Political News

అంతా ధ‌నుంజ‌య‌రెడ్డే.. సీఎం త‌ర్వాత సీఎంగా వ్య‌వ‌హ‌రించాడు

ఏపీలో వైసీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. అనూహ్య‌మైన విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు ఏమాత్రం విలువ లేకుండాపోయింద‌ని.. స‌ర్వం.. ధ‌నుంజ‌య‌రెడ్డే అన్న‌ట్టుగా ఓ కీల‌క ఐఏఎస్ వ్య‌వ‌హ‌రించార‌ని.. తెలుస్తోంది. ఆయ‌న కార‌ణంగానే ఎమ్మెల్యేల‌కు.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర క‌నీసం గోడు వెళ్ల‌బోసుకునే అవ‌కాశం కూడా చిక్క‌లేద‌ని.. ఫ‌లితంగా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నులు నిలిచిపోయి.. ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి ఇది కూడా ఒక కార‌ణ‌మై ఉంటుంద‌ని.. రాజాన‌గ‌రం మాజీ ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా అన్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త‌మ ఓటమిని విశ్లేషించారు.

ప్ర‌జ‌ల‌కు ఎన్నో చేశాం. ఎన్నెన్నో మంచి ప‌నులు చేశాం. ఇంటింటికీ వ‌లంటీర్ వ్య‌వ‌స్థ ఏర్పాటు చేశాం. రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇంత మంచి చేసిన మ‌మ్మ‌ల్ని ప్ర‌జలు ఎందుకు ప‌క్క‌న పెట్టారో.. మాకు అర్థం కావ‌డం లేదు. మేం త‌ప్పు చేశామా.? లేక‌.. ప్ర‌జ‌లే ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌ప్పు చేశారా? మేం ఆలోచించుకుంటాం అని రాజా అన్నారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు ప‌రుగులు పెట్టించాన‌ని చెప్పారు. అనేక ప‌నులు చేయించాన‌న్నారు. ఏ గ్రామం తీసు కున్నా.. తాను చేయించిన ప‌నులు క‌నిపిస్తాయ‌ని చెప్పారు. కావాలంటే.. ఎవ‌రైనా దీనిని ప‌రిశీలించుకోవాల‌ని సూచించారు.

ఇక‌, సీఎంవో వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఒక ద‌రిద్ర‌మైన అధికారి ఉన్నాడు. ఆయ‌నే ధ‌నుంజ‌య‌రెడ్డి. ఎక్క‌డ నుంచో తెచ్చి.. ఇక్క‌డ పెట్టారు. ప్ర‌తిదానికీ ఆయ‌న తానే స‌ర్వ‌స్వం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఎమ్మెల్యేలు ఏదైనా ప‌నుల‌పై ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్తే.. గంట‌ల త‌ర‌బ‌డి నిల‌బెట్టేవాడు. ముఖ్య‌మంత్రి ని క‌లిసేందుకు కూడా ఇబ్బంది ప‌డేవాళ్లం . క‌నీసం క‌లిసినా.. చెప్పిన ప‌నిని మ‌ళ్లీ ధ‌నుంజ‌య రెడ్డికి అప్ప‌గించేవారు. ఆయ‌న చూద్దాం.. చేద్దాం.. అంటూ ఐదేళ్లు గ‌డిపేశాడు అని రాజా వ్యాఖ్యానించారు.

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌నుల కోసం ప్ర‌తి మంగ‌ళ‌వారం.. విజ‌య‌వాడ వెళ్లి మ‌కాం వేసి.. అక్క‌డ నుంచి సీఎంవో కార్యాల‌యానికి వెళ్లి.. క‌లిసే ప్ర‌య‌త్నం చేశామ‌ని.. కానీ, ఏ ప‌నిచెప్పినా.. ధ‌నుంజ‌య‌రెడ్డే చూసార‌ని అన్నారు. కానీ, ప‌నులు చేసేవారు కాద‌న్నారు. దీంతో విదేశీ విద్యాదీవెన బిల్లులు.. ప్రాజెక్టుల‌కు సంబంధించిన బిల్లుల కోసం ఎన్ని సార్లు అర్జీలు పెట్టినా.. చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ఒక పిల్లాడికి రూ.15000 అమ్మ ఒడి ఇస్తే.. రాష్ట్రం శ్రీలం క అయిపోతుంద‌న్న పార్టీల‌కు ప్ర‌జ‌లు ఓట్లెలా వేశారో .. అంతు ప‌ట్ట‌డం లేద‌న్నారు. మోసం చేస్తేనే ఆద‌రిస్తారా? మోసం చేయ‌డం మాకు చేత‌కాలేదు అన్నారు.

Satya

Recent Posts

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

1 hour ago

రాజాసాబ్‌ ఫలితంతో నాకు స‌బంధం లేదు – ఎస్కేఎన్

ప్ర‌భాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌ట‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ సినిమా…

1 hour ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

3 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

3 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

4 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

4 hours ago