ఉత్తరాదిన ఎదురుగాలి వీచినా దక్షిణాదిన ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా ఎనిమిది ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ లో గొడెం నగేష్, కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్, మల్కాజ్ గిరిలో ఈటెల రాజేందర్, మెదక్ లో రఘునందన్ రావు, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ లో డీకె అరుణలు విజయం సాధించారు.
గత ఎన్నికల్లో నలుగురు విజయం సాధించినా కేంద్ర మంత్రి వర్గంలో ఒక్క కిషన్ రెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది. బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష్య పదవి నుండి తప్పించినప్పుడు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారన్న వార్తలు వినిపించాయి. కానీ జాతీయపార్టీలో పదవి ఇచ్చి సరిపుచ్చారు. అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్న అరవింద్ కు కూడా ఒక దశలో మంత్రి పదవి గ్యారంటీ అన్న వార్తలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో ఈ సారి తెలంగాణ నుండి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో మాజీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్, డీకె అరుణ, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లు ఉన్నారు. సికింద్రాబాద్ నుండి రెండోసారి విజయం సాధించిన కిషన్ రెడ్డికి ఈసారి కీలకశాఖ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. బండి సంజయ్, డీకే అరుణ, ఈటలల్లో ఒకరికి లేదా ఇద్దరికి సహాయ మంత్రులుగా అవకాశం లభించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఈసారి కేంద్రంలో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ లేదు. ఏపీలో 16 స్థానాలు గెలిచిన టీడీపీ, 2 స్థానాలు గెలిచిన జనసేనలది ఎన్డీఎ ప్రభుత్వంలో కీలకపాత్ర అయింది. ఈ నేపథ్యంలో వారు అక్కడ ఎన్ని మంత్రి పదవులు డిమాండ్ చేస్తారు ? అన్న అనుమానాలు ఉంది. ఈ పరిస్థితులలో తెలంగాణకు వచ్చే మంత్రి పదవులు ఎన్ని అన్న అనుమానాలు నెలకొన్నాయి. బీజేపీ అధిష్టానం ఈ సారి ఏం నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…