Political News

జగన్ నుండి తప్పించుకుని తిరుగుతున్నారు

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వంతో కుంగుతిన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు వ‌రుస‌గా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ ఓట‌మి నుంచి ఇంకా భ‌య‌ట‌ప‌డ‌ని, దారుణ అవ‌మానాన్ని ఇంకా జీర్ణించుకోలేని జ‌గ‌న్‌కు వైసీపీ నేత‌లు టెన్ష‌న్ పెడుతున్నారు.

ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో పాతాళానికి ప‌డిపోయిన పార్టీలో ఉండ‌లేక గుడ్‌బై చెబుతున్నారు. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఎన్నిక‌ల్లో సీటు ద‌క్క‌ని నేత‌లు కూడా జ‌గ‌న్‌కు గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నార‌ని తెలిసింది.

మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు వైసీపీకి గుడ్‌బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. ద‌ళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్య‌మ‌వుతోంద‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. తిరిగి టీడీపీలో చేరేందుకు ప్ర‌య‌త్నించే అవ‌కాశాలున్నాయి. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌త్తిపాడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా కిశోర్‌బాబు గెలిచారు.

బాబు ప్ర‌భుత్వంలో మంత్రిగానూ ప‌నిచేశారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి జ‌న‌సేన‌లోకి మారి పోటీ చేసి ఓడిపోయారు. అనంత‌రం బీఆర్ఎస్‌లో చేరి ఏపీలో కొన్ని రోజుల పాటు ఆ పార్టీ వ్య‌వ‌హారాలను చూశారు. కానీ 2024 ఎన్నిక‌లకు ముందు వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ దారుణ ప‌రాభ‌వంతో గుడ్‌బై చెప్పేశారు.

మ‌రోవైపు ఉమ్మ‌డి వైఎస్సార్ జిల్లాకు చెంద‌ని వైసీపీ కీల‌క నాయ‌కుడు, తాజా మాజీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున్‌రెడ్డి కూడా పార్టీ వీడేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని తెలిసింది. రాజంపేట సిటింగ్ ఎమ్మెల్యే అయిన మ‌ల్లిఖార్జున్‌రెడ్డికి ఈ సారి జ‌గ‌న్ టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో మ‌న‌స్థాపం చెందిన ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైసీపీకి దూరంగా ఉన్నారు.

ఇప్పుడు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి గెలుపుతో మ‌ల్లిఖార్జున్‌రెడ్డికి హుషారు వ‌చ్చింది. తాజాగా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అభినంద‌న‌లు తెలుపుతూ ఆయ‌న రెండు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. దీంతో మ‌ల్లిఖార్జున్ రెడ్డి తిరిగి టీడీపీ గూటికే చేర‌బోతున్నార‌ని టాక్‌. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పునే ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరారు.

This post was last modified on June 8, 2024 5:31 pm

Share

Recent Posts

ఎఫెక్ట్ పడింది… ఐఫోన్ 18 ప్రో ధర పెరిగింది

ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో…

27 seconds ago

బేబీ జంటకు ‘ఎపిక్’ ఎగ్జామ్

రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…

10 minutes ago

అంత గొప్ప పాట‌ను దేవి 8 ఏళ్ల‌కే…

కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడ‌క‌పోయినా.. కొన్ని పాట‌లు, స‌న్నివేశాలు క‌ల్ట్ స్టేట‌స్ తెచ్చుకుంటాయి. వ‌ర్షం…

28 minutes ago

న‌మ్మ‌కం లేన‌ప్పుడు.. బాబు చేసిన‌ట్టు చేయొచ్చుగా జ‌గ‌న్‌!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ త‌ర‌చుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల నిర్వహ‌ణ…

2 hours ago

కసబ్ కు వాళ్లకు తేడా లేదు

స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…

3 hours ago

అది నిజ‌మైతే.. వైసీపీ ఖాళీ అవుతుందా?

వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాట‌లు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్న‌ట్టుగానే పార్టీ అధినేత జ‌గ‌న్…

7 hours ago