టీడీపీ యువ నాయకుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. పార్టీని విజయ తీరాల వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. యువగళం పాదయాత్ర ద్వారా.. పార్టీని బలోపేతం చేశారు.
ఎన్నికల ప్రచారంలోనూ దూకుడుగా ముందుకు సాగారు. అన్నింటికన్నా ముఖ్యంగా 2019లో ఓడిపోయిన మంగళగిరిలోనే పట్టుబట్టి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. భారీ మెజారిటీ కూడా సాధించారు. ఇక, ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మంత్రి పదవి ఖాయమని కూడా అంటున్నారు.
2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో నారాలోకేష్కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. కీలకమై న ఐటీ శాఖను కూడా అప్పగించారు. అప్పట్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు పోటీగా ఇక్కడ నారా లోకేష్కు ఐటీ శాఖను అప్ప గించారనే చర్చ సాగింది.
ఐటీ మంత్రిగా ఆయన కొన్ని సంస్థలు తీసుకువచ్చారు. అదేవిధంగా ఫైబర్ గ్రిడ్ ద్వారా.. గ్రామాల్లోనూ నెట్ కనెక్షన్లు ఇచ్చే పథకాన్ని తీసుకువచ్చారు. వాస్తవానికి ఇది అప్పటి కేంద్ర ప్రభుత్వ పథకం.. దీనికి ఏపీలోనూ అమలు చేయడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు.
అలానే విశాఖకు ఐటీ కంపెనీలు రప్పించడంలోనూ.. మంగళగిరిలో ఐటీ అనుబంధం పరిశ్రమలు ఏర్పాటు చేయడంలోనూ నారా లోకేష్ మంత్రిగా కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆయన ఈ శాఖనే తీసుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది.
ఎందుకంటే.. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ కల్పనలకు కీలకంగా ఐటీ ఉండడంతో దీనిని డెవలప్ చేస్తామని.. కొత్త సంస్థలు తీసుకువస్తామని.. ఎన్నికల సమయంలో ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుత మంత్రి వర్గంలోనూ నారా లోకేష్ ఐటీ శాఖనే కేటాయిస్తారని ఎక్కువ మంది భావిస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on June 6, 2024 7:05 am
రెండు రోజుల్లలో తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన…
ఇంకో పదమూడు రోజుల్లో విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 కోసం అభిమానులే కాదు సగటు సినీ ప్రియులు సైతం…
వలసవాద బ్రిటీష్ విధానాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్థి చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్రిమినల్ చట్టా లను మార్పు చేశారు.…
కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు మాసాలే అయింది. అయితే.. ఇంతలోనే అతి పెద్ద సమస్య ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. విశాఖ…
సైకో కిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే చూస్తాం కానీ కొన్ని ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటే అవి నిజంగా…
ఎన్నికల్లో ఓటమి తర్వాత మూడు నెలలు సైలెంట్ గా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో…