Political News

ఆఖరి నిముషం లో ఏపీ BJP MP కి మంత్రి పదవి

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘మోదీ 3.0’ ప్రభుత్వం ఈ రోజు కొలువుదీరనుంది. ఈ రోజు రాత్రి 7.15 గంటలకు భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఆ వెంటనే బీజేపీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన 30 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే, ఈ రోజు మోడీతోపాటు కేంద్ర మంత్రులుగా ఎవరెవరు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నది తేలాల్సి ఉంది. పూర్తి స్థాయి మోడీ కేబినెట్ లో 78 నుంచి 81 మంది మంత్రులు ఉండే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇక, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తున్న పార్టీలలో కీలకంగా మారిన టీడీపీ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్‌ నాయుడుకు కేబినెట్‌ మంత్రి పదవి దక్కగా, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కనుంది.

బీజేపీ నర్సాపురం ఎంపీ శ్రీనివాసవర్మ కు కూడా కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఈ ముగ్గురూ ప్రధానితో ఈ రోజే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే రామ్మోహన్‌నాయుడుకి, పెమ్మసానికి ఫోన్‌ చేసి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు చోటు దక్కింది. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు పిలుపు అందింది. పీఎంవో నుంచి పిలుపు రావడంతో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ మోదీ నివాసానికి వెళ్లారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకొని మంచి ఫలితాలు సాధించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధించారు.

This post was last modified on June 9, 2024 2:15 pm

Share
Show comments
Published by
Satya
Tags: AP BJP MP

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

29 minutes ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

1 hour ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

1 hour ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

3 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

4 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

5 hours ago