ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఊహించని విధంగా హైఓల్టేజ్ షాక్ తగిలింది. తాజా ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా.. భారీ మార్పులు అయితే.. ఉండబోవని ఆ పార్టీ నాయకులు లెక్కలు వేసుకున్నారు. గెలిస్తే.. 100-120 సీట్లు , ఓడితే… 55-70 మధ్య సీట్లు ఖాయమని చాలా మంది లెక్కలు రెడీ చేసుకున్నారు. కానీ, ప్రజలు ఇలా తీర్పు చెప్పలేదు. ఓడించారు. అది కూడా అలా ఇలా కాదు.. ఏకంగా.. 11 సీట్లతోనే సరిపుచ్చారు. గతంలో 151 సీట్లు ఇచ్చిన ప్రజలు మధ్యలో 5 తీసేసి 11కు పరిమితం చేశారు.
ఈ పరిణామంతో వైసీపీ అగ్రనేతల నుంచి క్షేత్రస్థాయి నాయకుల దాకా కూడా.. అందరూ భారీ షాక్లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే అసలు ఎందుకిలా వైసీపీ ఖర్మ కాలిపోయిందనే చర్చలు, విశ్లేషణలు వస్తున్నాయి. ప్రధానంగా సిద్ధం సభల వ్యవహారంపై వైసీపీ నాయకులు చర్చ చేస్తున్నారు. ఎన్నికలకు మూడు మాసాల ముందు.. సీఎం జగన్ రాష్ట్రంలోని నాలుగు కీలక ప్రాంతాల్లో నాలుగు ‘సిద్ధం’ సభలను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర నుంచి సీమ వరకు కూడా.. ఈ సభలు నిర్వహించారు.
విశాఖతో ప్రాంభమైన ఈ సభలు కర్నూలు వరకు సాగాయి. ఈ సభల్లో సీఎం జగన్ ఒక్కరే మాట్లాడేవారు. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఆయా సభలకు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు అప్పట్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క సభకు మిలియన్ మంది ప్రజలు హాజరయ్యేలా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. చివరి సభకు 15 లక్షల మందిని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని అది కూడా సాధించారు. ప్రజలను బస్సులు, ప్రైవేటు వాహనాల్లోనూ తరలించారు.
మొత్తంగా జనాలు కిక్కిరిసిపోయి.. సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయి. అయితే.. అవన్నీ ఓట్లరూపంలో పడ్డాయా? అంటే పడలేదు. పడి ఉంటే.. 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకే వైసీపీ ఎందుకు పరిమితం అవుతుంది. పైగా కంచుకోటల వంటి సీమలోని నియోజకవర్గాల్లోనూ తుడిచి పెట్టుకుపోయింది. అంటే.. మొత్తంగా.. వైసీపీ నిర్వహించిన ద్ధం సభలకు వచ్చిన జనం.. వైసీపీకి ఓటెత్తలేదని స్పష్టమైంది. సభల్లో కనిపించిన సునామీ.. ఈవీఎంల వద్దకు వచ్చేసరికి .. రివర్స్ అయిపోయిందని పరిశీలకులు కూడా అంటున్నారు.
This post was last modified on June 5, 2024 5:42 pm
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…