వెంటిలేటర్ మీద మీడియా మొఘల్ రామోజీరావు?

మీడియా మొఘల్ చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనాడు సంస్థల అధినేతగా సుపరిచితమైన ఆయన గడిచిన కొంతకాలంగా ఆయన అనారోగ్యంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఒక ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల గుండె సంబంధిత సమస్య కారణంగా స్టంట్ వేశారు. అనంతరం ఆయన కొద్దిగా కోలుకున్నట్లుగా సమాచారం.

ఇదిలా ఉంటే.. ఈ రోజు సాయంత్రం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా మారింది. దీంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు.

వయసు పెద్దది కావటంతో ఆయనకు చేస్తున్న చికిత్సకు బాడీ సహకరించటం కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. తాజా బులిటెన్ కోసం రామోజీ కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తున్నారు. ఈ విషయం బయటకు రావటంతో రామోజీరావును అమితంగా అభిమానించే కోట్లాది మంది ఆయనకు స్వస్థత చేకూరాలని.. వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన తాజా ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నో ట్విస్టులతో… డ్రీమ్ లవ్ స్టోరీకి బ్రేకప్

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…

1 hour ago

లేటు వయసులో అదరగొడుతున్న అక్షయ్

మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…

2 hours ago

కోహ్లీ 100 సెంచరీలు: సచిన్ రికార్డు సాధ్యమేనా?

సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…

3 hours ago

మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?

పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…

4 hours ago

కొత్త ప్రభాస్‌… వంగ టచ్ కనిపిస్తోంది

‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…

4 hours ago

అమెరికాలో లోకేష్ ను ఆపిన పోలీసులు…

తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…

4 hours ago