ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మోడీ 400 సీట్లు తమకు రాబట్టుకుంటామని చెప్పుకొచ్చారు. కానీ, ఆ మేరకు ఆయన రాబట్టుకోలేకపోయారు. అంతేకాదు. గత 2019 ఎన్నికల్లో బీజేపీకి ఒక్క పార్టీకే. 303 సీట్లు వచ్చాయి. మిత్రపక్షాలతో కలిసి.. ఇది 400 దాటి పోయింది. దీంతో ఇప్పుడు కూడా. తమకు సీట్లు వస్తాయని అనుకున్నారు. కానీ, ఆమేరకు రాలేదు . సరికదా.. అసలు బీజేపీకి 240 దగ్గరకే ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టారు. దీంతో బీజేపీ నేతలు , కేంద్ర మంత్రులు చాలా మంది ఓడిపోయారు.
ఈ పరిణామాలు ఒకరకంగా.. మోడీని, బీజేపీ నేతలను కూడా అంతర్మథనంలో పడేసేవే. అయితే.. ఆ మేరకు.. ఎక్కడా వారిలో ఈ చీకు, చింత కనిపిస్తున్నట్టు లేదు. పైగా.. మోడీ మరోసారి ఎదురు దాడి చేయ డం.. అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇంకా ప్రధానిగా ఆయన మూడోసారి పగ్గాలు చేపట్టక ముందే.. కీలక వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ, చాలా త్వరగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. ఆ రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు బీజేపీని ఆదరించారు” అని చెప్పుకొచ్చారు.
నిజానికి బీజేపీకి పెరిగింది… తెలంగాణలో ఓట్లు, సీట్లు మాత్రమే. కర్ణాటకలో మాత్రం ఆ పార్టీ సీట్లు , ఓట్లు కూడా.. కోల్పోయింది. ఈ విషయం దాచేసి.. కాంగ్రెస్పై నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేయడం గమనార్హం. అంతేకాదు… ఎన్టీయే 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని మోడీ చెప్పారు. కానీ, వీటిలో 7 రాష్ట్రాల్లో.. ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రభుత్వాలను దించేసి.. మధ్యంతరంగా బీజేపీ ఇతర పార్టీలతో జత కట్టి.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన విషయాన్ని మోడీ దాచేసి.. వాటిని తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇక, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాల్లోని 7 చోట్ల కూడా తామే అధికారంలో ఉన్నామన్నారు. కానీ, ఇక్కడ కూడా.. ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇతర పక్షాలను ఏకం చేసి.. ప్రజలు ఇచ్చిన తీర్పు పక్కన పెట్టి.. అధికారంలోకి వచ్చారు. అయితే.. ఇప్పుడు కీలక సమయంలో మరోసారి మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై.. విమర్శలు వస్తున్నాయి. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయడం.. మేనిఫెస్టోలను అమలు చేయడం .. మిగిలి ఉన్నాయని చెబుతున్నారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…