Political News

అంతా ధ‌నుంజ‌య‌రెడ్డే.. సీఎం త‌ర్వాత సీఎంగా వ్య‌వ‌హ‌రించాడు

ఏపీలో వైసీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. అనూహ్య‌మైన విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు ఏమాత్రం విలువ లేకుండాపోయింద‌ని.. స‌ర్వం.. ధ‌నుంజ‌య‌రెడ్డే అన్న‌ట్టుగా ఓ కీల‌క ఐఏఎస్ వ్య‌వ‌హ‌రించార‌ని.. తెలుస్తోంది. ఆయ‌న కార‌ణంగానే ఎమ్మెల్యేల‌కు.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర క‌నీసం గోడు వెళ్ల‌బోసుకునే అవ‌కాశం కూడా చిక్క‌లేద‌ని.. ఫ‌లితంగా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నులు నిలిచిపోయి.. ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి ఇది కూడా ఒక కార‌ణ‌మై ఉంటుంద‌ని.. రాజాన‌గ‌రం మాజీ ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా అన్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త‌మ ఓటమిని విశ్లేషించారు.

ప్ర‌జ‌ల‌కు ఎన్నో చేశాం. ఎన్నెన్నో మంచి ప‌నులు చేశాం. ఇంటింటికీ వ‌లంటీర్ వ్య‌వ‌స్థ ఏర్పాటు చేశాం. రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇంత మంచి చేసిన మ‌మ్మ‌ల్ని ప్ర‌జలు ఎందుకు ప‌క్క‌న పెట్టారో.. మాకు అర్థం కావ‌డం లేదు. మేం త‌ప్పు చేశామా.? లేక‌.. ప్ర‌జ‌లే ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌ప్పు చేశారా? మేం ఆలోచించుకుంటాం అని రాజా అన్నారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు ప‌రుగులు పెట్టించాన‌ని చెప్పారు. అనేక ప‌నులు చేయించాన‌న్నారు. ఏ గ్రామం తీసు కున్నా.. తాను చేయించిన ప‌నులు క‌నిపిస్తాయ‌ని చెప్పారు. కావాలంటే.. ఎవ‌రైనా దీనిని ప‌రిశీలించుకోవాల‌ని సూచించారు.

ఇక‌, సీఎంవో వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఒక ద‌రిద్ర‌మైన అధికారి ఉన్నాడు. ఆయ‌నే ధ‌నుంజ‌య‌రెడ్డి. ఎక్క‌డ నుంచో తెచ్చి.. ఇక్క‌డ పెట్టారు. ప్ర‌తిదానికీ ఆయ‌న తానే స‌ర్వ‌స్వం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఎమ్మెల్యేలు ఏదైనా ప‌నుల‌పై ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్తే.. గంట‌ల త‌ర‌బ‌డి నిల‌బెట్టేవాడు. ముఖ్య‌మంత్రి ని క‌లిసేందుకు కూడా ఇబ్బంది ప‌డేవాళ్లం . క‌నీసం క‌లిసినా.. చెప్పిన ప‌నిని మ‌ళ్లీ ధ‌నుంజ‌య రెడ్డికి అప్ప‌గించేవారు. ఆయ‌న చూద్దాం.. చేద్దాం.. అంటూ ఐదేళ్లు గ‌డిపేశాడు అని రాజా వ్యాఖ్యానించారు.

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌నుల కోసం ప్ర‌తి మంగ‌ళ‌వారం.. విజ‌య‌వాడ వెళ్లి మ‌కాం వేసి.. అక్క‌డ నుంచి సీఎంవో కార్యాల‌యానికి వెళ్లి.. క‌లిసే ప్ర‌య‌త్నం చేశామ‌ని.. కానీ, ఏ ప‌నిచెప్పినా.. ధ‌నుంజ‌య‌రెడ్డే చూసార‌ని అన్నారు. కానీ, ప‌నులు చేసేవారు కాద‌న్నారు. దీంతో విదేశీ విద్యాదీవెన బిల్లులు.. ప్రాజెక్టుల‌కు సంబంధించిన బిల్లుల కోసం ఎన్ని సార్లు అర్జీలు పెట్టినా.. చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ఒక పిల్లాడికి రూ.15000 అమ్మ ఒడి ఇస్తే.. రాష్ట్రం శ్రీలం క అయిపోతుంద‌న్న పార్టీల‌కు ప్ర‌జ‌లు ఓట్లెలా వేశారో .. అంతు ప‌ట్ట‌డం లేద‌న్నారు. మోసం చేస్తేనే ఆద‌రిస్తారా? మోసం చేయ‌డం మాకు చేత‌కాలేదు అన్నారు.

This post was last modified on June 6, 2024 7:10 am

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

1 hour ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

2 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

2 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

2 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

3 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

5 hours ago