Political News

ఆ పీఠం అశ్వనీదత్ కే !

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిన్న రాజీనామా చేశాడు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం, తిరుపతిలో సొంత కుమారుడు పరాజయం నేపథ్యంలో ఆయన తన రాజీనామా లేఖను టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి పంపించాడు.

అయితే ఇప్పుడు టీటీడీ తర్వాత చైర్మన్ ఎవరన్న చర్చ మొదలయింది. ఈ పదవిని ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ను వరిస్తుందని అంటున్నారు.

చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడే జైలుకు వెళ్లి కలిసిన అశ్వనీదత్ ఈసారి టీడీపీ 160 స్థానాలు దక్కించుకుంటుందని మీడియాతో అన్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారం కూటమి 164 స్థానాలు దక్కించుకుంది. ఎన్నికల సమయంలో బాబుకు మద్దతుగా ఒక వీడియో కూడా అశ్వనీదత్ రిలీజ్ చేశాడు.

ఇక వైసీపీ పాలనలో కొన్నాళ్లు వైవి సుబ్బారెడ్డి తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమితో భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అశ్వినీ దత్ టీటీడీ చైర్మన్ అవుతారా? లేరా ? వేచిచూడాలి.

Satya

Recent Posts

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

2 hours ago

రాజాసాబ్‌ ఫలితంతో నాకు స‌బంధం లేదు – ఎస్కేఎన్

ప్ర‌భాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌ట‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ సినిమా…

2 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

4 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

4 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

5 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

5 hours ago