టీడీపీ యువ నాయకుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. పార్టీని విజయ తీరాల వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. యువగళం పాదయాత్ర ద్వారా.. పార్టీని బలోపేతం చేశారు.
ఎన్నికల ప్రచారంలోనూ దూకుడుగా ముందుకు సాగారు. అన్నింటికన్నా ముఖ్యంగా 2019లో ఓడిపోయిన మంగళగిరిలోనే పట్టుబట్టి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. భారీ మెజారిటీ కూడా సాధించారు. ఇక, ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మంత్రి పదవి ఖాయమని కూడా అంటున్నారు.
2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో నారాలోకేష్కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. కీలకమై న ఐటీ శాఖను కూడా అప్పగించారు. అప్పట్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు పోటీగా ఇక్కడ నారా లోకేష్కు ఐటీ శాఖను అప్ప గించారనే చర్చ సాగింది.
ఐటీ మంత్రిగా ఆయన కొన్ని సంస్థలు తీసుకువచ్చారు. అదేవిధంగా ఫైబర్ గ్రిడ్ ద్వారా.. గ్రామాల్లోనూ నెట్ కనెక్షన్లు ఇచ్చే పథకాన్ని తీసుకువచ్చారు. వాస్తవానికి ఇది అప్పటి కేంద్ర ప్రభుత్వ పథకం.. దీనికి ఏపీలోనూ అమలు చేయడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు.
అలానే విశాఖకు ఐటీ కంపెనీలు రప్పించడంలోనూ.. మంగళగిరిలో ఐటీ అనుబంధం పరిశ్రమలు ఏర్పాటు చేయడంలోనూ నారా లోకేష్ మంత్రిగా కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆయన ఈ శాఖనే తీసుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది.
ఎందుకంటే.. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ కల్పనలకు కీలకంగా ఐటీ ఉండడంతో దీనిని డెవలప్ చేస్తామని.. కొత్త సంస్థలు తీసుకువస్తామని.. ఎన్నికల సమయంలో ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుత మంత్రి వర్గంలోనూ నారా లోకేష్ ఐటీ శాఖనే కేటాయిస్తారని ఎక్కువ మంది భావిస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on June 6, 2024 7:05 am
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…