తెలుగు ప్రజలకు షాకింగ్ వార్తగా చెప్పాలి. మీడియా మొఘల్ ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు ఆస్తమించారు. సుదీర్ఘకాలంగా మీడియారంగాన్ని శాసించిన ఆయన ఇక లేరు. ఈనాడు దినపత్రికతో తెలుగు వార్తా ప్రపంచంలో సంచలనాల్ని నమోదు చేసిన ఆయన.. ఈటీవీ చానళ్లతో పాటు.. డిజిటల్ ప్రపంచంలోనూ ఆయన తనదైన మార్కు వేశారు. తెలుగు రాజకీయాల్లో ఆయన తనదైన మార్క్ ను వేశారు.
ఇటీవల గుండెకు స్టంట్ వేసిన అనంతరం.. ఈ నెల ఐదో తేదీన ఆయన అస్వస్థతకు గురయ్యారు. గచ్చిబౌలిలోని నానక్ రాం గూడలోని స్టార్ ఆసుపత్రిలో ఆయన్ను చేర్చారు. శ్వాస తీసుకోవటంలో ఆయన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదిలా ఉండగా.. శుక్రవారం మధ్యామ్నం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వెంటిలేటర్ మీద పెట్టి వైద్యం చేసినా ఫలితం లేకపోయింది.
ఆయన కోలుకున్నట్లుగా కనిపిస్తూనే.. ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున (4.50 గంటలకు) తుదిశ్వాస విడిచారు. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లో రామోజీ శకం పూర్తైందని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానీకానికి ఆయన మీడియా సంస్థతో అంతో ఇంతో అనుబంధం ఉండటం ఆయనకు మాత్రమే చెల్లుతుంది. మొండివాడిగా.. తాను అనుకున్నది అనుకున్నట్లు చేయటం కోసం ఎంతకైనా అన్నట్లు వ్యవహరించే ఆయన రామోజీ ఇక లేరు. 88 ఏళ్ల వయసులో ఆయన కొంతకాలంగా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…