మీడియా మొఘల్ చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనాడు సంస్థల అధినేతగా సుపరిచితమైన ఆయన గడిచిన కొంతకాలంగా ఆయన అనారోగ్యంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఒక ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల గుండె సంబంధిత సమస్య కారణంగా స్టంట్ వేశారు. అనంతరం ఆయన కొద్దిగా కోలుకున్నట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ రోజు సాయంత్రం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా మారింది. దీంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు.
వయసు పెద్దది కావటంతో ఆయనకు చేస్తున్న చికిత్సకు బాడీ సహకరించటం కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. తాజా బులిటెన్ కోసం రామోజీ కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తున్నారు. ఈ విషయం బయటకు రావటంతో రామోజీరావును అమితంగా అభిమానించే కోట్లాది మంది ఆయనకు స్వస్థత చేకూరాలని.. వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన తాజా ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు.
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…
అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…
ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…
యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…