Political News

ఆ పీఠం అశ్వనీదత్ కే !

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిన్న రాజీనామా చేశాడు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం, తిరుపతిలో సొంత కుమారుడు పరాజయం నేపథ్యంలో ఆయన తన రాజీనామా లేఖను టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి పంపించాడు.

అయితే ఇప్పుడు టీటీడీ తర్వాత చైర్మన్ ఎవరన్న చర్చ మొదలయింది. ఈ పదవిని ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ను వరిస్తుందని అంటున్నారు.

చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడే జైలుకు వెళ్లి కలిసిన అశ్వనీదత్ ఈసారి టీడీపీ 160 స్థానాలు దక్కించుకుంటుందని మీడియాతో అన్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారం కూటమి 164 స్థానాలు దక్కించుకుంది. ఎన్నికల సమయంలో బాబుకు మద్దతుగా ఒక వీడియో కూడా అశ్వనీదత్ రిలీజ్ చేశాడు.

ఇక వైసీపీ పాలనలో కొన్నాళ్లు వైవి సుబ్బారెడ్డి తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమితో భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అశ్వినీ దత్ టీటీడీ చైర్మన్ అవుతారా? లేరా ? వేచిచూడాలి.

Satya

Recent Posts

‘దురంధర్’ చూసిన కళ్ళకు ‘ఆల్ఫా’ నచ్చేనా

ఎవరు ఔనన్నా కాదన్నా బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాగా దురంధర్ పేరు…

1 hour ago

అమరావతిలో రూ.2.5 వేల కోట్ల కేంద్ర ప్రాజెక్టు

అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి…

3 hours ago

మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్‌.. వైసీపీకి ఇర‌కాటం.. !

నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి.…

4 hours ago

న‌ట‌రాజ‌న్‌… కింక‌ర్త‌వ్యం…?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజ‌న్‌ పరిస్థితి ఏమవుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి…

6 hours ago

పూజా హెగ్డేకు మరోసారి నిరాశ

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో నెంబర్ వన్ స్థానం ఎంజాయ్ చేసిన హీరోయిన్ పూజా హగ్దేకు సక్సెస్…

7 hours ago

లెజెండరీ దర్శకులు భారతీరాజా ఇక లేరు

ఒక దిగ్గజంసెలవు తీసుకున్నారు. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు…

8 hours ago