ఉత్తరాదిన ఎదురుగాలి వీచినా దక్షిణాదిన ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా ఎనిమిది ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ లో గొడెం నగేష్, కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్, మల్కాజ్ గిరిలో ఈటెల రాజేందర్, మెదక్ లో రఘునందన్ రావు, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ లో డీకె అరుణలు విజయం సాధించారు.
గత ఎన్నికల్లో నలుగురు విజయం సాధించినా కేంద్ర మంత్రి వర్గంలో ఒక్క కిషన్ రెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది. బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష్య పదవి నుండి తప్పించినప్పుడు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారన్న వార్తలు వినిపించాయి. కానీ జాతీయపార్టీలో పదవి ఇచ్చి సరిపుచ్చారు. అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్న అరవింద్ కు కూడా ఒక దశలో మంత్రి పదవి గ్యారంటీ అన్న వార్తలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో ఈ సారి తెలంగాణ నుండి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో మాజీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్, డీకె అరుణ, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లు ఉన్నారు. సికింద్రాబాద్ నుండి రెండోసారి విజయం సాధించిన కిషన్ రెడ్డికి ఈసారి కీలకశాఖ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. బండి సంజయ్, డీకే అరుణ, ఈటలల్లో ఒకరికి లేదా ఇద్దరికి సహాయ మంత్రులుగా అవకాశం లభించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఈసారి కేంద్రంలో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ లేదు. ఏపీలో 16 స్థానాలు గెలిచిన టీడీపీ, 2 స్థానాలు గెలిచిన జనసేనలది ఎన్డీఎ ప్రభుత్వంలో కీలకపాత్ర అయింది. ఈ నేపథ్యంలో వారు అక్కడ ఎన్ని మంత్రి పదవులు డిమాండ్ చేస్తారు ? అన్న అనుమానాలు ఉంది. ఈ పరిస్థితులలో తెలంగాణకు వచ్చే మంత్రి పదవులు ఎన్ని అన్న అనుమానాలు నెలకొన్నాయి. బీజేపీ అధిష్టానం ఈ సారి ఏం నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
This post was last modified on June 7, 2024 12:15 pm
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…