Political News

అంతా ధ‌నుంజ‌య‌రెడ్డే.. సీఎం త‌ర్వాత సీఎంగా వ్య‌వ‌హ‌రించాడు

ఏపీలో వైసీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. అనూహ్య‌మైన విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు ఏమాత్రం విలువ లేకుండాపోయింద‌ని.. స‌ర్వం.. ధ‌నుంజ‌య‌రెడ్డే అన్న‌ట్టుగా ఓ కీల‌క ఐఏఎస్ వ్య‌వ‌హ‌రించార‌ని.. తెలుస్తోంది. ఆయ‌న కార‌ణంగానే ఎమ్మెల్యేల‌కు.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర క‌నీసం గోడు వెళ్ల‌బోసుకునే అవ‌కాశం కూడా చిక్క‌లేద‌ని.. ఫ‌లితంగా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నులు నిలిచిపోయి.. ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి ఇది కూడా ఒక కార‌ణ‌మై ఉంటుంద‌ని.. రాజాన‌గ‌రం మాజీ ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా అన్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త‌మ ఓటమిని విశ్లేషించారు.

ప్ర‌జ‌ల‌కు ఎన్నో చేశాం. ఎన్నెన్నో మంచి ప‌నులు చేశాం. ఇంటింటికీ వ‌లంటీర్ వ్య‌వ‌స్థ ఏర్పాటు చేశాం. రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇంత మంచి చేసిన మ‌మ్మ‌ల్ని ప్ర‌జలు ఎందుకు ప‌క్క‌న పెట్టారో.. మాకు అర్థం కావ‌డం లేదు. మేం త‌ప్పు చేశామా.? లేక‌.. ప్ర‌జ‌లే ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌ప్పు చేశారా? మేం ఆలోచించుకుంటాం అని రాజా అన్నారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు ప‌రుగులు పెట్టించాన‌ని చెప్పారు. అనేక ప‌నులు చేయించాన‌న్నారు. ఏ గ్రామం తీసు కున్నా.. తాను చేయించిన ప‌నులు క‌నిపిస్తాయ‌ని చెప్పారు. కావాలంటే.. ఎవ‌రైనా దీనిని ప‌రిశీలించుకోవాల‌ని సూచించారు.

ఇక‌, సీఎంవో వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఒక ద‌రిద్ర‌మైన అధికారి ఉన్నాడు. ఆయ‌నే ధ‌నుంజ‌య‌రెడ్డి. ఎక్క‌డ నుంచో తెచ్చి.. ఇక్క‌డ పెట్టారు. ప్ర‌తిదానికీ ఆయ‌న తానే స‌ర్వ‌స్వం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఎమ్మెల్యేలు ఏదైనా ప‌నుల‌పై ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్తే.. గంట‌ల త‌ర‌బ‌డి నిల‌బెట్టేవాడు. ముఖ్య‌మంత్రి ని క‌లిసేందుకు కూడా ఇబ్బంది ప‌డేవాళ్లం . క‌నీసం క‌లిసినా.. చెప్పిన ప‌నిని మ‌ళ్లీ ధ‌నుంజ‌య రెడ్డికి అప్ప‌గించేవారు. ఆయ‌న చూద్దాం.. చేద్దాం.. అంటూ ఐదేళ్లు గ‌డిపేశాడు అని రాజా వ్యాఖ్యానించారు.

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌నుల కోసం ప్ర‌తి మంగ‌ళ‌వారం.. విజ‌య‌వాడ వెళ్లి మ‌కాం వేసి.. అక్క‌డ నుంచి సీఎంవో కార్యాల‌యానికి వెళ్లి.. క‌లిసే ప్ర‌య‌త్నం చేశామ‌ని.. కానీ, ఏ ప‌నిచెప్పినా.. ధ‌నుంజ‌య‌రెడ్డే చూసార‌ని అన్నారు. కానీ, ప‌నులు చేసేవారు కాద‌న్నారు. దీంతో విదేశీ విద్యాదీవెన బిల్లులు.. ప్రాజెక్టుల‌కు సంబంధించిన బిల్లుల కోసం ఎన్ని సార్లు అర్జీలు పెట్టినా.. చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ఒక పిల్లాడికి రూ.15000 అమ్మ ఒడి ఇస్తే.. రాష్ట్రం శ్రీలం క అయిపోతుంద‌న్న పార్టీల‌కు ప్ర‌జ‌లు ఓట్లెలా వేశారో .. అంతు ప‌ట్ట‌డం లేద‌న్నారు. మోసం చేస్తేనే ఆద‌రిస్తారా? మోసం చేయ‌డం మాకు చేత‌కాలేదు అన్నారు.

This post was last modified on June 6, 2024 7:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ రాకతో థియేటర్లు కళకళా

ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…

19 minutes ago

కేసీఆర్‌కు భారీ ప్రాధాన్యం… రేవంత్ రెడ్డి వ్యూహ‌మేంటి?

ఏ రాష్ట్రంలో అయినా... ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు ప్ర‌భుత్వాలు పెద్ద‌గా ఇంపార్టెన్స్ ఇవ్వ‌వు. స‌హ‌జంగా రాజ‌కీయ వైరాన్ని కొన‌సాగిస్తాయి. ఏపీ స‌హా…

33 minutes ago

అమ‌రావతిపై మళ్లీ రచ్చ మొదలెట్టిన జగన్

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీల‌కు…

1 hour ago

పిఠాపురానికి ముంద‌స్తు సంక్రాంతి!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి…

5 hours ago

మగాళ్లను కుక్కలతో పోల్చిన నటి

కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…

12 hours ago

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

14 hours ago