Political News

కర్ణాటకలో కాంగ్రెస్ కు ఝలక్

కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. రాష్ట్రంలోని 28 స్థానాలకుగానూ 17 సీట్లను ప్రతిపక్ష బీజేపీ కైవసం చేసుకున్నది. అధికార కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాల్తకు మాత్రమే పరిమితం అయింది. బీజేపీ మిత్రపక్షం జేడీఎస్‌ రెండు చోట్ల గెలిచింది. గెలిచిన వారిలో మాజీ సీఎంలు బసవరాజ్‌ బొమ్మై, హెచ్‌డీ కుమారస్వామి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అల్లుడు రాధాక్రిష్ణ దొడ్డమణి ఉన్నారు.

మరోవైపు రాష్ట్ర డిప్యూటీ సీఎం, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌ బెంగళూరు రూరల్‌ లోక్‌సభ స్థానం నుంచి 2,69,647 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి, దేవెగౌడ అల్లుడు సీఎన్‌ మంజునాథ్‌ చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. గత కొన్ని రోజులుగా సెక్స్‌ స్కాండల్‌ ఆరోపణలతో వార్తలకెక్కిన ప్రజ్వల్‌ రేవణ్ణ పరాజయం పాలయ్యారు. హసన్‌ నుంచి పోటీచేసిన ప్రజ్వల్‌ రేవణ్ణ కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రేయాస్‌ ఎం పటేల్‌ చేతిలో 42,649 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

మాండ్య నుండి పోటీ చేసి మాజీ ముఖ్యమంత్రి, దేవెగౌడ కుమారుడు హెచ్డీ కుమారస్వామి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ గౌడపై 284620 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం విశేషం. బెల్గాం, బాగల్ కోట్, బీజాపూర్, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, శిమోగా, దక్షిణ కన్నడ, ఉడుపి చిక్ మగ్ ళూర్, చిత్రదుర్గ, తుమకూర్, మైసూర్, బెంగుళూరు ఉత్తర, రూరల్, సెంట్రల్, సౌత్ నియోజకవర్గాలతో పాటు చిక్ మగ్ ళూరు స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం విశేషం.

This post was last modified on June 5, 2024 10:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

22 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago