తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం.. కనీ వినీ ఎరుగని ఓటమిని మూటగట్టుకున్న వైసీపీకి షాకులు ప్రారంభమయ్యాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఇంకా కొలువు తీరకుండానే.. అవినీతి.. అక్రమాలు.. తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై శోధన ప్రారంభమైంది. ప్రజల్లో వేడి తగ్గక ముందే.. వైసీపీని మరింత దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పుడు కనుక వైసీపీపై ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు.
దీంతో కూటమి సర్కారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే.. మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం.. ఫైబర్ గ్రిడ్ వంటి కీలక నిర్ణయాలపై.. విచారణకు కూటమి రెడీ అయింది. ఇది వైసీపీకి భారీ షాకిచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. ఎన్నికల్లో పార్టీఓటమి దెబ్బతో ఇక, వైసీపీలో ఉన్నా ప్రయోజనం లేదని భావించిన నాయకులు పార్టీకి దూరమవుతున్నాయి. వీరిలో పదుల సంఖ్యలో నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు.
ఆయన టీడీపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే.. ఆయనను పార్టీ లోకి తీసుకుంటారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. ఇక, సీమకు చెందిన రెడ్డి నాయకులు కూడా.. పార్టీకి దూరమవుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారు కూడా.. తమ ప్రయత్నలు తాము చేసుకుంటున్నారు.
వైసీపీలో ఉంటే.. ఇబ్బందులు తప్పవని గుర్తించిన వారు ఎవరికి వారు.. పార్టీ నుంచి బయటకు వస్తున్నాయి. శుక్రవారం నుంచి మొదలు పెట్టి.. కూటమి ప్రమాణ స్వీకారం చేసే నాటికి.. మెజారిటీ నాయకులు బయటకు వచ్చేస్తారని తెలుస్తోంది. ఇదే జరిగితే.. వైసీపీకి మరింత ఇబ్బందులు పెరగడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 7, 2024 3:25 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…