Political News

జగన్ నుండి తప్పించుకుని తిరుగుతున్నారు

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వంతో కుంగుతిన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు వ‌రుస‌గా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ ఓట‌మి నుంచి ఇంకా భ‌య‌ట‌ప‌డ‌ని, దారుణ అవ‌మానాన్ని ఇంకా జీర్ణించుకోలేని జ‌గ‌న్‌కు వైసీపీ నేత‌లు టెన్ష‌న్ పెడుతున్నారు.

ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో పాతాళానికి ప‌డిపోయిన పార్టీలో ఉండ‌లేక గుడ్‌బై చెబుతున్నారు. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఎన్నిక‌ల్లో సీటు ద‌క్క‌ని నేత‌లు కూడా జ‌గ‌న్‌కు గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నార‌ని తెలిసింది.

మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు వైసీపీకి గుడ్‌బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. ద‌ళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్య‌మ‌వుతోంద‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. తిరిగి టీడీపీలో చేరేందుకు ప్ర‌య‌త్నించే అవ‌కాశాలున్నాయి. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌త్తిపాడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా కిశోర్‌బాబు గెలిచారు.

బాబు ప్ర‌భుత్వంలో మంత్రిగానూ ప‌నిచేశారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి జ‌న‌సేన‌లోకి మారి పోటీ చేసి ఓడిపోయారు. అనంత‌రం బీఆర్ఎస్‌లో చేరి ఏపీలో కొన్ని రోజుల పాటు ఆ పార్టీ వ్య‌వ‌హారాలను చూశారు. కానీ 2024 ఎన్నిక‌లకు ముందు వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ దారుణ ప‌రాభ‌వంతో గుడ్‌బై చెప్పేశారు.

మ‌రోవైపు ఉమ్మ‌డి వైఎస్సార్ జిల్లాకు చెంద‌ని వైసీపీ కీల‌క నాయ‌కుడు, తాజా మాజీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున్‌రెడ్డి కూడా పార్టీ వీడేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని తెలిసింది. రాజంపేట సిటింగ్ ఎమ్మెల్యే అయిన మ‌ల్లిఖార్జున్‌రెడ్డికి ఈ సారి జ‌గ‌న్ టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో మ‌న‌స్థాపం చెందిన ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైసీపీకి దూరంగా ఉన్నారు.

ఇప్పుడు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి గెలుపుతో మ‌ల్లిఖార్జున్‌రెడ్డికి హుషారు వ‌చ్చింది. తాజాగా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అభినంద‌న‌లు తెలుపుతూ ఆయ‌న రెండు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. దీంతో మ‌ల్లిఖార్జున్ రెడ్డి తిరిగి టీడీపీ గూటికే చేర‌బోతున్నార‌ని టాక్‌. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పునే ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరారు.

This post was last modified on June 8, 2024 5:31 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

పదిహేనేళ్ల దీదీ కంచు కోట ఎలా బద్దలైంది?

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…

3 hours ago

మూడో స్పీడ్ బ్రేకర్ ఏం చెబుతోంది

గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…

4 hours ago

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

5 hours ago

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

7 hours ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

7 hours ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

8 hours ago