కూటమి అధికారంలోకి రావడంతోనే కూటమి నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకుండానే..సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజాయితీకి నిలువెత్తు పీట వేశారు. రాష్ట్ర సర్కారుకు కళ్లు, చెవులు అనదగిన కీలక పోస్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఈ పోస్టులో నిజాయితీ అధి కారిగా పేరు తెచ్చుకున్న బిహార్కు చెందిన నీరబ్కుమార్ ప్రసాద్ను అప్పాయింట్ చేశారు. గురువారం సాయంత్రమే అప్పటి వరకు ఉన్న సీఎస్.. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు.
ఆయనను సెలవుపై వెళ్లాల్సిందిగా.. చంద్రబాబు సూచించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు. ఈ నెల 30న జవహర్రెడ్డి రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారి, తన 30 సంవత్సరాల సర్వీసులో అవినీతి ఆరోపణలు సహా ఎలాంటి మరకలు లేని.. నీరబ్ కుమార్ ప్రసాద్ను చంద్రబాబు ఎంచుకున్నారు. దీంతో సిఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉదయం 12 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు, విజయవాడ దుర్గమ్మ ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సిఎస్ గా నీరబ్కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈకార్యక్రమంలో జిఏడి కార్యదర్శి సురేశ్ కుమార్, స్పెషల్ సిఎస్ గోపాల కృష్ణ ద్వివేది,పిసిసిఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి,ఐటి కార్యదర్శి కె.శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, కార్యదర్శి శ్రీధర్ తదితర శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇదిలావుంటే.. చంద్రబాబు నిర్ణయంపై అన్ని పార్టీల నాయకులు.. అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీరబ్ వంటి ఉత్తమ అధికారికి మంచి స్థానం ఇవ్వడంతోపాటు.. పగ్గాలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on June 7, 2024 3:15 pm
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…