అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఓడలు బడ్లవడం.. బడ్లు ఓడలవడం రాజకీయాల్లో కామనే. ఎంతటి మహామహులకైనా ప్రజల చేతుల్లో ఓటమి తప్పలేదు. అధికారంలో ఉన్నామని విర్రవీగితే పాతాళానికి పడిపోవడం ఖాయం. ఇక అధికారంలోని ప్రభుత్వం అండ చూసుకుని రెచ్చిపోయే అధికారులు కూడా కాలం ఒకేలా ఉండదు అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏపీలోని ఇలాంటి కొంతమంది అధికారులు ఇప్పుడు వణికిపోతున్నారని తెలిసింది.
జగన్ అండతో, ఆదేశాలతో పోలీసులు, అధికారులు రెచ్చిపోయారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అన్యాయంగా అరెస్టు చేశారనే అభిప్రాయాలున్నాయి. అంతే కాకుండా జగన్ను చూసుకుని అధికార పార్టీ నేతలకు కొమ్ము కాశారనే విమర్శలున్నాయి. ఇప్పుడు ఇలాంటి అధికారులందరూ హడలెత్తిపోతున్నారు. కారణం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్లోని చేతిలోని రెడ్బుక్. జగన్ అండతో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ, జనాలను అన్యాయంగా వేధిస్తున్న వాళ్ల పేర్లను రెడ్బుక్లో రాసుకుంటున్నానని లోకేశ్ గతంలో చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
లోకేశ్ పేర్లు రాసుకుంటే ఏముంది? అసలు టీడీపీ అధికారంలోకి రావాలి కదా? అని ఆ అధికారులు మరింత బరితెగించారు. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయంతో ఈ అధికారుల కాళ్ల కింద భూమి కంపించిందనే టాక్ వినిపిస్తోంది. ఎక్కడ తమపైన చర్యలు తీసుకుంటారో అని ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ను ప్రసన్నం చేసుకోవడానికి ఈ అధికారులు క్యూ కడుతున్నట్లు తెలిసింది. జగన్ ఒత్తిడితోనే అలా వ్యవహరించామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్. కానీ బాబు మాత్రం వీళ్లను అసలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చెప్పిన మాట ప్రకారం ఈ అధికారులపై చర్యలు తీసుకునేందుకు లోకేశ్ సిద్ధమవుతున్నారని తెలిసింది.
This post was last modified on June 7, 2024 3:26 pm
‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే…
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…