్ నాయుడు లోక్‌సభ ఎంపీగా మొదటి సారి గెలిచాడు. అప్పటికి రామ్మోహన్ వయస్సు కేవలం 26 సంవత్సరాలు. ఈ విజయంతో 16వ లోక్‌సభలో రెండో అతి పిన్న వయస్కుడైన ఎంపీగా తనదైన ముద్ర వేశారు. రామ్ మోహన్ చంద్రబాబు నాయుడుకు అత్యంత విధేయుడిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అరెస్టయ్యాక ఢిల్లీలో నారా లోకేష్‌తో పాటు రామ్మోహన్ కీలక పాత్ర పోషించారు. రామ్ మోహన్‌ను 2020 సంవత్సరంలో సంసద్ రత్న అవార్డుతో సత్కరించారు.

మొదటి నుంచి చదువులో నైపుణ్యం

రామ్ మోహన్ 1987 డిసెంబర్ 18న శ్రీకాకుళంలోని నిమ్మాడలో జన్మించారు. తండ్రి రాజకీయ నైపుణ్యాలను వారసత్వంగా పొందారని చెప్పవచ్చు. అతని ప్రారంభ విద్యాభ్యాసం ఆర్కే పురంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి, తరువాత అతను పర్డ్యూ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పట్టాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో అతను లాంగ్ ఐలాండ్ నుండి ఎంబీఏ పట్టా తీసుకున్నాడు.

అతను 2017 సంవత్సరంలో శ్రీ శ్రావ్యను వివాహం చేసుకున్నాడు. 2021 సంవత్సరంలో అతను ఒక కుమార్తెకు తండ్రి అయ్యాడు. రామ్ మోహన్ ఈసారి అత్యంత పిన్న వయస్సుగల క్యాబినెట్ మంత్రి.

This post was last modified on June 9, 2024 2:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

25 minutes ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

1 hour ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

1 hour ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

3 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

4 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

5 hours ago