ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వైసీపీ కార్యాలయాలు.. నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. దీనికి గతంలో వైసీపీ నాయకులు రెచ్చగొట్టేలా ప్రసంగించారని కొం దరు చెబుతున్నా.. ఇది సరికాదనే వాదన మరోవైపు వినిపిస్తోంది. ఇక, గత రెండు రోజుల నుంచి పలు జిల్లాల్లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను దుండగులు ధ్వంసంచేస్తున్నారు. యూనివర్సిటీలు.. విద్యా లయాలు, పలుప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాలను పగుల గొడుతున్నారు.
దీంతో రాష్ట్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాలపై ఇప్పటికే మాజీ సీఎం జగన్..గవర్నర్కు లేఖ రాశారు. అదేవిధంగా వరుసగా ట్వీట్లు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంద న్నారు. అంతేకాదు.. శాంతి భద్రతలు కట్టుతప్పాయని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా గా అమరావతికి వచ్చిన.. కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్ విగ్రహాల ధ్వంసాన్ని తప్పుబట్టారు.
గెలుపు ఓటములను మహానేతలకు ఎలా అంటగడతారని ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఈ విధానం సరికాదని పేర్కొన్నారు. వైఎస్ విగ్రహాలను కూల్చేసిన వారిని గుర్తించి.. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇదిలావుంటే.. మాజీ సీఎం ఏం చేస్తున్నారు? అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ విగ్రహాలు కూల్చేస్తుంటే.. ఇంట్లో కూర్చుని ట్వీట్లు పెడుతున్నారా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ సీఎం ఇంతకన్నా ఏమీచేయడం చేతకాదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చర్యలు తీసుకునేలా రోడ్డు మీదకి రావాలని ఆమె సూచించారు.
This post was last modified on June 9, 2024 2:09 pm
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…