కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాం.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతాం.. ఇవీ ఒకప్పుడు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. కానీ కట్ చేస్తే ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన షాక్ తగిలింది. ఇప్పుడేమో లోక్సభ ఎన్నికల్లో సున్నాతో ఘోర పరాభవం మిగిలింది. ఆ పార్టీని జనాలు పట్టించుకోవడం మానేశారనేందుకు ఇదే నిదర్శనం. దీంతో బీఆర్ఎస్లో ఇంకేముంది? పార్టీ మారితేనే తమ రాజకీయ కెరీర్ నిలబడుతుందని ఎమ్మెల్యేలు అనుకుంటున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక లోక్సభ ఎన్నికల్లో అయితే 17 స్థానాల్లో పోటీ చేసినా సున్నాకే పరిమితమైంది. ఇదే సమయంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తెలంగాణలో పుంజుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన కాంగ్రెస్.. తాజాగా లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ విజయం సాధించింది. బీజేపీ కూడా 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఓ వైపు వరుస పరాభవాలు, మరోవైపు వివిధ కేసుల్లో అగ్రనేతల పేర్లు.. ఇలా బీఆర్ఎస్ పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయింది.
ఓ వైపు కేసీఆర్.. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు జాకీ పెట్టి లేపిన ఇప్పట్లో పార్టీ పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వెళ్లిపోయారు. ఇప్పుడు మరో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్లు తెలిసింది. ఇన్ని రోజులూ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన రేవంత్ ఇప్పుడు చేరికలపై దృష్టి సారించే అవకాశం ఉంది. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుదిరితే కాంగ్రెస్ లేదంటే బీజేపీలోకి వెళ్లేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లాన్ చేసుకుంటున్నారని టాక్.
This post was last modified on June 7, 2024 1:43 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…