ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వైసీపీ కార్యాలయాలు.. నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. దీనికి గతంలో వైసీపీ నాయకులు రెచ్చగొట్టేలా ప్రసంగించారని కొం దరు చెబుతున్నా.. ఇది సరికాదనే వాదన మరోవైపు వినిపిస్తోంది. ఇక, గత రెండు రోజుల నుంచి పలు జిల్లాల్లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను దుండగులు ధ్వంసంచేస్తున్నారు. యూనివర్సిటీలు.. విద్యా లయాలు, పలుప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాలను పగుల గొడుతున్నారు.
దీంతో రాష్ట్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాలపై ఇప్పటికే మాజీ సీఎం జగన్..గవర్నర్కు లేఖ రాశారు. అదేవిధంగా వరుసగా ట్వీట్లు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంద న్నారు. అంతేకాదు.. శాంతి భద్రతలు కట్టుతప్పాయని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా గా అమరావతికి వచ్చిన.. కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్ విగ్రహాల ధ్వంసాన్ని తప్పుబట్టారు.
గెలుపు ఓటములను మహానేతలకు ఎలా అంటగడతారని ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఈ విధానం సరికాదని పేర్కొన్నారు. వైఎస్ విగ్రహాలను కూల్చేసిన వారిని గుర్తించి.. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇదిలావుంటే.. మాజీ సీఎం ఏం చేస్తున్నారు? అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ విగ్రహాలు కూల్చేస్తుంటే.. ఇంట్లో కూర్చుని ట్వీట్లు పెడుతున్నారా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ సీఎం ఇంతకన్నా ఏమీచేయడం చేతకాదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చర్యలు తీసుకునేలా రోడ్డు మీదకి రావాలని ఆమె సూచించారు.
This post was last modified on June 9, 2024 2:09 pm
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…