హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి బీజేపీ లోక్ సభ సభ్యురాలు, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు చండీగఢ్ విమానాశ్రయంలో చేధు అనుభవం ఎదురయింది. ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్నానని.. ఈ సమయంలో సెక్యూరిటీ చెక్-ఇన్ తర్వాత బోర్డింగ్ కోసం వెళుతున్నప్పుడు LCT కుల్విందర్ కౌర్ (CISF యూనిట్ చండీగఢ్ ఎయిర్పోర్ట్) చెంపదెబ్బ కొట్టినట్లు కంగనా రనౌత్ ఆరోపించారు. రైతుల ఉద్యమాన్ని అవమానించారని దూషిస్తూ తనపై దాడి చేశారని కంగనా రనౌత్ అన్నారు. ఈ మేరకు కంగనా ఫిర్యాదులో పేర్కొన్నారు.
కంగనా రనౌత్పై దాడి చేసిన మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చేరుకున్న కంగనా రనౌత్.. సీనియర్ అధికారుల సమక్షంలో, ఆమె ఈ సంఘటన గురించి సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్కు ఫిర్యాదుచేశారు. చండీగఢ్ విమానాశ్రయంలోని కర్టెన్ ఏరియాలో కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ తనతో వాదించి చెంపదెబ్బ కొట్టారని కంగనా వెల్లడించారు.
కానిస్టేబుల్ కుల్విందర్ను అరెస్టు చేసిన పోలీసులు సీఓ గదిలో నిర్బంధించి విచారణ కొనసాగిస్తున్నారు. చండీగఢ్ విమానాశ్రయంలో సీసీటీవీ ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నారు. మండి లోక్ సభ స్థానంలో కంగనా 70 వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందారు.
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి…
ఈ నెల 30 విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం నుంచి ప్రమోషనల్ కంటెంట్ మొత్తం దాదాపుగా బయటికి వచ్చేసింది. ట్రైలర్,…