ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. అనూహ్యమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం విలువ లేకుండాపోయిందని.. సర్వం.. ధనుంజయరెడ్డే అన్నట్టుగా ఓ కీలక ఐఏఎస్ వ్యవహరించారని.. తెలుస్తోంది. ఆయన కారణంగానే ఎమ్మెల్యేలకు.. జగన్ దగ్గర కనీసం గోడు వెళ్లబోసుకునే అవకాశం కూడా చిక్కలేదని.. ఫలితంగా తమ తమ నియోజకవర్గాల్లో పనులు నిలిచిపోయి.. ప్రజల ఆగ్రహానికి ఇది కూడా ఒక కారణమై ఉంటుందని.. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ఓటమిని విశ్లేషించారు.
ప్రజలకు ఎన్నో చేశాం. ఎన్నెన్నో మంచి పనులు చేశాం. ఇంటింటికీ వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశాం. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇంత మంచి చేసిన మమ్మల్ని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారో.. మాకు అర్థం కావడం లేదు. మేం తప్పు చేశామా.? లేక.. ప్రజలే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో తప్పు చేశారా? మేం ఆలోచించుకుంటాం అని రాజా అన్నారు.
తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టించానని చెప్పారు. అనేక పనులు చేయించానన్నారు. ఏ గ్రామం తీసు కున్నా.. తాను చేయించిన పనులు కనిపిస్తాయని చెప్పారు. కావాలంటే.. ఎవరైనా దీనిని పరిశీలించుకోవాలని సూచించారు.
ఇక, సీఎంవో వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. ఒక దరిద్రమైన అధికారి ఉన్నాడు. ఆయనే ధనుంజయరెడ్డి. ఎక్కడ నుంచో తెచ్చి.. ఇక్కడ పెట్టారు. ప్రతిదానికీ ఆయన తానే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరించారు. ఎమ్మెల్యేలు ఏదైనా పనులపై ఆయన దగ్గరకు వెళ్తే.. గంటల తరబడి నిలబెట్టేవాడు. ముఖ్యమంత్రి ని కలిసేందుకు కూడా ఇబ్బంది పడేవాళ్లం . కనీసం కలిసినా.. చెప్పిన పనిని మళ్లీ ధనుంజయ రెడ్డికి అప్పగించేవారు. ఆయన చూద్దాం.. చేద్దాం.. అంటూ ఐదేళ్లు గడిపేశాడు అని రాజా వ్యాఖ్యానించారు.
తన సొంత నియోజకవర్గానికి చెందిన పనుల కోసం ప్రతి మంగళవారం.. విజయవాడ వెళ్లి మకాం వేసి.. అక్కడ నుంచి సీఎంవో కార్యాలయానికి వెళ్లి.. కలిసే ప్రయత్నం చేశామని.. కానీ, ఏ పనిచెప్పినా.. ధనుంజయరెడ్డే చూసారని అన్నారు. కానీ, పనులు చేసేవారు కాదన్నారు. దీంతో విదేశీ విద్యాదీవెన బిల్లులు.. ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లుల కోసం ఎన్ని సార్లు అర్జీలు పెట్టినా.. చేయలేదని విమర్శించారు. ఒక పిల్లాడికి రూ.15000 అమ్మ ఒడి ఇస్తే.. రాష్ట్రం శ్రీలం క అయిపోతుందన్న పార్టీలకు ప్రజలు ఓట్లెలా వేశారో .. అంతు పట్టడం లేదన్నారు. మోసం చేస్తేనే ఆదరిస్తారా? మోసం చేయడం మాకు చేతకాలేదు అన్నారు.
This post was last modified on June 6, 2024 7:10 am
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…