ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. గత ఎన్నికలకు భిన్నంగా ఏపీ ప్రజలు ఈ సారి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించారు. గాజు గ్లాసు, సైకిల్, కమలం పువ్వు గుర్తులతో ఓటర్లలో గందరగోళం రేపుతుందన్న ఆందోళన ఉండగా అవన్నీ పటాపంచలు చేస్తూ ప్రజలు తీర్పు ఇచ్చారు.
జనసేన పోటీ లేని చోట ఎన్నికల కమీషన్ గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. దీని మీద చివరి వరకు ఎన్నికల కమీషన్, న్యాయస్థానాలలో జనసేన పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. అయినా జనసేన పోటీ చేసిన 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలలో విజయం సాధించడంతో జనసేన సైనికుల్లో ఉత్సాహం ఉప్పొంగుతుంది.
గాజువాక నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓటమిపాలయ్యారు. ఈసారి అక్కడి నుండి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఏకంగా 95, 235 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం. భీమిలి నుంచి గంటా శ్రీనివాస్ ఏకంగా 92, 401, మంగళగిరి నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన నారా లోకేశ్ 91, 413 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థి రమేశ్ 81, 870, నెల్లూరు అర్బన్ నుంచి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి నారాయణ 72,489, తణుకులో టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ 72,121, కాకినాడ రూరల్ నుంచి జనసేన అభ్యర్థి నానాజీ 72,040, రాజమండ్రి అర్బన్ నుంచి టీడీపీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ 71,404, పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్- 70, 279 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడం విశేషం.
This post was last modified on June 5, 2024 10:41 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…