Political News

‘బీపీ వ‌చ్చి..’ వంశీ, కొడాలి ఇళ్ల‌పై దాడులు.. క‌సి తీర్చుకుంటున్నారా?

తాజా ఎన్నిక‌ల్లో త‌మ గెలుపు ఖాయ‌మ‌ని చెప్పిన ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్ద‌రు వైసీపీ నాయ‌కులు ఘోరంగా ఓడిపో యారు. వారే గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని. వీరిద్ద‌రిపైనా టీడీపీ శ్రేణుల‌కు పీక‌ల వ‌ర‌కు ఆగ్ర‌హం ఉంది. ఎందుకంటే.. రాజ‌కీయంగా కంటే కూడా.. చంద్ర‌బాబు కుటుంబాన్ని ఘోరంగా అవ‌మానించార‌ని శ్రేణులు ఆవేద‌నలో ఉన్నాయి. నిండు అసెంబ్లీలోనే.. వంశీ.. చంద్ర‌బాబు స‌తీమ‌ణిపై కామెంట్లు చేశార‌ని.. వీటిని నాని స‌మ‌ర్ధిం చార‌ని కూడా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

పైగా.. ఎక్క‌డిక‌క్క‌డ ఎప్ప‌టిక‌ప్ప‌డు.. టీడీపీని కూడా వీరు టార్గెట్ చేయ‌డం.. నారా లోకేష్, చంద్ర‌బాబుపై ప‌రుష ప‌దజాల‌తో విరుచుకుప‌డిన ఘ‌ట‌నలు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా టీడీపీ కూట‌మి అధికారంలోకి రావ‌డంతో ఆ పార్టీ శ్రేణులు.. వంశీ, కొడాలి ఇళ్ల‌పైకి దూసుకువెళ్లారు. రాళ్లు, కోడిగుడ్ల‌తో దాడులు చేశారు. దీంతో కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచే సుకుంది. టీడీపీ శ్రేణులు మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి పై దాడికి యత్నించారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ క్ర‌మంలో కొంద‌రు టీడీపీ యువ‌త కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు రువ్వారు, కోడి గుడ్లు విసిరేశారు. నాని ఇంటి లోపలకి చొరబడే ప్రయత్నం చేశారు. అయితే.. వీరిని పోలీసులు అడ్డుకుని అక్క‌డ నుంచి పంపించే ప్ర‌య‌త్నం చేశారు. వారు వెళ్తూ వెళ్తూ.. నాని ఇంటి ముందు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక‌, విజ‌య‌వాడ బెంజ్ స‌ర్కిల్ స‌మీపంలోని వ‌ల్ల‌భ‌నేని వంశీ అపార్ట్‌మెంటు వ‌ద్ద కూడా టీడీపీ యువ‌త పెద్ద ఎత్తున దాడులు చేశారు. రాళ్లు రువ్వారు. కోడిగుడ్లు విసిరారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు అక్క‌డ మోహ‌రించి వారిని అదుపు చేసే ప్ర‌య‌త్నం చేశారు.

మ‌రో వైపు గ‌న్న‌వ‌రంలోనూ వంశీ ఇంటి పైకి యువ‌త రాళ్లు, కోడిగుడ్లు రువ్వారు. మ‌రికొంద‌రు పేడ క‌లిపిన నీటిని జ‌ల్లారు. మొత్తంగా ఎన్నిక‌ల‌కు ముందు.. చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేస్తూ.. వారు కొంత హ‌డావుడి సృష్టించారు. అయితే.. ఆయా ఘ‌ట‌న‌లు జ‌రిగిన స‌మ‌యంలో నాని, వంశీలు.. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో ఉన్నార‌ని స‌మాచారం. కానీ, వారు ఈ ఘ‌ట‌న‌ల‌పై స్పందించ‌లేదు. కాగా.. గ‌తంలో చంద్ర‌బాబు ఇంటిపైనా.. టీడీపీ కార్యాల‌యంపైనా.. ఆ పార్టీ నేత‌ల‌పైనా వైసీపీ నాయ‌కులు దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో వారిని క‌ట్ట‌డి చేయాల్సి అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌.. ‘బీపీ వ‌చ్చి దాడులు చేశారు’ అని వ్యాఖ్యానించారు. మ‌రి ఇప్పుడు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు కూడా.. బీపీ వ‌చ్చి దాడులు చేశార‌ని అనుకోవాలా?! అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

35 minutes ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

3 hours ago

రాజాసాబ్‌ ఫలితంతో నాకు స‌బంధం లేదు – ఎస్కేఎన్

ప్ర‌భాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌ట‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ సినిమా…

3 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

5 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

5 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

6 hours ago