తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం.. కనీ వినీ ఎరుగని ఓటమిని మూటగట్టుకున్న వైసీపీకి షాకులు ప్రారంభమయ్యాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఇంకా కొలువు తీరకుండానే.. అవినీతి.. అక్రమాలు.. తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై శోధన ప్రారంభమైంది. ప్రజల్లో వేడి తగ్గక ముందే.. వైసీపీని మరింత దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పుడు కనుక వైసీపీపై ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు.
దీంతో కూటమి సర్కారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే.. మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం.. ఫైబర్ గ్రిడ్ వంటి కీలక నిర్ణయాలపై.. విచారణకు కూటమి రెడీ అయింది. ఇది వైసీపీకి భారీ షాకిచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. ఎన్నికల్లో పార్టీఓటమి దెబ్బతో ఇక, వైసీపీలో ఉన్నా ప్రయోజనం లేదని భావించిన నాయకులు పార్టీకి దూరమవుతున్నాయి. వీరిలో పదుల సంఖ్యలో నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు.
ఆయన టీడీపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే.. ఆయనను పార్టీ లోకి తీసుకుంటారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. ఇక, సీమకు చెందిన రెడ్డి నాయకులు కూడా.. పార్టీకి దూరమవుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారు కూడా.. తమ ప్రయత్నలు తాము చేసుకుంటున్నారు.
వైసీపీలో ఉంటే.. ఇబ్బందులు తప్పవని గుర్తించిన వారు ఎవరికి వారు.. పార్టీ నుంచి బయటకు వస్తున్నాయి. శుక్రవారం నుంచి మొదలు పెట్టి.. కూటమి ప్రమాణ స్వీకారం చేసే నాటికి.. మెజారిటీ నాయకులు బయటకు వచ్చేస్తారని తెలుస్తోంది. ఇదే జరిగితే.. వైసీపీకి మరింత ఇబ్బందులు పెరగడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…