ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. అనూహ్యమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం విలువ లేకుండాపోయిందని.. సర్వం.. ధనుంజయరెడ్డే అన్నట్టుగా ఓ కీలక ఐఏఎస్ వ్యవహరించారని.. తెలుస్తోంది. ఆయన కారణంగానే ఎమ్మెల్యేలకు.. జగన్ దగ్గర కనీసం గోడు వెళ్లబోసుకునే అవకాశం కూడా చిక్కలేదని.. ఫలితంగా తమ తమ నియోజకవర్గాల్లో పనులు నిలిచిపోయి.. ప్రజల ఆగ్రహానికి ఇది కూడా ఒక కారణమై ఉంటుందని.. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ఓటమిని విశ్లేషించారు.
ప్రజలకు ఎన్నో చేశాం. ఎన్నెన్నో మంచి పనులు చేశాం. ఇంటింటికీ వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశాం. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇంత మంచి చేసిన మమ్మల్ని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారో.. మాకు అర్థం కావడం లేదు. మేం తప్పు చేశామా.? లేక.. ప్రజలే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో తప్పు చేశారా? మేం ఆలోచించుకుంటాం అని రాజా అన్నారు.
తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టించానని చెప్పారు. అనేక పనులు చేయించానన్నారు. ఏ గ్రామం తీసు కున్నా.. తాను చేయించిన పనులు కనిపిస్తాయని చెప్పారు. కావాలంటే.. ఎవరైనా దీనిని పరిశీలించుకోవాలని సూచించారు.
ఇక, సీఎంవో వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. ఒక దరిద్రమైన అధికారి ఉన్నాడు. ఆయనే ధనుంజయరెడ్డి. ఎక్కడ నుంచో తెచ్చి.. ఇక్కడ పెట్టారు. ప్రతిదానికీ ఆయన తానే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరించారు. ఎమ్మెల్యేలు ఏదైనా పనులపై ఆయన దగ్గరకు వెళ్తే.. గంటల తరబడి నిలబెట్టేవాడు. ముఖ్యమంత్రి ని కలిసేందుకు కూడా ఇబ్బంది పడేవాళ్లం . కనీసం కలిసినా.. చెప్పిన పనిని మళ్లీ ధనుంజయ రెడ్డికి అప్పగించేవారు. ఆయన చూద్దాం.. చేద్దాం.. అంటూ ఐదేళ్లు గడిపేశాడు అని రాజా వ్యాఖ్యానించారు.
తన సొంత నియోజకవర్గానికి చెందిన పనుల కోసం ప్రతి మంగళవారం.. విజయవాడ వెళ్లి మకాం వేసి.. అక్కడ నుంచి సీఎంవో కార్యాలయానికి వెళ్లి.. కలిసే ప్రయత్నం చేశామని.. కానీ, ఏ పనిచెప్పినా.. ధనుంజయరెడ్డే చూసారని అన్నారు. కానీ, పనులు చేసేవారు కాదన్నారు. దీంతో విదేశీ విద్యాదీవెన బిల్లులు.. ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లుల కోసం ఎన్ని సార్లు అర్జీలు పెట్టినా.. చేయలేదని విమర్శించారు. ఒక పిల్లాడికి రూ.15000 అమ్మ ఒడి ఇస్తే.. రాష్ట్రం శ్రీలం క అయిపోతుందన్న పార్టీలకు ప్రజలు ఓట్లెలా వేశారో .. అంతు పట్టడం లేదన్నారు. మోసం చేస్తేనే ఆదరిస్తారా? మోసం చేయడం మాకు చేతకాలేదు అన్నారు.
This post was last modified on June 6, 2024 7:10 am
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…