151 కాదు అంతకుమించి.. వైనాట్ 175.. ఎన్నికల ముంగిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు, కార్యకర్తల ధీమా ఇది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీ ఓటమి ఖాయం అని చెప్పినా సరే.. వైసీసీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. కౌంటింగ్ రోజు చూస్తారు కదా అని ధీమాగా మాట్లాడారు. ఈ నెల 9న విశాఖపట్నంలో జగన్ రెండోసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం కూడా పెట్టేశారు.
కట్ చేస్తే.. ఎన్నికల్లో వైసీపీ ఘోరాతి ఘోరమైన పరాభవం చవిచూసింది. మరీ హీనంగా 11 సీట్లకు పరిమితం అయింది. ఫలితాలు చూసి ఎలా స్పందించాలో అర్థం కాని అయోమయంలో పడిపోయారు వైసీసీ నేతలు. జగన్ సైతం.. తాను చేసిన మంచంతా ఏమైపోయిందా.. ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బులు అందుకున్న ప్రజల ఓట్లన్నీ ఏమైపోయాయో అని ఆశ్చర్యపోయారు.
కాగా ఓటమి అనంతరం వైసీపీ మద్దతుదారులు ఒక క్యాంపైనింగ్ మొదలుపెట్టారు. జగన్ జనం చేతిలో మోసపోయాడట. ఇప్పటిదాకా జనాన్ని మోసం చేసిన నాయకులున్నారు కానీ.. తొలిసారి ఒక నాయకుడు జనం చేతిలో మోసపోయాడంటూ పోస్టులు పెడుతున్నారు. నా నాయకుడు ఓడిపోలేదు మోసపోయాడు అనే కొటేషన్తోనూ పలువురు వాట్సాప్ స్టేటస్లు పెడుతున్న పరిస్థితి.
ఇలా ఉంటే.. వైజాగ్ నార్త్ స్థానం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కేకే రాజు ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనం తమ పార్టీని ఏమార్చారని ఆయన వ్యాఖ్యానించారు. తాను పాతికేళ్లుగా రాజకీయాలతో కనెక్ట్ అయి ఉన్నానని.. రాజకీయ విశ్లేషణలు చేయడం, చదవడం తనకెంతో ఇష్టమని.. కానీ ఈసారి ఏపీ ఎన్నికల్లో జరిగింది మాత్రం అంచనాలకు అందనిది అని రాజు చెప్పారు. “ఎన్నికల్లో రకరకాల ప్రభంజనాలు వస్తుంటాయి. కానీ నాకు తెలిసి ఇలా జరగడం మాత్రం తొలిసారి. రాజకీయ నాయకుల దగ్గర వాళ్లకున్న ఇబ్బందిని బయటపడనివ్వకుండా.. ఎవ్వరేం అడిగినా తలూపి ప్రజలు రాజకీయ నాయకులను, పార్టీని ఏమార్చడం.. వాళ్ల మనసులో ఏం అనుకున్నారో అది తు.చ తప్పకుండా చేయడం అనేది మొట్టమొదటిసారి జరిగింది” అని వ్యాఖ్యానించారు రాజు.
This post was last modified on June 6, 2024 3:54 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…